వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి.
 తులసి ఆకును దైవ స్వరూపంగా భావిస్తుంది భారతదేశం  ఉదయం తులసి చెట్టుకు పూజ చేయకుండా  ఏ గృహిణి తన పని చేసుకోదు  ఆ ఆకు తినడం వల్ల  మానవులలో అనేక రుగ్మతలు లేకుండా పోతాయి  నన్ను కూడా దేవుని పూజలో వాడతారు కానీ నా చివరి క్షణాలు దేవుని నిర్ణయం అండి ఎంతో వినయంగా  దేవుడు సంతోషించాడు తన మెడలో భారంగా తన పాదాల చెంత తులసి దళములో భక్తుడి సేవించే తీర్థంలో ఉండేట్లుగా పవిత్ర జీవితం ఆ తులసి దళానికి ఇచ్చాడు  కనుకనే నేను నా వల్లే అని అహంకారంతో ఉన్నవారు పతనం చెందుతారు వినయంగా ఉన్నవారు ఉన్నత స్థానం పొందుతారు  ఆకులకే అంతంత శిక్షలు వేసే దేవుడు మనకు ఎలాంటి శిక్షలు వేస్తాడో  కూడా ఆలోచించండి.సమాజంలో స్నేహితుడు మిత్రులు లేకుండా ఉన్న వ్యక్తి ఎవరు ఉండరు  స్నేహితులంతా తమ పబ్బం గడుపుకోవడం కోసం వచ్చిన వాళ్లే  మిత్రులు మాత్రం మనసులు కలిసి ఒకే ఆలోచనతో ఉన్నవారు  ఎవరిలోనైనా ప్రతిభ అనేది ఒక శాతం ప్రేరణ 99%  ఉంటుందని పెద్దలు చెబుతారు  ప్రతి వ్యక్తిలోనూ మంచి చెడు రెండు కూడా ఉంటాయి  చెడును విస్మరించి మంచిని మాత్రమే గ్రహించి అభినందించే గుణం మనకు ఉండాలి  అప్పుడే ఆ బంధం సాఫీగా సాగిపోతుంది  కనుక  అవసరాలకు వచ్చి  తమ బాధలను తీర్చుకునే స్నేహితుల కోసం తాపత్రయపడవద్దు  శ్రీకృష్ణునికి కొన్ని వేల మంది స్నేహితులు ఉన్నారు  కానీ రాముడికి గుహడు ఒక్కడే మిత్రుడు  అలాంటి మిత్రుడిని ఒక్కడిని సంపాదిస్టే చాలు జన్మ చరితార్థం అవుతుంది.
శనగలు మనం తినే పదార్థాల్లో  ఎక్కువ శాతం ఉపయోగించబడేది  దానిని ఉడకబెట్టి గుగ్గిళ్ళుగా తింటారు  కూరల్లో  తిరగ మోత లో తప్పకుండా వేస్తారు అనేక రకాల వంటలు  శనగపిండితో తయారు చేస్తారు ఈ శనగల వాడడం వల్ల జీర్ణ సమస్యలు తొలగిపోతాయి గుండె జబ్బులు దరిదాపుల్లోకి రావు రక్త సరఫరా మెరుగుపడి  బిపి కంట్రోల్ లో ఉంటుంది  మనసులో ఆలోచనలు వచ్చినప్పుడు ఒత్తిడి ఆందోళన ఉండడం ఎవరికైనా సహజం దానిని దూరం చేసేది ఈ శనగలే  ఇవి తిన్నవారు రోజంతా ఉత్సాహంగా ఉంటారు ఎముకలు చాలా దృఢంగా మారుతాయి  కాలేయ సమస్యలు ఉన్నవారు అతి త్వరలో కోలుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక ఉడకబెట్టిన శనగలు ప్రతివాడు ఒక కప్పు తినమని పెద్దలు సలహా ఇస్తూ ఉంటారు.
=============================
సమన్వయం ; డా. నీలం స్వాతి 

కామెంట్‌లు