న్యాయములు-840
"కోపః పాపస్య కారణమ్" న్యాయము
*****
కోపః అనగా కోపం,క్రోధం,ఆగ్రహం,ఆవేశం.పాపస్య అనగా పాపం యొక్క,కారణమ్ అనగా హేతువు,, పరిస్థితి,నిమిత్తం, మూలము అనే అర్థాలు ఉన్నాయి.
కోపము పాపమును చేయిస్తుంది అని అర్థము. అనగా కోపము పాపానికి దారి తీసేలా చేస్తుంది అంటుంటారు మన పెద్దలు.
పాపం అంటే ఇక్కడ అనర్ధం అని, అవాంఛిత సంఘటన అని అర్థము.అలాంటి అనేక అనర్ధాలకు కోపం దారితీయిస్తుంది.
ఈ కోపం గురించి ప్రసిద్ధ రామప్ప వరకవి( సిద్ధప్ప) గారు ఆలోచింపచేసే,ఆవేశానికి దూరంగా ఉంచే చక్కని చిక్కని పద్యం రాశారు. అదేమిటో చూద్దాం.
కోపంబు చే నరుల్ కౄరాత్ములగుదురుకోపంబు మనుషుల కొంప ముంచు/కోపంబు వలననే పాపంబులును హెచ్చు/కోపంబుననె నింద గూడ వచ్చు/కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు/కోపంబు మిత్రులన్ కొంచె పరుచు/కోపంబు హెచ్చినన్ శాపంబులున్ వచ్చు/కోపంబు జూడగా కొరివి యగును/కోపము నరుని సాంతము కూల్చును భువి/లేదు వెదకిన యిటువంటి చేదు ఫలము/ వినుడి మాయప్ప శిద్దప్ప విహితుడప్ప/కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప!/
ఈ పద్యంలో కోపం మనిషి పతనానికి ఎన్ని రకాలుగా హేతువు అవుతుందో ప్రతి అంశాన్ని ప్రస్తావించారు. దీనిని బట్టి కోపం ఎంత ప్రమాదకరమైనదో ఇట్టే తెలిసిపోతుంది.
ఒక్క సారి మనం మహాభారతాన్ని తిరగేస్తే కోపం ఎన్ని అనర్థాలకు దారి తీసింది తెలుసుకోవచ్చు. దుర్యోధనుడి కోపం కురుక్షేత్ర సంగ్రామానికి దారి తీసింది. కర్ణుడి కోపం యుద్ధంలో పరాజయానికి గురి చేసింది.భీముడి కోపం శత్రువులను తుద ముట్టించేందుకు, కీచక వధ చేయుటకు ఉపయోగపడినా అనంతరం మానసిక క్షోభకు గురి చేసింది. ధర్మరాజు కోపం - "అజాత శత్రువే అలిగిన నాడు" అని మహాభారత యుద్ధమే జరిగింది.
రామాయణంలో వాలి తన తమ్ముడి మీద తెచ్చుకున్న కోపం తన చావుకు కారణం అయ్యింది.అలాగే రావణుడు చెల్లెలు శూర్పణఖ మాటలకు కోపం తెచ్చుకోవడం వల్ల రామ రావణ యుద్దముతో పాటు అందమైన లంకానగరం ధ్వంసమై పోయింది.
ఇలా కోపం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల నష్టాలు జరిగాయి.అందుకే సుమతీ శతక కర్త "తన కోపమె తన శత్రువు/ తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ/ తన సంతోషమె స్వర్గము/తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతీ!" అన్నాడు.
ఎవరో శత్రువులు ఎక్కడో ఉండరు. మనం పడే కోపమే .మనకు పెద్ద శత్రువు. కాబట్టి కోపాన్ని లేకుండా చేసుకోవాలి అంటాడు.
దీనినే మరింత సరళంగా వేమన కోపము వలన ఏం జరుగుతుందో చెబుతాడు.
"కోపమునను ఘనత కొంచమై పోవును/కోపమునను మిగుల గోడు చెందు/ గోపమ డచెనేని గోర్కెలు నీడేరు/ విశ్వధాభిరామ వినురవేమ!!
అన్ని అనర్ధాలకు మూలము కోపము.ఈ కోపము ఒక్కటి తగ్గించుకుంటే అన్ని కోరికలు ఫలిస్తాయి'"అంటారు.
క్షణికమైన ఆవేశంలో ఎన్నెన్ని అనర్థాలు జరుగుతున్నాయో, మృత్యువుకు కారణాలు అవుతున్నాయో నిత్యం మన చుట్టూ ఉన్న సమాజంలో చూస్తూ ఉన్నాం.కాబట్టి కోపం తగ్గించుకుంటే అన్ని మంచి ఫలితాలే పొందుతాం.
ఇదండీ "కోపః పాపస్య కారణమ్ " న్యాయము. దీని వల్ల కేవలం అనర్ధాలే కాదు.రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఎన్నో యిబ్బందులు, అనర్ధాలు ఎదుర్కొనేల చేసే ఈ కోపాన్ని ఆమడ దూరంలో తరిమేద్దాం. ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉందాం.
"కోపః పాపస్య కారణమ్" న్యాయము
*****
కోపః అనగా కోపం,క్రోధం,ఆగ్రహం,ఆవేశం.పాపస్య అనగా పాపం యొక్క,కారణమ్ అనగా హేతువు,, పరిస్థితి,నిమిత్తం, మూలము అనే అర్థాలు ఉన్నాయి.
కోపము పాపమును చేయిస్తుంది అని అర్థము. అనగా కోపము పాపానికి దారి తీసేలా చేస్తుంది అంటుంటారు మన పెద్దలు.
పాపం అంటే ఇక్కడ అనర్ధం అని, అవాంఛిత సంఘటన అని అర్థము.అలాంటి అనేక అనర్ధాలకు కోపం దారితీయిస్తుంది.
ఈ కోపం గురించి ప్రసిద్ధ రామప్ప వరకవి( సిద్ధప్ప) గారు ఆలోచింపచేసే,ఆవేశానికి దూరంగా ఉంచే చక్కని చిక్కని పద్యం రాశారు. అదేమిటో చూద్దాం.
కోపంబు చే నరుల్ కౄరాత్ములగుదురుకోపంబు మనుషుల కొంప ముంచు/కోపంబు వలననే పాపంబులును హెచ్చు/కోపంబుననె నింద గూడ వచ్చు/కోపంబు తన చావు కొంచెంబు నెరుగదు/కోపంబు మిత్రులన్ కొంచె పరుచు/కోపంబు హెచ్చినన్ శాపంబులున్ వచ్చు/కోపంబు జూడగా కొరివి యగును/కోపము నరుని సాంతము కూల్చును భువి/లేదు వెదకిన యిటువంటి చేదు ఫలము/ వినుడి మాయప్ప శిద్దప్ప విహితుడప్ప/కనుడి కరమొప్ప కవికుప్ప కనకమప్ప!/
ఈ పద్యంలో కోపం మనిషి పతనానికి ఎన్ని రకాలుగా హేతువు అవుతుందో ప్రతి అంశాన్ని ప్రస్తావించారు. దీనిని బట్టి కోపం ఎంత ప్రమాదకరమైనదో ఇట్టే తెలిసిపోతుంది.
ఒక్క సారి మనం మహాభారతాన్ని తిరగేస్తే కోపం ఎన్ని అనర్థాలకు దారి తీసింది తెలుసుకోవచ్చు. దుర్యోధనుడి కోపం కురుక్షేత్ర సంగ్రామానికి దారి తీసింది. కర్ణుడి కోపం యుద్ధంలో పరాజయానికి గురి చేసింది.భీముడి కోపం శత్రువులను తుద ముట్టించేందుకు, కీచక వధ చేయుటకు ఉపయోగపడినా అనంతరం మానసిక క్షోభకు గురి చేసింది. ధర్మరాజు కోపం - "అజాత శత్రువే అలిగిన నాడు" అని మహాభారత యుద్ధమే జరిగింది.
రామాయణంలో వాలి తన తమ్ముడి మీద తెచ్చుకున్న కోపం తన చావుకు కారణం అయ్యింది.అలాగే రావణుడు చెల్లెలు శూర్పణఖ మాటలకు కోపం తెచ్చుకోవడం వల్ల రామ రావణ యుద్దముతో పాటు అందమైన లంకానగరం ధ్వంసమై పోయింది.
ఇలా కోపం గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల నష్టాలు జరిగాయి.అందుకే సుమతీ శతక కర్త "తన కోపమె తన శత్రువు/ తన శాంతమె తనకు రక్ష దయ చుట్టంబౌ/ తన సంతోషమె స్వర్గము/తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతీ!" అన్నాడు.
ఎవరో శత్రువులు ఎక్కడో ఉండరు. మనం పడే కోపమే .మనకు పెద్ద శత్రువు. కాబట్టి కోపాన్ని లేకుండా చేసుకోవాలి అంటాడు.
దీనినే మరింత సరళంగా వేమన కోపము వలన ఏం జరుగుతుందో చెబుతాడు.
"కోపమునను ఘనత కొంచమై పోవును/కోపమునను మిగుల గోడు చెందు/ గోపమ డచెనేని గోర్కెలు నీడేరు/ విశ్వధాభిరామ వినురవేమ!!
అన్ని అనర్ధాలకు మూలము కోపము.ఈ కోపము ఒక్కటి తగ్గించుకుంటే అన్ని కోరికలు ఫలిస్తాయి'"అంటారు.
క్షణికమైన ఆవేశంలో ఎన్నెన్ని అనర్థాలు జరుగుతున్నాయో, మృత్యువుకు కారణాలు అవుతున్నాయో నిత్యం మన చుట్టూ ఉన్న సమాజంలో చూస్తూ ఉన్నాం.కాబట్టి కోపం తగ్గించుకుంటే అన్ని మంచి ఫలితాలే పొందుతాం.
ఇదండీ "కోపః పాపస్య కారణమ్ " న్యాయము. దీని వల్ల కేవలం అనర్ధాలే కాదు.రకరకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.
శారీరకంగా, మానసికంగా, సామాజికంగా ఎన్నో యిబ్బందులు, అనర్ధాలు ఎదుర్కొనేల చేసే ఈ కోపాన్ని ఆమడ దూరంలో తరిమేద్దాం. ఆరోగ్యంగా, ఆనందంగా, ప్రశాంతంగా ఉందాం.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి