చిన్ననాడే అన్నదమ్ములు;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
చిన్ననాడే
అన్నదమ్ములు
అనురాగాలు ఆప్యాయతలు 

పెరిగి పెద్దయ్యాక
పెళ్లిళ్లు అయ్యాక
పాలివారు,పగవారు

వ్యక్తిగత స్వార్థం పెరిగి
ఒకరంటే ,మరొకరికి పడక
పగవారై 

పరాయిఇంటినుండొచ్చిన
కోడళ్ళు
తన భర్తే సర్వస్వమని
ఇంటివారందరి ఆజ్ఞలు శిరసావహించనని

నేను నా మొగున్ని వరకట్నమిచ్చి
కొనుక్కున్నానని

గంపెడు సంతానమున్న 
ఈ పెద్ద కుటుంబంలో నేను ఇమడలేను
వేరుకాపురముంటే తప్పా 
నీతో కాపురం చేయను
అని భీష్మంచుకొని కూర్చున్న
 ఆ  ఇంటి పెద్దకోడలు

కొడుకుల పెళ్లీలన్నీ అయిపోయాక వేరు కాపురం ఉందురు లెండి అన్నా వినని
కోడలు

తప్పని పరిస్థితుల్లో వేరుకాపురము

తల్లిదండ్రుల ఎడబాపినట్టు

అన్నదమ్ముల ఎడబాపినట్టు

అవసాన దశకొస్తున్నతల్లిదండ్రుల
భుజాలపై కుటుంబ ఆర్థిక సామాజిక
భారాన్ని మోపడం

చదువు పూర్తికాని
ఇద్దరు తమ్ముళ్ళు పెళ్లి కావాల్సిన
ఒకచెళ్ళెలు
ఇక రెండవ మూడవ కుమారుల
జీవితాల్ని ప్రమాదంలో పడదోసిన
పెద్దకుమారుడి వేరు కాపురం

ఆ తల్లిదండ్రులు ఆశలు, కొడుకులిద్దరి అడియాశలయ్యాయి

కుమారుల చదువులు అర్థాంతరంగా
నిలిచిపోయాయంటు
తల్లిదండ్రుల మనోవేదన

ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో 
అడ్డాల నాడు బిడ్డలు కానీ
గడ్డాలు వచ్చాక బిడ్డలా!?
అని నిట్టూర్చిన తల్లిదండ్రులు 
====================================
(మే- 24 ‌ -జాతీయసోదరుల దినోత్సవం సందర్భంగా వ్రాయబడిన కవిత ఇది)

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం