ప్రదక్షిణం అంతరార్థం: - గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి.-సెల్ .9491387977.-నాగర్ కర్నూల్ జిల్లా.
"ప్రదక్షిణం" అను పదములో " ప్ర" అక్షరము పాపాలకు నాశనము.
" ద" అనగా కోరుకున్న కోరికలను తీర్చమని," క్షి " అన్న అక్షరము మరుజన్మ అనేది ఉంటే ఆ జన్మలో మంచి జన్మ ఇవ్వమని," ణ "అనగా అజ్ఞానమును పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని, దేవాలయములో భగవంతుని చుట్టూ తిరిగే ప్రదక్షిణలో ఇంత పింగాణీ అర్థం పరమార్థం దాగి ఉంది. పూర్వకాలంలో ఆదిలో వినాయకుడు పార్వతీ, పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసి ఫలం పొందాడు. కావున మనం భగవంతుని చుట్టూ చేసే ప్రదిక్షిణ విశ్వ ప్రదిక్షిణం అవుతుంది . ఆత్మ ప్రదక్షిణ అని కూడా అంటారు. భగవంతుడా! నేను అన్ని వైపుల నుండి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం. 
     ఏ గుడికి ఎప్పుడు వెళ్లాలి ?
    ((((((((&&&&&))))))))))))
ఉదయాన్నే శ్రీమహావిష్ణు ఆలయానికి, సాయంత్రం పరమేశ్వరుని ఆలయానికి వెళ్లడం శుభప్రదం. శ్రీమహావిష్ణువు స్థితికారకుడు. కావున ఆయన మన జీవన పోరాటంలో నిత్యం మనకు వచ్చే సమస్యలను తొలగిస్తాడు . మన బుద్ధి ద్వారా ఆపదలను తాను తొలగించి మనల్ని ఎల్లవేళలా సుఖంగా ఉండేటట్టు చూస్తాడు.
    పరమేశ్వరుడు లయకారకుడు. కావున రోజు పూర్తవుతున్న సమయంలో దర్శిస్తే మనకు ఆయన రెట్టింపు ఫలాన్ని అందిస్తాడు. తొందరపడకుండా ప్రశాంతంగా నెమ్మదిగా భగవంతుని మనం దర్శించాలి.

కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం