ససేమిరా :- గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్.9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా

 స-సే-మి-రా అను అక్షరముల వెనకున్న కథ ఏంటో మీకు తెలుసా బాలలు? తెలియకుంటే ఇప్పుడు తెలుసుకోండి ఆ కథను.
పూర్వం విశాల అను నగరాన్ని నందుడు అను రాజు పరిపాలించుచుండెను. అతనికి సంతానం కానందున బ్రహ్మను గూర్చి తపస్సు చేశేను. బ్రహ్మ ప్రత్యక్షమై ఏం వరం కావాలో అని అడగగా"బ్రహ్మదేవా! వంశాన్ని నిలబెట్టే ఓ కొడుకును ప్రసాదించమని కోరాడు. ఆ వర ప్రభావంచే జయంతుడు అను కుమారుడు కలిగెను. అతన్ని అల్లారుముద్దుగా పెంచసాగెను.
          జయంతుడు గారాబంగా పెరిగినందున అతడు ఎవరి మాటను వినేవాడు కాదు. ఒకరోజు అడవికి వేటకు వెళ్తానని మంకుపట్టు పడ్డాడు. తండ్రి చెప్పినా, మంత్రులు వలదని చెప్పినా వినకుండా వేటకు వెళ్లాడు. వేటాడి వేటాడి అడవిలో అలిసిపోయి ఒక చెట్టు నీడన పరుండెను. ఇంతలో పులి ఒకటి గాండ్రు గాండ్రు మని ఆరుచుచు రాగా జయంతుడు భయపడి చెట్టు పైకి ఎక్కెను. కానీ ఆ చెట్టుపై ఒక బల్లుకము ఉండెను. దానిని చూసి అతడు వనక సాగెను. అప్పుడు"భయపడకు మానవా! నేను నిన్ను ఏమి చేయను"అని అభయమిచ్చి తన ఒడిలో అతనిని పరుండ పెట్టుకొనెను. హాయిగా జయంతుడు నిద్రలోకి జారుకునెను.
         చెట్టు క్రింద ఉన్న పులి"ఓ బల్లూకమా! ఈ మానవులు నీకును నాకును శత్రువులే కదా! వానిని ఏల కాపాడేదవు? వానిని క్రిందకు త్రోసివేయుము. నేను భక్షించెదను. అని అనెను. కానీ శరణు జొచ్చిన వానిని కాపాడేదను గాని విడువ"అని భలోకము గట్టిగా చెప్పెను
             జయంతునికి నిద్రాభంగం కలిగి లేచిన ఫిదప తాను నిద్ర పోగోరి భద్రముగా చూస్తుండమని బల్లూకము జయంతునితో చెప్పెను. అతను సరే అని బల్లూకము నిద్రపోయిన పిమ్మట పిమ్మట క్రింద ఉన్న పులి"రాజపుత్రా ! నీవు ఆ బల్లూకమును నమ్ముకున్నావా! ఎంత వెర్రివాడవు? అది నిన్ను  మింగి వేయును సుమా "అని దాన్ని క్రిందికి త్రోసివేయుము. నేను దాన్ని బక్షించదా. నీవు అప్పుడు చెట్టు దిగి వెళ్ళిపోవచ్చు గదా అని చెప్పాను. జయంతుడు మంచి చెడ్డలు ఆలోచించక ఆ భల్లూకమును క్రిందికి తోసేను. కానీ బల్లూకము క్రింద పడకుండా చుట్టుకొమ్మను పట్టుకొని తనను తాను రక్షించుకొనెను. కృతఘ్నడగు జయంతుని మతి బ్రష్టుడగునట్లు శపించెను.
           అప్పటినుండి అతనికి "ససేమిరా"అను మాట కంటే వేరు మాట రాకుండె. ఎవ్వరేమి అడిగినా ససేమిరాయని మాత్రమే జవాబిస్తుండెను. ఇట్లు మతి చెడి తిరుగుచున్న పుత్రుని చూచి తండ్రి నందుడు దుఃఖించి అతనికి చికిత్స చేయించుటకు అనేక ప్రయత్నాలు చేసెను. తుదకు పూర్వము అతనిచే వెడలగొట్టబడిన మంత్రి శతానందుడను వాడు ఓ కన్య రూపమున వచ్చి స-సే-మి-రా అను అక్షరముతో ప్రారంభించు శ్లోకంతో ఆ బల్లూకము కథను చెప్పాను. ఆ కథ విని జయంతుడు తన మతి బ్రష్టతను కోల్పోయి స్వస్థత నొందెను. తన తండ్రి సంతోషించెను.
       ఇప్పుడు తెలిసిందా!
బాలలు సాసేమిరా వెనుకున్న అసలు కథ.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం