రుణానుబంధం; లతాశ్రీ
 వాలు కుర్చీలో కూర్చుని తదేకంగా తనకు వచ్చిన ఉత్తరాన్ని చూస్తోంది.ఫారిన్ లో సెటిల్ అయిన తన బిడ్డలకు తన సంపాదన అవసరం .తను అవసరం లేదు.డబ్బుసంపాదనే ఒకటే ధేయమైన తన బిడ్డలను తలచుకొని ఏడవని క్షణం లేదు.
ఎంతో అపురూపమైన వస్తువు దగ్గరగా చూస్తున్నా అనుభూతితో చూస్తోంది. ఆ ఉత్తరం చదివి రజిని మనసు ఎంత ఆనంద పడిందో ! ఆమెను చూస్తుంటే తెలుస్తోంది.
అలా అలా ఆలోచిస్తూ గతంలోకి జారుకుంది రజిని మనసు. తను ఉపాధ్యాయినిగా లక్కవరం లో పనిచేస్తున్న రోజులవి... బాలాజీ అని విద్యార్థి పాఠశాలకు గత కొన్ని రోజులుగా రాకపోవడంతో తల్లిదండ్రులను పిలిచి విచారించింది. మేము పంపడానికి ఎంత ప్రయత్నించినా బాలాజీ పాఠశాలకు ససేమిరా అంటున్నాడు రావడం లేదు అని తల్లిదండ్రులు వాపోయారు.
విషయం ఏంటో తెలుసుకోవాలని ఉత్సుకతతో తనే బాలాజీ ఇంటికి వెళ్ళింది. బాలాజీ టీచర్ ని చూసి దాక్కున్నాడు తనే చొరవగా వెళ్లి బాలాజీ ఇటు రా అని పిలిచింది. తను కరాఖండిగా రానని చెప్పేశాడు. నేను నిన్ను పాఠశాలకు తీసుకుపోవడం లేదు ఇవాళ నా పుట్టినరోజు సందర్భంగా పాఠశాలలోని అందరి విద్యార్థులకు చాక్లెట్లు ఇచ్చాను నీకు కూడా ఈ చాక్లెట్ ఇచ్చి పోవాలనే వచ్చాను. ఇదిగో నీకు ఇష్టమైతే ఈ ఫైవ్ స్టార్ చాక్లెట్ తీసుకో అన్నది చాక్లెట్ అనగానే దగ్గరకు వచ్చాడు. 
బాలాజీ రేపు మన పాఠశాలలో గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం అందులో నువ్వు కూడా పాట పాడుతావా అని అడిగింది. బెరుగ్గా చూశాడు నువ్వేం భయపడకు నీకు ఇష్టమైతేనే రేపు పాఠశాలలో ఎవరెవరైతే పాటలు పాడుతారు కథలు చెప్తారు వాళ్ళకందరికీ దీనికన్నా పెద్ద ఫైవ్ స్టార్ చాక్లెట్లు ఇవ్వాలని మన హెచ్ఎం గారు అంటుంటే విన్నాను అందుకే నువ్వు రెండవ తరగతిలో చదువుతున్నప్పుడు గాంధీతాతకు సంబంధించి పాట పాడావు కదా ఆ పాట  పాడుతావేమో అని అడిగాను అంతే అన్నది.
మొదటగా ఆశ చూపినా.. అతని కళ్ళలో ఏదో దైన్యం కనబడింది రజనికి.
సరే నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు చెబితే నేను దానికి పరిష్కారం ఆలోచిస్తాను నువ్వు చాలా తెలివైన వాడివి ఇలా పాఠశాలకు దూరం కావడం ఏ మాత్రం బాగాలేదు అన్నది రజిత.
తనను ప్రశంసించడంతో బాలాజీ కాస్త ఊరట చెంది మరేమో! మరేమో! నాకు...హా నీకు అంది. నాకు రెండవ తరగతిలో పాఠాలు వచ్చు కాని ఇప్పుడు మూడో తరగతిలో చదవగలనా అని తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు.ఓస్!
దీనికేనా ఇంత భయపడుతున్నావ్.
నీకు పాఠాలు నేను చెబుతాను ఏం భయపడకు ఏ అనుమానం ఉన్న నన్ను అడిగితే నేను చెబుతాను అంటూ అతడిని సముదాయించింది.అయితే తప్పకుండా పాఠశాలకు వస్తాను అన్నాడు సంతోషంగా....చిన్న పిల్లలతో కాస్త ఓర్పుగా మాట్లాడితే,వారిలోని శక్తి సామర్థ్యాలు ప్రశంసిస్తే వారు దైర్యం గా ముందుకెళతారు అనుకుంటూ ఇంటికి చేరింది 
మరుసటి రోజునుండి బాలాజీ  రజిత టేబుల్ పక్కనే మకాం వేశాడు.చురుకైన విద్యార్థిగా అభినందనలు అందుకున్నాడు.అతనికి ఏ చిన్న సందేహం కలిగినా తననువెదికే  అతని కళ్ళు..అతనికి ఎంత చనువు పెరిగిందంటే రజని మేడం వస్తువులు తనకే హక్కుఅన్నట్లు ప్రవర్తించే వాడు.ఎవరిని ముట్టనిచ్చేవాడు కాదు.రజని మేడం మాట చెబితే వేదం లాగా అనుసరించే వాడు.రజనికి ట్రాన్సఫర్ అయినప్పుడు బాలాజీ ఏడ్చిన ఏడ్పు ఇప్పటికీ గుర్తే...ఆ పాఠశాలలో తన మానస పుత్రుడు అంటూ అందరూ అన్న మాటలు గుర్తొచ్చి మనసు ఉప్పొంగింది.
ఇన్నేళ్ళ తరువాత తనని గుర్తుంచుకొని....అమ్మా అని పిలుస్తూ రాసిన ఉత్తరాన్ని తడిమి ,మరలా మరలా..చదివి తన అనుబంధాల ఆస్తి ని తనివితీరా చూసుకుంటోంది.తనలో తాను మురిసిపోతోంది .తన భార్య ముఖంలో సంతోషాన్ని చూసిన అభిరామ్ సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ...రజితా ఎన్నాళ్ళకు నీ మొహంలో ఆనందం చూస్తున్నా అంటూ ఇంతకీ ఆ ఉత్తరం ఎవరూ రాశారు అంటూ ఉత్తరం తీసుకొని చదివాడు.
నీ బిడ్డలు నీకు దూరమైన..నీ మానస పుత్రుడి పెళ్ళైనా నీ చేతులమీద జరగాలని దేవుడు వాంచించాడేమో.....సరే పద చాలా పొద్దుపోయింది అంటూ లేవదీశాడు .. రజిని ఆ ఉత్తరాన్ని గుండెలకు హత్తుకొని ఆనందంగా పడుకుంది..ఇక లేవలేదు.
బాలాజీ సొంత బిడ్డలా కర్మకాండలు నిర్వర్తించాడు..సొంత బిడ్డలు పొరుగు గడ్డ నుండి దృశ్యాలు తిలకించి తమ రుణం తీర్చుకున్నారు.భార్య సంపాదించుకున్న అనుబంధాల ఆస్తి ని తనివితీరా చూస్తూ సంతోషించాడు అభిరామ్.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం