న్యాయాలు -575
నారికేళాంబు న్యాయము
*****
నారికేళము అనగా కొబ్బరికాయ. అంబు అనగా నీరు, జలము అని అర్థము.
కొబ్బరికాయ లోనికి నీరెలా వస్తుందో ఎవరికి తెలియదని అర్థము.
సైన్స్ ఎంత చెప్పినా, ఎన్ని ఉదాహరణలు, సహేతుకమైన ఋజువులు చూపినా సామాన్యులకు మాత్రం కొబ్బరికాయలోకి నీళ్ళు రావడం ఒక వింతే.ఇక భక్తులకైతే అదొక అద్భుతమైన దైవ సంఘటనే.
అంతే కాదు పూజా కార్యక్రమాల్లో భక్తులు తప్పకుండా కొబ్బరికాయను కొడుతుంటారు. ఎందుకంటే కొబ్బరికాయ పై పెంకు మనలోని అహంకారానికి ప్రతీక అని, కొబ్బరికాయగా కొట్టడం అంటే అహంకారాన్ని విడిచి పెట్టడమని అర్థము.అలాగే లోపల ఉన్న తెల్లని కొబ్బరి ముక్కలను నైవేద్యంగా పెట్టడం అంటే మన స్వచ్చమైన మనసును భగవంతునికి అర్పించడమనీ అర్థము. ఇక లోపలి తీయని నీరు నది నీరు లాంటిదనీ,నది నీరు ఏం చేస్తుంది? పొలాలను సస్యశ్యామలం చేసి పసిడి పంటలను ఇచ్చి లోకానికి మేలు చేస్తుంది కదా! అలాగే మనమూ తీయని జలములా ఉపకారం చేయాలని అర్థము.కొబ్బరి కాయను ఇన్నింటికి ప్రతీకగా మన పెద్దలు చెప్పారు.
అలాగే మన జీవితంలో జరిగే మంచి చెడుల సంఘటనలు కూడా కొబ్బరికాయలోని నీటితో పోల్చి చెప్పడం విశేషం.అప్పటి వరకు మనకెంతో సామాన్యులుగా కనిపించే వారే ఒక్క సారిగా వారిలోని ప్రతిభ కానీ , మంచితనం కానీ లోకానికి, మనకు తెలిసినప్పుడు ఆశ్చర్యానికి లోనవుతుంటాం. కొబ్బరికాయలో దాగున్న నీరులా బయటికి వస్తుంది.
అయితే వ్యక్తులు సంపాదించే సంపాదనను కొబ్బరికాయ, వెలగపండుతో పోల్చి అదెలా సమకూరుతుందో,ఎలా పోతుందో తెలియదంటూ రాసిన సుమతీ శతక కర్త పద్యాన్ని చూద్దామా...
"సిరి తా వచ్చిన వచ్చును/ సలలితముగ నారికేళ సలిలము భంగిన్/ సిరి తా బోయిన బోవును/ కరిమింగిన వెలగ పండు కరణిని సుమతీ!"
అనగా సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వచ్చాయో తెలియనట్లుగానే వచ్చి చేరుతుంది.అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు మాయమైనట్లు సంపద కూడా తెలియకుండానే మాయమవుతుంది అని అర్థము.
ఇదే అర్థం వచ్చేలా మన పెద్దవాళ్ళు ఓ సామెత తరచూ చెబుతూ ఉంటారు."మనిషికి కుబేర వైభవం - కుచేల దారిద్ర్యం ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు.ఈ మాటలు అక్షర సత్యాలు.ఇలా ఒక్కసారిగా కుబేర వైభవంతో వెలిగిపోయే వారు.మన కళ్ళముందే ఎంతో వైభవంగా బతికి ఒక్కసారిగా ఆర్థికంగా చితికి పోయి కుచేలుడులా దారిద్ర్యం అనుభవించే వారు మన జీవితంలో తారసపడుతుంటారు.
నిలకడ లేని సంపాదన మీద అతిగా దృష్టి పెట్టి అత్యాశకు పోయి అన్నీ పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకుండా , ఎప్పుడూ మన వెంటే,మనలోనే పంచినా,తుంచినా తరగని నిధి అయిన జ్ఞాన సంపద, మానవీయ విలువల మీద దృష్టి పెట్టాలి.అప్పుడే అన్ని సంపదలు సమకూరుతాయి.కరి మింగిన వెలగపండులా కాకుండా నారికేళ జలములా జీవితమంతా సమాజంలో ఉన్నతమైన వ్యక్తిత్వంతో వెలిగిపోవచ్చు.నలుగురికి ఆదర్శంగా నిలవవచ్చు.
"నారికేళాంబు న్యాయము"ను మన పెద్దలు ఎందుకు వ్యక్తులకు అన్వయించి చెప్పారో అర్థం అయింది కదా! చివరగా ఓ రెండు పొడుపు కథలు . వీటిని విప్పి చెప్పాల్సిన బాధ్యత మీదే సుమా!
1"ఆకాశాన అంబు,అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్లు ".2. "చెయ్యని కుండ,పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం,తియ్యగ నుండు." చెబుతారు కదూ!
నారికేళాంబు న్యాయము
*****
నారికేళము అనగా కొబ్బరికాయ. అంబు అనగా నీరు, జలము అని అర్థము.
కొబ్బరికాయ లోనికి నీరెలా వస్తుందో ఎవరికి తెలియదని అర్థము.
సైన్స్ ఎంత చెప్పినా, ఎన్ని ఉదాహరణలు, సహేతుకమైన ఋజువులు చూపినా సామాన్యులకు మాత్రం కొబ్బరికాయలోకి నీళ్ళు రావడం ఒక వింతే.ఇక భక్తులకైతే అదొక అద్భుతమైన దైవ సంఘటనే.
అంతే కాదు పూజా కార్యక్రమాల్లో భక్తులు తప్పకుండా కొబ్బరికాయను కొడుతుంటారు. ఎందుకంటే కొబ్బరికాయ పై పెంకు మనలోని అహంకారానికి ప్రతీక అని, కొబ్బరికాయగా కొట్టడం అంటే అహంకారాన్ని విడిచి పెట్టడమని అర్థము.అలాగే లోపల ఉన్న తెల్లని కొబ్బరి ముక్కలను నైవేద్యంగా పెట్టడం అంటే మన స్వచ్చమైన మనసును భగవంతునికి అర్పించడమనీ అర్థము. ఇక లోపలి తీయని నీరు నది నీరు లాంటిదనీ,నది నీరు ఏం చేస్తుంది? పొలాలను సస్యశ్యామలం చేసి పసిడి పంటలను ఇచ్చి లోకానికి మేలు చేస్తుంది కదా! అలాగే మనమూ తీయని జలములా ఉపకారం చేయాలని అర్థము.కొబ్బరి కాయను ఇన్నింటికి ప్రతీకగా మన పెద్దలు చెప్పారు.
అలాగే మన జీవితంలో జరిగే మంచి చెడుల సంఘటనలు కూడా కొబ్బరికాయలోని నీటితో పోల్చి చెప్పడం విశేషం.అప్పటి వరకు మనకెంతో సామాన్యులుగా కనిపించే వారే ఒక్క సారిగా వారిలోని ప్రతిభ కానీ , మంచితనం కానీ లోకానికి, మనకు తెలిసినప్పుడు ఆశ్చర్యానికి లోనవుతుంటాం. కొబ్బరికాయలో దాగున్న నీరులా బయటికి వస్తుంది.
అయితే వ్యక్తులు సంపాదించే సంపాదనను కొబ్బరికాయ, వెలగపండుతో పోల్చి అదెలా సమకూరుతుందో,ఎలా పోతుందో తెలియదంటూ రాసిన సుమతీ శతక కర్త పద్యాన్ని చూద్దామా...
"సిరి తా వచ్చిన వచ్చును/ సలలితముగ నారికేళ సలిలము భంగిన్/ సిరి తా బోయిన బోవును/ కరిమింగిన వెలగ పండు కరణిని సుమతీ!"
అనగా సంపద వచ్చినప్పుడు కొబ్బరికాయలోకి నీళ్ళు ఎలా వచ్చాయో తెలియనట్లుగానే వచ్చి చేరుతుంది.అలాగే పోయినప్పుడు ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు మాయమైనట్లు సంపద కూడా తెలియకుండానే మాయమవుతుంది అని అర్థము.
ఇదే అర్థం వచ్చేలా మన పెద్దవాళ్ళు ఓ సామెత తరచూ చెబుతూ ఉంటారు."మనిషికి కుబేర వైభవం - కుచేల దారిద్ర్యం ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో తెలియదు.ఈ మాటలు అక్షర సత్యాలు.ఇలా ఒక్కసారిగా కుబేర వైభవంతో వెలిగిపోయే వారు.మన కళ్ళముందే ఎంతో వైభవంగా బతికి ఒక్కసారిగా ఆర్థికంగా చితికి పోయి కుచేలుడులా దారిద్ర్యం అనుభవించే వారు మన జీవితంలో తారసపడుతుంటారు.
నిలకడ లేని సంపాదన మీద అతిగా దృష్టి పెట్టి అత్యాశకు పోయి అన్నీ పోగొట్టుకునే పరిస్థితి తెచ్చుకోకుండా , ఎప్పుడూ మన వెంటే,మనలోనే పంచినా,తుంచినా తరగని నిధి అయిన జ్ఞాన సంపద, మానవీయ విలువల మీద దృష్టి పెట్టాలి.అప్పుడే అన్ని సంపదలు సమకూరుతాయి.కరి మింగిన వెలగపండులా కాకుండా నారికేళ జలములా జీవితమంతా సమాజంలో ఉన్నతమైన వ్యక్తిత్వంతో వెలిగిపోవచ్చు.నలుగురికి ఆదర్శంగా నిలవవచ్చు.
"నారికేళాంబు న్యాయము"ను మన పెద్దలు ఎందుకు వ్యక్తులకు అన్వయించి చెప్పారో అర్థం అయింది కదా! చివరగా ఓ రెండు పొడుపు కథలు . వీటిని విప్పి చెప్పాల్సిన బాధ్యత మీదే సుమా!
1"ఆకాశాన అంబు,అంబులో చెంబు, చెంబులో చారెడు నీళ్లు ".2. "చెయ్యని కుండ,పొయ్యని నీళ్ళు, వెయ్యని సున్నం,తియ్యగ నుండు." చెబుతారు కదూ!
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి