వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి,9182244143
 సర్వ సంగ పరిత్యాగి  కాషాయ ధారి  ప్రపంచానికి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి వచ్చిన మహా మేధావి  కంచి  పరమాచార్య మహాస్వామి చంద్రశేఖర సరస్వతి స్వాములవారు  సీతారామ కళ్యాణం చిత్రంలోని అన్నగారి నటన గురించి విని  ప్రత్యేకంగా సినిమాను చూసి అన్నగారి నిమెచ్చి  వారిని ఆహ్వానించి  తన శిష్య గణ సముదాయం మధ్య  విశ్వవిఖ్యాత నట సార్వ    భౌమ బిరుదు ప్రదానం చేయడం విశేషo రాముడు ఎలా ఉంటాడో ఎలా ప్రవర్తిస్తాడో ఎలా మాట్లాడుతారో  స్వామివారికి తెలిసినట్టుగా మరి ఎవరికీ తెలియదు కదా  అలాంటి మహర్షి భౌతిక సుఖాలకు దూరంగా ఉన్నవాడు  ఆధ్యాత్మికత పుణికి పుచ్చుకున్న  ఆ పాత్ర నిజ స్వరూపాన్ని  ప్రత్యక్షంగా వీక్షించి  రామారావు గారికి బిరుదు ప్రదానం చేయడం చరిత్రలో మరెక్కడా జరగని విశేషం  ఎన్టీఆర్ ఎన్ని బహుమతులు పొందినా ఎన్ని  బిరుదులు పొందినా దేశానికి ఎంత మంచి చేసినా స్వామివారి కటాక్షం తరువాతనే  కనుకనే ఎన్టీఆర్ మరణించి భౌతికంగా ఎన్ని రోజులైనా  సంవత్సరాలయిన జ్ఞాపకం చేసుకోవడానికి కారణం స్వామీజీ.చిన్నపిల్లల నుంచి  పెద్దల వరకు ప్రతి ఒక్కరూ  పెరుగును ఇష్టపడని వాడు లేరు  ఎలాంటి పెరుగు తినాలి అని చెబుతున్నాడు
బ్రాహ్మణులకు  భోజన ప్రియులు అని పేరు కాళిదాసు అద్భుతమైన  రుచిని మనకు అందించాడు  ఎలాంటి పెరుగు రుచిగా ఉంటుందో చెప్పాడు  గవిడి గేదెను తీసుకువచ్చి దాని పాలు తీసి వేడి చేసి  ఆ వేడి చేయడం కూడా  శరదృతువు లో చంద్రుడు ఇచ్చే  వెన్నెల ఏ రంగులో ఉంటుందో ఆ రంగు వచ్చేంతవరకు కాచి ఆర్పి తోడు వేసి  తరువాత మీగడ పెరుగు తిన్నట్లయితే దాని రుచి  చెప్పడానికి వీలు లేదు అంటాడు కాళిదాసు కానీ శాస్త్రజ్ఞులు రాత్రిపూట భోజనం పెరుగు తో చేయడం వల్ల రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించి ఆయుషు తగ్గుతుంది అని చెప్తారు  ఏ రోజు పెరుగుతో భోజనం చేయాలని అనుకుంటే ఆరోజు చాపల కూర వాడకూడదు అలా చేసినట్లయితే అజీర్ణపాలవుతారు.
చాలామందికి తెలుగులో మామిడిపండు రసం నంజుకుని తినే అలవాటు ఉంటుంది అలాంటి వారికి  అజీర్ణ వ్యాధితో పాటు ఎసిడిటీ కూడా వస్తుంది  కొంతమంది పెరుగు లో బెల్లం కలుపుకుంటారు  దీనివల్ల దగ్గు జలుబు జ్వరం వచ్చే అవకాశం ఉంది  పెరుగు అన్నంతో పాటు కొంతమంది పరాటా తీసుకునే వారికి అజీర్ణంతోపాటు నీరసం కూడా వస్తుంది పాలు పెరుగు కలిపి తీసుకుంటే కడుపులో సమస్యలు ఇన్ఫెక్షన్స్ వస్తాయి  పెరుగు తిన్న తర్వాత చాయ్ టీ తాగితే జీవక్రియ వ్యవస్థలో అసమతుల్యత  పెరుగుతుంది  తెలుగులో ఉల్లిపాయ నంజుకున్న వాళ్ళకి మొటిమలు రావడం చికాకుగా ఉంటo జబ్బులు రావడం సామాన్యం  కనుక పెరుగుని పెరుగు గానే వాడాలి తప్ప మిగిలిన వాటితో భోజనం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు  వారి మాటలను మనం  అనుసరించినట్లయితే ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది



కామెంట్‌లు