కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఊషన్నపల్లి ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పెంతల రిత్విక్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పిల్లలకు బిస్కెట్లు, చాకోలెట్లు పంపిణీ చేశారు. పెంతల రిత్విక్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్ ఆశీర్వదించారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ...ప్రయివేట్ పాఠశాలల్లో కంటే ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలో పిల్లలకు అత్యుత్తమ బోధనను అందిస్తున్నామని, సత్ప్రవర్తన, క్రమశిక్షణతో పాటు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి (ఆల్ రౌండ్ డెవలప్మెంట్) విశేషంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పిల్లల్ని జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు పంపిస్తున్నామన్నారు. 3,4,5 తరగతుల పిల్లలకు ఆదర్శ, గురుకుల, నవోదయ, సైనిక్ స్కూల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు ఈర్ల సమ్మయ్య తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోనే కూనారం గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు చైతన్యవంతులని, మిగతా గ్రామాల వారికి వారు ఆదర్శవంతులని ఆయన అన్నారు. ప్రైవేటు పాఠశాలల బస్సులను కూనారం గ్రామంలోకి రానీయకుండా అడ్డుకొని, పిల్లలందరినీ అక్కడి ప్రభుత్వ పాఠశాలకు పంపించడం గొప్ప విషయం అన్నారు. ఊషన్నపల్లి గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలని, గ్రామంలోని పిల్లలందరినీ ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వల్ల ప్రభుత్వం అదనంగా టీచర్లను పంపించడమే కాకుండా లక్షలాది రూపాయల నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడతారన్నారు. ఇంకా డెస్క్ బెంచీలు, కుర్చీలు, టేబుళ్ళతో పాటు ఇతర అన్ని సౌకర్యాలను కల్పిస్తారన్నారు. ఊషన్నపల్లి ప్రభుత్వ బడిలో రాబోయే సెప్టెంబర్ నెల వరకు పిల్లల్ని బడిలో చేర్చుకుంటామని, పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల పట్ల మోజు వీడి, అమ్మ ఒడిలాంటి ఊషన్నపల్లి ప్రభుత్వ బడిలో తమ పిల్లల్ని చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు.
ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో బాలుడి జన్మదిన వేడుకలు
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని ఊషన్నపల్లి ఇంగ్లిష్ మీడియం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న పెంతల రిత్విక్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పిల్లలకు బిస్కెట్లు, చాకోలెట్లు పంపిణీ చేశారు. పెంతల రిత్విక్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయుడు అమృత సురేష్ కుమార్ ఆశీర్వదించారు. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ...ప్రయివేట్ పాఠశాలల్లో కంటే ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలో పిల్లలకు అత్యుత్తమ బోధనను అందిస్తున్నామని, సత్ప్రవర్తన, క్రమశిక్షణతో పాటు పిల్లల సర్వతోముఖాభివృద్ధికి (ఆల్ రౌండ్ డెవలప్మెంట్) విశేషంగా కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పిల్లల్ని జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీలకు పంపిస్తున్నామన్నారు. 3,4,5 తరగతుల పిల్లలకు ఆదర్శ, గురుకుల, నవోదయ, సైనిక్ స్కూల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇస్తున్నట్లు ఈర్ల సమ్మయ్య తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోనే కూనారం గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు చైతన్యవంతులని, మిగతా గ్రామాల వారికి వారు ఆదర్శవంతులని ఆయన అన్నారు. ప్రైవేటు పాఠశాలల బస్సులను కూనారం గ్రామంలోకి రానీయకుండా అడ్డుకొని, పిల్లలందరినీ అక్కడి ప్రభుత్వ పాఠశాలకు పంపించడం గొప్ప విషయం అన్నారు. ఊషన్నపల్లి గ్రామస్తులు, ప్రజా ప్రతినిధులు కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలని, గ్రామంలోని పిల్లలందరినీ ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని ఈర్ల సమ్మయ్య కోరారు. ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం వల్ల ప్రభుత్వం అదనంగా టీచర్లను పంపించడమే కాకుండా లక్షలాది రూపాయల నిధులతో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపడతారన్నారు. ఇంకా డెస్క్ బెంచీలు, కుర్చీలు, టేబుళ్ళతో పాటు ఇతర అన్ని సౌకర్యాలను కల్పిస్తారన్నారు. ఊషన్నపల్లి ప్రభుత్వ బడిలో రాబోయే సెప్టెంబర్ నెల వరకు పిల్లల్ని బడిలో చేర్చుకుంటామని, పిల్లల తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల పట్ల మోజు వీడి, అమ్మ ఒడిలాంటి ఊషన్నపల్లి ప్రభుత్వ బడిలో తమ పిల్లల్ని చేర్పించాలని ఈర్ల సమ్మయ్య కోరారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి