నేలమ్మ.. నేలమ్మ.. నేలమ్మా..:- డా. అరుణ కోదాటి ( అక్కిరాజు ) -9959878120
  ( ధరిత్రీ దినోత్సవం సందర్బంగా )
 
గ్రహాలలో భూమిసమస్త జీవరాశు లకూ ఆధారం.
మానవ జీవనానికి కావలిసిన  గాలి, నీరు, ఆహారం  అందిస్తూ మనo జీవించినంత కాలం  భరిస్తుంది.
నాడు భూమిని భూమాతగా పూజించేవారు 
చెట్లను, నీరునిలువవుండే స్థలాలు  అంటే  నదులు, సముద్రాలను పూజించేవారు.
ఇప్పుడు పూజించినా  ఆర్ధిక ప్రయోజనాల కొరకు  
చెట్లనునరికి అడవులనుఅదృశ్యం చేయడం,
పుష్కరాలు, ప్రత్యేక దినాలలో పూజించే,జల నిలయాలను,
భక్తితో  కాక,విహారయాత్రల్లా  వెళ్తూ నీటిని అపవిత్రం  చేస్తున్నారు.
  పారిశ్రామిక,రంగాల వల్ల ప్రకృతి వనరులపై వత్తిడి పెరుగుతుంది.
విపత్తులు, విధ్వంసం కారణంగా సహజవనరులు తరిగిపోతున్నాయి.
అధిక దిగుబడే లక్ష్యాంగా వ్యవసాయం చేస్తుండడంతో రసాయనిక  ఎరువులు, పురుగుమoదుల వినియోగం బాగాపెరిగింది.సింతటిక్ ఫైరెత్రో యిడ్స్ వంటి రసాయణాల వల్ల నెలలోని పంటలకు ఉపయోగపడే శిలీoద్రాలు, పురుగులు చనిపోతున్నాయి. దీవివల్ల ఆహారాలు  కూడా కల్తీ అయి అనేక రోగాలకు కారణం  అవుతుంది.
సముద్రాలు  వేడెక్కడం, నేటిమట్టాలు పెరగడంతో తీ రప్రాంతాలు జలమయం  అవుతున్నాయి.
మనం  లక్సరీగావాడకం  కొరకు  తయారు చేసుకున్న  ప్లాస్టిక్  కూడా  మహమ్మారిలా మనపాలిట  మృత్యువు అయిపోయింది.
పరిశ్రమలనుండి విడుదలైన వ్యర్థ పదార్దాలు వాయు, నీటి నాణ్యత దెబ్బతింటుంది.
స్వలాభం కొరకు అడవులను  నరకడం  వలన   అందులో నివసించే క్రూరమృగాలు సైతం  జన నివాసంలో అడుగుపెడుతున్నాయి.
ఇలాంటి సహజవనరులను మనమే  చేజేతులా పాడుచే సుకోవడంతో   మనకి ఉపయోగ పడే పక్షులు, కూడా  వలస పోవడమో, అంతరించిపోవడమోజరుగుతుంది.
ఉదాహరణకి 
హంసలు,లాంటివి ఎప్పుడో  కనపకుండా పోతే,  పిచ్చుకలు, కాకులు  కూడా తగ్గి పోతున్నాయని  శాస్త్రజ్నులు వాపోతున్నారు.
నరికేసిన అడవులను  తిరిగి  పునరుద్దింప బడడం  చాలా కష్టం, 
కాబట్టి ముందుజాగ్రత్తగా  ఉన్నా అ డవులను కాపాడుకుంటూ, చెట్లు నరకడం మానెయ్యడం, కొత్త చెట్లను నాటడం  లాంటివి  చేస్తుండాలి.
ప్లాస్టిక్ వాడకం  పూర్తిగా మానెయ్యాలి.
సేంద్రియ వ్యవసాయం చేయాలి.
నదులను, సముద్రాలను, కాపాడుకోవాలి,భూమి  మొత్త ము  సిమెంటు తో  కాంక్రిట్ చేస్తే  వర్షం  నీరు  ఇంకిపోదు దానివల్ల, ఇప్పటికే కనుమరుగైన  బావులే కాదు, బొర్ లలో కూడా  నీరు అందక, తాగడానికి నీరు కరువై పోతుంది. అలా కాకుండా మట్టినేలలు ఎక్కువగా ఉండేట్టు చేయాలి. చెరువులత్రవ్వకాలు  చేస్తుండాలి.
ఇప్పటికైనా ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే  ఇప్పటికే  ఎండలు తీవ్రoగా పెరిగిపోయాయి.
ఇక జాగ్రత్తలు  తీసుకోకపోతే  మనము  సూర్య మండలం మీద నివసిస్తున్నామా అనేట్టు అవుతుంది.
పర్యావరణాన్ని, పంటభూములను పరిరక్షోంచుకోవడానికి ప్రజల్లో 
చైతన్యం  తీసుకురావలిసిన అవసరం చాలా ఉంది.
లేకపోతే ఈ పరిణామాలు భవిష్యత్తులో మానవాళికి పెనిముప్పును  కలుగచేస్తాయని గ్రహించిన పర్యావరణ వేత్తలు గెలోర్డ్ నెల్సన్, డేనీస్ హేస్ లు ప్రకృతి సంరక్షణ కొరకు ఉద్యమం  చేపట్టారు.

కామెంట్‌లు