ఎడిసన్ - ఫోర్డు స్నేహబంధం;- - యామిజాల జగదీశ్
 ఎలక్ట్రిక్ బల్బ్ ఆవిష్కర్త అయిన థామస్ ఎడిసన్, కారు రూపకల్పనలో బిజీగా ఉన్న రోజులవి. అయితే తన కంపెనీలో ఒక యువకుడు ఒక ప్రయోగాత్మక కారుని సృష్టించాడని విన్నాడు ఎడిసన్. 
ఎడిసన్ ఆ యువకుడైన హెన్రీ ఫోర్డుని న్యూయార్క్‌లోని ఒక కంపెనీ పార్టీలో కలుసుకున్నాడు. అతని గ్యాసోలిన్ ఆధారిత కారు ఆలోచనను తెలుసుకుని ఎంతగానో ఆకట్టుకున్నాడు. 
విద్యుత్తును శక్తి వనరుగా భావించిన ఎడిసన్, ఫోర్డ్‌ను ప్రోత్సహించాడు.  "యువకుడా, అదీ విషయం! నీలో ప్రయోగాలు చేసే కృషి ఉంది! నీ ఆలోచనాశక్తి నన్నెంతగానో కట్టిపడేసింది. నీ ప్రయోగాలను కొనసాగించు" అని చెప్పాడు.
ఎడిషన్ తో ప్రోత్సహింపబడిన హెన్రీ ఫోర్డ్ తన పనిని కొనసాగించాడు, చివరికి అతనిని సంపన్నుడిగా మార్చిన కారును కనిపెట్టాడు.
1914 డిసెంబర్ 9న, ఎడిసన్ ప్రయోగశాల, కర్మాగారం అగ్నిప్రమాదానికి ధ్వంసమయ్యాయి. అప్పటికి ఎడిసన్ వయస్సు 67 ఏళ్ళు. భీమా సొమ్ములు పొందే అవకాశం లేదు. అయితే అతని పెను నష్టాన్ని గ్రహించిళ హెన్రీ ఫోర్డు ఎడిసన్‌కి 750,000  డాలర్లిచ్చి ఆదుకున్నాడు. నిజానికి ఎడిసన్ మరింత డబ్బు అడిగితే ఇవ్వగల స్థాయిలో ఫోర్డు ఉన్నాడు. కానీ అడగలేదు.
1916లో, ఫోర్డు తన ఇంటిని ఎడిసన్ ఇంటి పక్కనే మార్చాడు.  ఎడిసన్ తర్వాత వీల్ చైర్‌కు పరిమితమైనప్పుడు కూడా ఫోర్డు అతనితో కంటికి రెప్పలా మెలిగాడు.
మరోవైపు థామస్ ఎడిసన్ ఎప్పటికప్పుడు హెన్రీ ఫోర్డ్‌కు నమ్మకం కలిగించాడు. వారి మధ్య స్నేహ బంధానికి గట్టి పునాది వేశాడు.
వీరిద్దరి మైత్రీ బంధం చెప్పే పాఠం ఒకటి... ఇతరుల విజయాలను చూసి ఎప్పుడూ అసూయపడకూడదు. మనం పోటీ పడటంలో గెలవలేకపోతే, మన ముందున్న వ్యక్తి సంచలనొల సృష్టికి సహాయపడాలి. ఒక కొవ్వొత్తి మరొక దానిని వెలిగించడం ద్వారా దాని కాంతిని అది కోల్పోదంటే ఇదేమరి!!

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం