చదువు ;- సన తబస్సుమ్- తొమ్మిదవ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘనపూర్-మెదక్ జిల్లా -చరవాణి: 9959730286
   అనగనగా బాలానగర్ అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో చిన్న అడవి ఉండేది. అడవిలో జంతువులు, పక్షులు జీవించేవి. సోమేశ్ అనే వేటగాడు ప్రతిరోజు చెరువులో చేపలను పట్టుకువెళ్లేవాడు. అలాగే పక్కనున్న అడవిలోకి వెళ్లి చిన్న చిన్న జంతువులను వేటాడి జీవించేవాడు. 
           సోమేశ్ కు ఒక్కగానొక్క కుమారుడు రాకేష్ పదవ తరగతి చదువుతున్నాడు. రాత్రి పగలు బాగా చదువుతూ ప్రతిరోజు బడికి వెళ్లేవాడు. ప్రతిసారి రాకేష్ ను తండ్రి సోమేష్ తనతో అడవికి వచ్చి జంతువులను వేటాడి జీవించమని, తాను జంతువులను ఎలా వేటాడాలో నేర్పుతానని అనేవాడు. కానీ రాకేష్ తాను బాగా చదువుకొని గొప్ప డాక్టర్ ను అవుతానని అనేవాడు. డాక్టర్ చదివి ఏం చేస్తావ్..‌ నాతో బ్రతకడం నేర్చుకో అంటూ సోమేష్ వెళ్లేవాడు. రాకేష్ మాత్రం బాగా చదువుకునేవాడు.
          ఒకరోజు రాకేష్ ను తండ్రి సోమేశ్ అడవికి తీసుకెళ్తాడు. సోమేశ్ అడవిలో వేటాడే సమయంలో పట్టు తప్పి బాగా గాయాల పాలవుతాడు. రాకేష్ బాగా అరిచి జనం సహాయంతో ఆసుపత్రికి తీసుకువెళ్తాడు. అందరూ సోమేశ్ చనిపోయాడని అనుకుంటారు. కానీ డాక్టర్ చక్కని వైద్యం మూలంగా సోమేశ్ బ్రతుకుతాడు. అందరూ సంతోషపడతారు. 
            తర్వాత రాకేష్ ను బాగా చదివించి, తండ్రి సోమేశ్ గొప్ప డాక్టర్ గా చూడాలనుకుంటాడు. రాకేష్ కూడా బాగా చదువుకొని డాక్టర్ గా మంచి పేరు తెచ్చుకుంటాడు. చాలామందికి వైద్యం చేసి రాకేష్ ప్రాణాలు కాపాడుతుంటే, తండ్రి సోమేష్ ఆనందించసాగాడు. అలాగే ప్రాణాలు తీసి జంతువులను చంపడం మహా పాపమని జంతువుల వేట మానేస్తాడు. 

నీతి: మనిషి ఆలోచనలు ఎప్పటికైనా మంచి మార్గం వైపు నడిపిస్తాయి.


కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం