భాగవతంలో గురువు గొప్పతనం వర్ణించబడింది ఒకసారి ఇంద్రుడు సభ తీర్చి ఉండగా గురువైన బృహస్పతి వచ్చాడు గర్వంతో అహంకారంతో ఇంద్రుడు కనీసం లేచి నిలబడలేదు అప్పుడు బృహస్పతి వెంటనే ఆ సభను విడిచి వెళ్లిపోయాడు ఆ తర్వాత ఇంద్రుడు పశ్చాతాపపడిన లాభం లేక పోయింది అతనికి గుణపాఠం నేర్పాలని దేవ గురువు మాయం అవుతాడు ఇక రాక్షసులు విజృంభించి దేవతల్ని హింసిస్తారు ఓడించారు ఎందుకంటే వారు తమ గురువైన శుక్రాచార్యుల వారి అనుగ్రహం ని పొంది ఇంద్రునిపై దాడి చేశారు ఇప్పుడు దేవతలంతా బ్రహ్మ దగ్గరికి పరిగెత్తారు గురు స్థానం ఖాళీగా ఉండకూడదని కొత్తగా గురువుని నియమించమని వేడుకున్నారు అప్పుడు బ్రహ్మ మూడు శిరస్సులు ఉన్న విశ్వరూపుడిని దేవతల గురువుగా నియమించాడు మొదట ఆయన నిరాకరించాడు ఎందుకంటే తను ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తున్నానని తన తేజస్సు తగ్గిపోతుందని అంటాడు కానీ ఇంద్రాది దేవతల వల్ల ఒప్పుకోక తప్పలేదు రాక్షసుల నీ ఓడించటానికి శక్తి కావాలి అందుకని ఇంద్రుడికి నారాయణ కవచాన్ని ఉపదేశించాడు దీనితో రాక్షసులని తునుమాడి ఇంద్రుడు సింహాసనం ఎక్కాడు ఇక్కడ విశ్వరూపుడు దేవతల గురువుగా ఉన్నాడు.ఆయన తల్లి రచన రాక్షస జాతికి చెందినది.అందుకే ఆమె ఆజ్ఞతో యజ్ఞంలోని హవిస్సులో కొంత భాగం దేవతలతో పాటు దానవులకి పంచుతాడు.ఈవిషయం తెలుసుకున్న ఇంద్రుడు కోపంతో గురుస్థానంలో ఉన్న విశ్వరూపుని మూడు శిరస్సులను ఖండిస్తాడు. వాటిలో నుంచి మూడు పిట్టలు వచ్చి ఇంద్రుని తరమసాగాయి. ఇక్కడ కూడా ఇంద్రుడు గురుద్రోహం చేశాడు.అందులో ఒక పిట్ట తీతువు అమంగళం అశుభం .ఆపాపాల్ని పోగొట్టుకొనటం కోసం ఇంద్రుడు దైవాన్ని ప్రార్ధించటం, ఆపాపాన్ని నలుగురు భరించటం జరిగింది.భూమి ఊసరక్షేత్రంగా, చెట్టునుంచి జిగురు,నీరు బుడగలతో,స్త్రీకి రజోనివృత్తి ఆపాపాలకు సంకేతం.అలా ఇంద్రుడు బ్రహ్మహత్యా పాతకం నుంచి విముక్తిపొందాడు.
ఇక్కడ ఒకవిషయం తెలుసుకోవాలి.ఇంద్రుడు అనేది ఒక పదవి పోస్ట్ .కలెక్టర్ మంత్రి ఎలాగో అలాగన్నమాట! అంతరార్థం ఈభాగవతకథలకు వేరే ఉంటుంది.సామాన్య జనంకి గురువు విలువ తెలియజెప్పటం ముఖ్య ఉద్దేశం.పెద్దల ఎడ, అధ్యాపకుల ఎడ వినయవిధేయతలతో ఉండాలని బాలలకు చెప్పాలి.గురులేక ఎటువంటివాడైనా రాణించడు అన్నారు త్యాగరాజ స్వామి తన కీర్తనలో! 🌹
=======================================
భాగవతంలో 4రకాల గురువులని గూర్చిచెప్పబడింది.సూచించారు,వాచిక గురువు,బోధక గురువు,పరమగురువు, నిషిద్ధ గురువు.వ్యాసుడు వివరించాడు.పోతన తేటతెలుగులో ఆంధ్రీకరించి మనకు అందించారు.
ఇక్కడ ఒకవిషయం తెలుసుకోవాలి.ఇంద్రుడు అనేది ఒక పదవి పోస్ట్ .కలెక్టర్ మంత్రి ఎలాగో అలాగన్నమాట! అంతరార్థం ఈభాగవతకథలకు వేరే ఉంటుంది.సామాన్య జనంకి గురువు విలువ తెలియజెప్పటం ముఖ్య ఉద్దేశం.పెద్దల ఎడ, అధ్యాపకుల ఎడ వినయవిధేయతలతో ఉండాలని బాలలకు చెప్పాలి.గురులేక ఎటువంటివాడైనా రాణించడు అన్నారు త్యాగరాజ స్వామి తన కీర్తనలో! 🌹
=======================================
భాగవతంలో 4రకాల గురువులని గూర్చిచెప్పబడింది.సూచించారు,వాచిక గురువు,బోధక గురువు,పరమగురువు, నిషిద్ధ గురువు.వ్యాసుడు వివరించాడు.పోతన తేటతెలుగులో ఆంధ్రీకరించి మనకు అందించారు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి