తల్లిని కాపాడిన పిల్లలు - డా.ఎం.హరికిషన్-కర్నూల్-9441032212

 ఒక అడవిలో ఒక మేక వుండేది. దానికి చందమామల్లాంటి బుజ్జిబుజ్జి పిల్లలు వున్నాయి. ఒకరోజు అవన్నీ కలసి మేతకు పోయాయి. అడవంటే మాటలు కాదు గదా... ఆపదలు ఎప్పుడు ఎటువైపు నుంచి ఎలా వచ్చి మీద పడతాయో తెలీదు. ఆ అడవిలో ఒక నక్క వుంది. దాని కన్ను మేక మీద పడింది. ''ఆహా! దొరికిందిరా పసందైన విందు భోజనం'' అనుకుంటా ఎగిరి దాని మీదకు దుంకింది. తల్లీపిల్లలు బెదిరిపోయి తలోదిక్కు పరుగు అందుకున్నాయి. ''ఈ చిన్న చిన్న పిల్లలు నాకెందుకు. ఎన్ని తిన్నా కడుపులో ఒక మూలకు గూడా సరిపోవు. పడితే ఆ పెద్ద మేకనే పట్టాలి. నాలుగు రోజులు కమ్మగా కాలు మీద కాలేసుకోని తినొచ్చు'' అనుకొని దాని వెంట పడింది. అది బెదపడి మరింత వేగంగా వురకసాగింది. దారిలో ఒకచోట ఒక పెద్ద గుంత వుంది. మేక అది చూసుకోలేదు.సక్కగా పోయి దభీమని దానిలో పడిపోయింది. ఆ గుంత చానా లోతుగా వుంది. నక్క వురుక్కుంటా ఆ గోతి కాడికి వచ్చింది. కింద అందేంత దూరంలోనే ఆహారం వుంది. కానీ దిగితె పైకి రావడం అంత సులభం గాదు. ''ఆశకు పోతే గాలానికి చిక్కుకున్న చేపలాగా చావడం ఖాయం. అడవేం చిన్నది గాదు. ఇది కాకపోతే ఇంకొకటి దొరుకుతుంది'' అనుకుంటా గమ్మున తిరిగి వెళ్ళిపోయింది. ఇక్కడ మేకపిల్లలన్నీ తలా ఒక దిక్కు పారిపోయాయి గదా... అవన్నీ మళ్ళా నెమ్మదిగా ఒక చోటికి గుంపయ్యాయి. అమ్మను వెదుక్కుంటా బైలుదేరాయి.
అలావెదుకుతా వెదుకుతా చివరికి ఆ గుంత దగ్గరికి చేరుకున్నాయి. అప్పటికే ఆ మేక బైటకి రావడానికి ఎగిరీ ఎగిరీ అలసిపోయి, ఇంగ లాభం లేదు అనుకోని మౌనంగా వుండిపోయింది. పిల్లలన్నీ ఆ గుంత చుట్టూ చేరాయి. ''అమ్మా... అమ్మా...'' అంటా కళ్ళనీళ్ళు పెట్టుకున్నాయి.
పిల్లలని చూసి తల్లికి గూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. కాసేపటికి అది తేరుకోని ''పిల్లలూ... చీకటి పడతా వుంది. మీరంతా ఇంటికి వెళ్ళండి. ఇక ఈ రోజుతో మీకూ నాకూ ఋణం తీరిపోయింది. మీరంతా హాయిగా కలసి మెలసి వుండండి. అనవసరంగా చిన్న చిన్న వాటికి గొడవ పడకండి'' అంటా మంచిమాటలు చెప్పింది. ఆ మాటలకు పిల్లల కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ''అమ్మా... నీతో బాటు మేమూ ఇక్కడే వుంటాం. చావయినా బతుకయినా నీతోనే. నిన్ను వదలి ఎక్కడికీ వెళ్ళం'' అన్నాయి. అప్పుడు ఒక చిట్టిమేక ''మనం ఇలా గంటలు గంటలు కళ్ళనీళ్ళు పెట్టుకొని ఏం లాభం లేదు. చీకటి పడేలోగా అందరం తప్పించుకోవాలి. వుత్తమాటలతో, కళ్ళనీళ్ళతో పనులు గావు. బుర్రలకు పదును పెట్టండి. సమయం చాలా తక్కువగా వుంది'' అనింది. అన్నీ ఆలోచనలో పడ్డాయి. కాసేపటికి ఒక బుజ్జిమేక ఆనందంగా ''అన్నలారా... అదిగో అక్కడ చూడండి. ఒక పెద్ద తీగ లావుగా బలంగా వుంది. దాన్ని తెంపి లోపలికి వదులుదాం. అమ్మను పైకి లాగుదాం. ఎలా వుంది నా ఆలోచన'' అంది. ఆ ఉపాయం అన్నిటికీ భలే నచ్చింది. వెంటనే పరుగెత్తుకోని పోయి ఆ తీగను నోటితో కొరికి తెంపాయి. దాన్ని మోసుకోని వచ్చి లోపలికి వదిలాయి. ''అమ్మా... నువ్వు ఒకవైపు గట్టిగా నోటితో పట్టుకో. మేమంతా మరొక వైపు పట్టుకొని పైకి లాగుతాం. ఏం సరేనా'' అన్నాయి సంబరంగా. పిల్లల తెలివికి అమ్మ ఆనందంతో మురిసిపోయి 'సరే' అంది. ఆ తీగను గట్టిగా పట్టుకొంది. రెండవ వైపు పిల్లలన్నీ కలసి పట్టుకొని  ''లాగర లాగు హైలెస్సా... గట్టిగ లాగు హైలెస్సా... అందరు కలసి హైలెస్సా... అమ్మను లాగు హైలెస్సా'' అని అరుచుకుంటా లాగసాగాయి.
కానీ అవెంత. వాటి బలమెంత. బుజ్జి బుజ్జి పిల్లలు. ఎంత లాగినా తల్లి ఒక్క ఇంచు గూడా పైకి రాలేదు. లాగీలాగీ వాటి పళ్ళు నొప్పి పెట్టాయి. చేతగాలేదు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అన్నీ గుంత చుట్టూ చేరాయి. ''అమ్మా... మేం ఓడిపోయాం. నిన్ను కాపాడుకోలేక పోతా వున్నాం'' అన్నాయి దిగులుగా. అంతలో ఒక చిట్టిమేకకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ''తమ్ముల్లారా... మనమంటే చిన్న చిన్న పిల్లలం. బలం తక్కువ. అమ్మను బైటకు లాగలేక పోతా వున్నాం. అదే అమ్మయితే మనలని గుంతలో నుండి ఒక్క నిమిషంలో బైటకు లాగగలుగుతుంది'' అంది. మిగతావి తల గోక్కుంటా ''నిజమే... నువ్వు చెప్పేది. కానీ గుంతలో వున్నది అమ్మగానీ మనం కాదు గదా'' అన్నాయి. అప్పుడు ఆ చిట్టిమేక చిరునవ్వు నవ్వుతా ''అన్నలారా... మనం అందరం గుంతలోకి దుంకేద్దాం. మన మీదకు ఎక్కి అమ్మ బైటకు ఎగురుతుంది. ఆ తరువాత మరలా మనందరినీ ఒక్కొక్కటిగా పైకి లాగుతుంది. ఏమంటారు'' అంది. అన్నింటికీ ఆ ఆలోచన తెగ నచ్చేసింది. వెంటనే ''అమ్మా'' అంటా ఒక్కొక్కటి లోపలికి దుంకేశాయి. పిల్లలు ఒకదాని పక్కన ఒకటి నిలబడ్డాయి. తల్లిమేక వాటిపైకి ఎక్కి ఎగిరి గట్టు మీదకు చేరుకుంది. తరువాత ఒక్కొక్కదాన్ని తీగతో పైకి లాగేసింది. ఆ రోజు వెన్నెల వెలుగుల్లో తనను కాపాడిన పిల్లలకు కోరినవన్నీ చేసిపెట్టి గొప్ప విందు ఇచ్చింది.
***********

కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
*బహు చక్కని కథలు బక్రిచెప్యాల బాదుషాలు*:- బట్టల సాయిచరణ్-7వ, తరగతి -జి.ప.ఉ.పా.బక్రిచెప్యాల -మం:సిద్ధిపేట -జాల్లా:సిద్ధిపేట
చిత్రం
ఏం కాలం? ఇది పోయే కాలం!:- యలమర్తి అనూరాధ
చిత్రం
విను చూడు!!?:-సునీతా ప్రతాప్-ఉపాధ్యాయిని పాలెం.
చిత్రం
*తెలంగాణతొలిశతావధాని* శ్రీమాన్ శ్రీ శిరశినహల్ కృష్ణమాచార్యులు వర్ధంతి నేడు(ఏప్రియల్ 15) కృష్ణమాచార్యులు నిజామాబాద్ జిల్లా (అప్పటి కరీంనగర్ జిల్లా) లోని మోర్తాడ్ గ్రామంలో 1905, ఆగస్టు 12 వ తేదికి సరియైన క్రోధి నామ సంవత్సర, శ్రావణ శుక్ల విదియ నాడు రంగమ్మ, వేంకటాచార్యులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగారాచార్యులవద్ద మరియు తండ్రి గారైన వేంకటాచార్యుల వద్ద విద్యను అభ్యసించారు. తరువాత మాతామహులైన గోవిందాచార్యుల వద్ద 1914 నుండి 1921 వరకు ఏడు సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార, సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచన భూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. పిమ్మట వల్లంకొండలో కనకాపురం శ్రీనివాసాచార్యుల వద్ద తర్క ప్రకరణాలు, మోర్తాడులో కందోఝల వెంకన్న వద్ద సిద్ధాంత భాగము, పిఠాపురంలో గుదిమెళ్ళ రంగాచార్య వద్ద వేదాంతమును అభ్యసించారు. 1926 నుండి కోరుట్ల లోని ఉభయవేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయులుగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీవిరమణ చేశారు. మధ్యలో 1934-37లో కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు, 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థినులకు సంస్కృత సాహిత్యం నేర్పించారు. రచనలు-సంస్కృతాంధ్రాలలో 40కి పైగా గ్రంథాలను రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతిగీతాలు, హరికథలు మొదలైనవి ఉన్నాయి. వీరి రచనలలో కొన్ని: 1. కళాశాల అభ్యుదయం 2. రామానుజ చరితం 3. చిత్ర ప్రబంధం 4. రత్నమాల (ఖండ కావ్యం) 5. మనస్సందేశ కావ్యము 6. సంపత్కుమార సంభవ కావ్యము 7. గాంధీతాత నీతిశతకము 8. గీతాచార్య మతప్రభావ శతకము 9. వెదిర వేంకటేశ్వరస్వామి సుప్రభాతము 10. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము 11. వేణుగోపాల స్వామి సుప్రభాతము 12. నంబులాద్రి నృసింహస్వామి సుప్రభాతము 13. పద్మావతీ పరిణయము (హరికథ) 14. రుక్మిణీ కళ్యాణము (హరికథ) 15. ముకుందమాల 16. యామునాచార్యులవారి స్త్రోత్ర రత్నగీతములు 17. విశిష్టాద్వైతమత సంగ్రహము 18. వేదార్థ సంగ్రహము (అనువాదం) 19. గురువంశ కావ్యనిధి వీరు కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి మొదలైన చోట్ల అష్టావధానాలు, శతావధానాలు చేశారు. తెలంగాణా ప్రాంతంలో వీరు మొట్టమొదటి అవధానిగా కీర్తి గడించారు. వీరికి నైజాం రాష్ట్రాద్య శతావధాని, పండితరత్న, ఉభయవేదాంత విద్వాన్, ఉభయ వేదాంతాచార్య మొదలైన బిరుదులు ఉన్నాయి. వీరిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు, ఢిల్లీలో జియ్యర్ స్వామివారు, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు ఘనంగా సత్కరించారు. మనోవిజయ బాణారంభం అనే మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యులు రాసుకున్న స్వీయ కవితానుజీవనం అనే గ్రంథంలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలనే మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ, అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ, తర్వాతి కాలంలో మద్రాస్ ప్రాంతానికి వెళ్లి తన వాంఛను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కంద పద్యాన్ని రాసి, వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. 1929లో కళాశాలఅభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాధ్యానము గ్రంథాలను రచించారు. నైజాం పరిపాలన సమయంలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన శతావధాని కృష్ణమాచార్యులు, తన తొలి శతావధాన్ని 1928లోనే నిర్వహించారు. ఆనాటి నుండి శతావధానిగా పేరొందిన కృష్ణమాచార్యులు, నైజాం రాష్ట్ర వైష్ణవ సంఘం ఆధ్వర్యంలో 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు, హరికథ కాలక్షేపాలు, రామానుజ చరిత్ర, తత్వార్థప్రకాశిక, శృంగారపంచపానవిజయ రచన తదితర గ్రంథాలను రచించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాదిమార్గం, శ్రీవచన భూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యులు, గాంధీతాత నీతి శతకాన్ని కూడా రచించారు. కులమత బేధాలు వద్దంటూ ఆనాడే తన కవితల ద్వారా సమాజానికి చెప్పిన కృష్ణమాచార్యులు, బాల్య వివాహాలు వద్దని పేర్కొంటునే, బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటిలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యుల గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయవేదాంతచార్య తదితర బిరుదులు కృష్ణమాచార్యుల గారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించి, ఏకసంతాగ్రహిగా కీర్తి ఘడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్యు సరస్వతిదేవియే స్వప్న సాక్షాత్కరించి సమస్యను ఇచ్చినట్లు తన కవితానుజీవనం పుస్తకంలో రాసుకున్నారు. 80సంవత్సరాల వయస్సులో ఏప్రిల్ 15, 1992 రోజున పరమపదాన్ని చేరుకున్న కృష్ణమాచార్యుల శత జయంతి ఉత్సవాలను కరీంనగర్‌లో శ్రీ త్రిదండి శ్రీరామన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో మూడు రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తన ఇంటి ఇలవేల్పూ నంబులాద్రి లక్ష్మీనర్సింహాస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. ఇటీవలే కృష్ణమాచార్యులు అందించిన మనస్సందేశ కావ్యాన్ని పుస్తక రూపంలో ప్రచురించి హైదరాబాద్‌లో పండితుల సమక్షంలో ఆవిష్కరించి, శతావధాని మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. శతావధాని గారి రచనలపై చాలామంది విద్యార్థులు కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీల్లో పిహెచ్‌డిలు కూడా పూర్తి చేశారు. డాక్టర్ సముద్రాల శ్రీనివాసాచార్య కృష్ణమాచార్య శతావధాని తెలుగు రచనలు పరిశీలన అనే అంశంపై పై పీ.హెచ్. డీ చేశారు. వారి కుమారులు శిరిశినహళ్ వెంకటాచారి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు--డాక్టర్ . అమ్మిన శ్రీనివాస రాజు
చిత్రం