కవి సోమన్నకు మంత్రాలయంలో సన్మానం

 పెద్దకడబూరు మండల పరిధిలోని కంబదహాళ్ జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలో గణితోపాధ్యాయుడుగా పనిచేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు  గద్వాల సోమన్నను అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన 142వ జాతీయ శతాధిక కవి సమ్మేళనంలో  ఆ సంస్థ అధినేత డా.కత్తిమండు ప్రతాప్,విచ్చేసిన శ్రీ శ్రీ కళావేదిక కార్యవర్గం,  కవులు,కళాకారులు,ప్రముఖులు  పరిమళ విద్యా నికేతన్ పాఠశాల, మంత్రాలయంలో ఘనంగా సన్మానించారు.అనంతరం వీరు రచించిన  "అనుబంధాలు"పుస్తకాన్ని కవులు,పాఠకులు,పాత్రికేయ మిత్రుల సమక్షంలో  పరిచయం చేయడం జరిగింది. అనతి కాల వ్యవధిలో 60పుస్తకాలు వ్రాసి ముద్రించిన శ్రీ గద్వాల సోమన్న గారి విశేష కృషిని ప్రశంసించి,సత్కరించటం విశేషం.ఈ కార్యక్రమంలో కవులు,కళాకారులు శ్రీమతి మళేకర్ నాగజ్యోతి,డా.బల్లూరి ఉమాదేవి, శ్రీమతి సువర్ణ జోషి,శ్రీమతిశోభామణి,శ్రీమతి జి.ఈశ్వరి,శ్రీ డి. కేశవయ్య,ఆరెకటికె నాగేశ్వరరావు, పద్య కవి శ్రీ ఈశ్వరప్ప, సామాజిక కార్యకర్త శ్రీ నీలకంఠ,పి.వీరాచారి మరియు పాత్రికేయ మిత్రులు తదితరులు  పాల్గొన్నారు.
కామెంట్‌లు