నవ్వుతూ బతకాలిరా !!!!;-సి.హెచ్.ప్రతాప్
 1, మీకు ట్రీట్ మెంట్ పూర్తయ్యింది.టెన్షన్  రాకుండా ఒక ఆర్నెల్లపాటు జాగ్రత్తగా వుండండి.ఫీజు అయిదు వందలివ్వండి” అని అడిగాడు డాక్టర్ దైవాధీనం.
“ సారీ డాక్టర్ ! టెన్షన్ వచ్చే పనులు చెయొద్దని మీరేగా చెప్పారు. దయచేసి ఫీజు అడిగి టెన్షన్ తెప్పించవద్దు” అని వెళ్లిపోయాడు మహేష్.
 
2."అమ్మాయికి, అబ్బాయికీ మధ్య వుండే ఒక తేడా చెప్పు?" కొంటెగా అడిగాడు కిరణ్ తన ప్రేయసి భానుని
 
" అబ్బాయి అమ్మాయిల ముందు ఇంప్రెషన్ కొట్టెయ్యడానికి ఒక రూపాయి వస్తువును రెండు రూపాయలి ఇచ్చి కాలర్ ఎగరేస్తాడు. అదే అమ్మాయి అయితే అబ్బాయి ముందు అదే ఇంప్రేషన్ కొట్టెయ్యడానికి రెండు రూపాయల  వస్తువుకు గంటలకు గంటలు బేరం చేసి ఒక రూపాయికి కొంటుంది" చెప్పింది భాను.
 
3."మళ్ళీ ఎప్పుడు కనిపించమంటేరు డాక్టర్ గారు" అడిగాడు ఆ రోజే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అవుతున్న కాంతారావు.
 
" ఆర్ధికంగా నిలదొక్కుకున్న తర్వాత కనిపించు. మళ్ళీ టెస్టులు చేసి ఆసుపత్రిలో ఎప్పుడు చేరాలో చెబుతాను" అలవాటుగా అనేసి నాలిక కొరుక్కున్నాడు డాక్టర్ వెర్రి వెంగళ్ళప్ప
 
4.. "ఎందుకురా సుబ్బా కత్తిని గ్యాస్ మంటలో కాలుస్తున్నావు ?" అడిగాడు పరమేశం.
 
"కత్తితో పొడుచుకొని ఆత్మ హత్య చేసుకుందామని" చెప్పాడు సుబ్బారావు.
 
"అయితే కత్తిని కాల్చడమెందుకు ? ?"
 
"ఇన్ఫెక్షన్ రాకుండా ఉండేందుకు" అసలు సంగతి చెప్పాడు సుబ్బారావు.

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం