ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో బాలుడి జన్మదిన వేడుకలు

 కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఊషన్నపల్లి ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పెంతల రిత్విక్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పిల్లలకు బిస్కెట్లు, చాకోలెట్లు పంపిణీ చేశారు. పెంతల రిత్విక్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానంలో  నిలవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్ ఆశీర్వదించారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు  ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ...ప్రయివేట్ పాఠశాలల్లో కంటే ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలో పిల్లలకు అత్యుత్తమ బోధనను అందిస్తున్నామని, సత్ప్రవర్తన, క్రమశిక్షణతో పాటు  పిల్లల సర్వతోముఖాభివృద్ధికి (ఆల్ రౌండ్ డెవలప్మెంట్) విశేషంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పిల్లల్ని జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు పంపిస్తున్నామన్నారు. 3,4,5 తరగతుల పిల్లలకు ఆదర్శ,  గురుకుల, నవోదయ, సైనిక్ స్కూల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు ఈర్ల సమ్మయ్య తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోనే కూనారం గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు చైతన్యవంతులని, మిగతా గ్రామాల వారికి వారు ఆదర్శవంతులని ఆయన అన్నారు. ప్రైవేటు పాఠశాలల బస్సులను కూనారం గ్రామంలోకి రానీయకుండా అడ్డుకొని, పిల్లలందరినీ అక్కడి ప్రభుత్వ పాఠశాలకు పంపించడం గొప్ప విషయం అన్నారు. ఊషన్నపల్లి గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలని, గ్రామంలోని పిల్లలందరినీ ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వల్ల ప్రభుత్వం అదనంగా టీచర్లను పంపించడమే కాకుండా లక్షలాది రూపాయల నిధులతో  అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడతారన్నారు. ఇంకా డెస్క్ బెంచీలు, కుర్చీలు, టేబుళ్ళతో పాటు ఇతర అన్ని సౌకర్యాలను కల్పిస్తారన్నారు. ఊషన్నపల్లి ప్రభుత్వ బడిలో రాబోయే సెప్టెంబర్ నెల వరకు పిల్లల్ని బడిలో చేర్చుకుంటామని, పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల పట్ల మోజు వీడి, అమ్మ ఒడిలాంటి ఊషన్నపల్లి ప్రభుత్వ బడిలో తమ పిల్లల్ని చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు.
కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం