మహాత్మా జ్యోతిబా పూలే :- భైరగోని రామచంద్రము -స్కూల్ అసిస్టెంట్, తెలుగు -హైదరాబాద్,-చరవాణి :9848518597
సామాజిక తత్వవేత్త ఉద్యమకారుడు 
సంఘసేవకుడు సన్మార్గమూర్తియైన 
మహాత్మా జ్యోతిబాపూలే 
శ్రీమతి చిమునాబాయి శ్రీ గోవిందరావు 
పుణ్యదంపతులకు 
పద్దెనిమిది వందల ఇరవై ఏడు 
ఏప్రిల్ పదకొండున 
మహారాష్ట్రలోని సతారా జిల్లానందు 
మాలి కులంలో జన్మించెను 

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా 
చిన్నప్పటినుండి సామాజిక భావాలను వ్యక్తం చేసెను 
పండ్లు కూరగాయలు పూలు అమ్ముకునే 
కుటుంబంలో జన్మించినప్పటికీ 
సమాజంకు పరిమళంలు వెదజల్లెను 

చదువు తక్కువైన పుస్తక పఠనం ఎక్కువే 
గొప్పవారి జీవిత చరిత్రలెన్నో చదివి 
వాటినాచరించి మంచిపనులు చేసి మహానీయుడవైతివి

పదమూడేళ్ళ వయస్సులోనే 
తొమ్మిదేళ్ళ సావిత్రమ్మను 
పరిణయంబాడి 
చదువురాని సావిత్రమ్మకు చదువు నేర్పించి 
పట్టుబట్టి ప్రథమ మహిళా గురువుగా
సావిత్రమ్మను తీర్చి దిద్దెను 
ప్రపంచానికి పరిచయం చేసి 
శాశ్వత కీర్తిని సంపాదించెను 

జ్ఞానసంపద ఎవరిసోత్తు కాదని 
బ్రాహ్మణ ఆధిపత్యాన్ని విమర్శించెను 
గులాంగిరి లో బానిసత్వంను 
గూర్చి 
తులనాత్మకంగా పరిశీలించి చూపెను 
సత్య శోధక్ సమాజం స్థాపించి 
ధీనబందు వారపత్రికను ఏర్పాటు చేసి 
అందరికి ఆపద్భందవుడ వయ్యెను 

సమాజంలో ప్రతి సమస్యను 
గుర్తించి పోరాటం చేసెను 
దేశమనే దేహానికి శూద్రులు ప్రాణమనెను 
అంబేద్కర్ జ్యోతిబాపూలేను 
గురువుగా బావించెను 
జీవిత చరమాంకం వరకు 
సమస్యలపై పోరాడిన 
మహనీయుడు మహాత్మా జ్యోతిబాపూలే 

( జ్యోతిబాపూలే జయంతి ఏప్రిల్ 11 సందర్బంగా రాసిన కవిత )


కామెంట్‌లు