🌟శ్రీ శంకరాచార్య విరచిత🌟నుద్యాద్ దయాను పవనో ద్రవిణాంబు ధారామ్అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే !దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయు దూరంనారాయణ ప్రణయినీ నయనాంబు వాహ !!భావం: లక్ష్మీదేవి యొక్క నీలమేఘములవంటి నల్లని కన్నులు, ఈ దరిద్రుడనెడి విచారగ్రస్త పక్షి పిల్లపై దయ అనెడి చల్లని గాలితో కూడుకొని వీచి, ఈ దారిద్యమునకు కారణమైన పూర్వజన్మల పాపకర్మలను దూరముగా తొలగద్రోసి, నామీద ధనమనెడి సోనలను ధారాళముగా కురియించుగాక !విశేషార్థము: రెండవ పాదము నందలి ,'అకించన'శబ్దమునకు 'దరిద్రు' డనియు, 'పాపములు లేని'వాడనియు రెండర్థములు.*****
కనుకధారాస్త్రోత్రం;- కొప్పరపు తాయారు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి