గజేంద్రమోక్షం అచ్యుతుని రాజ్యశ్రీ

 భాగవతం కి మరో పేరు జయ అంటే జ అంటే వెళ్లిపోవటం గా అంటే రావటం మనం సృష్టిలో ప్రతి ప్రాణి పుట్టటం చావటం చూస్తూనే ఉన్నా ం గజేంద్రమోక్షం అంటే గజ అంటే ఏనుగు ఈ కథని వ్యాసుడు సంస్కృతంలో రాస్తే పోతన తెలుగులో చాలా అందంగా వర్ణించాడు మరి ఏనుగుని ఎందుకు ముఖ్యపాత్రగా తీసుకున్నాడు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి ఏనుగు ఎగరలేని ప్రాణి మనిషి కూడా ఈ సంసార బంధం లోంచి తప్పించుకొని ఎగిరి పారిపోలేడు తిరకుటాచల పర్వతం అంటే సత్వ రజ స్తమో గుణాలు క్షీరసాగరం అంటే మన హృదయం అదే శరీరం అనే గుహలో ఉంటుంది కోరికలు గుండెలో పుడతాయి జీవులు దాని వెంట పరుగులు పెడుతూ సంసారబంధంలో ఇరుక్కుని గృహస్థాశ్రమం అని నీటిలో దిగి ఏనుగు లాగా ముందు సుఖపోగాల్లో పరుగులు తీస్తాడు ఆపై నిస్సహాయ స్థితిలో అవయవాలు పనిచేయక మొసలి నోటికి చిక్కిన ఏనుగు లాగా గిలగిలలాడుతాడు ఏనుగు ఆ మొసలితో వెయ్యిళ్లు యుద్ధం చేస్తుంది 1000 అంటే సహస్రం అంటే అంతం లేనిది అనంతమైనది ఈ గజరాజు అన్ని అడవిలోని ప్రాణులకు తారెత్తించాడు గజ గమన అయినా పది లక్షల కోట్ల ఏనుగుల గుంపుతో ఆ గజరాజు మడుగులో జలకాలు ఆడాడు అంటే అహంకారంతో నా అంత గొప్పవాడు లేడు అని విర్రవీగాడు ఈ గజరాజు చూసి పులులు పొదరిల్లలో దూరితే ఎలుగుబంట్లు గుహలో దాగాయి అని పోతన అద్భుతమైన వర్ణన చేస్తాడు ఏనుగులన్నీ స్నానం చేస్తాయి ఆ సరస్సుని కకావికలు చేస్తాయి అప్పుడు ఒక మొసలి చూసి ఆ గజరాజు కాదుని పట్టుకుంది అంటే మనుషులు సంసారంలో దిగి కష్టాలు నష్టాలు అనేటువంటి జంజాటంలో ఇరుక్కుని చచ్చేదాకా ఏడుస్తూ ఉంటారు అప్పుడు దేవుని స్మరిస్తే లాభం లేదు పుట్టినప్పటినుంచి దైవస్మరణలో ఉంటే పోతన లాగా భక్తి భావంతో జీవిస్తే ఎలాంటి కష్టాలు ఉన్న ఆఖరికి శ్రీమన్నారాయణ ఏనుగు కి మోక్షం ఇచ్చినట్లు మనం నిరంతరం అప్రమత్తంగా ఉండాలి మొసలి చాలా తెలివిగల ప్రాణి అది తన రెండు కళ్ళను మాత్రమే నీటి పై భాగంలో ఉంచి శరీరాన్ని మొత్తం నీటిలో కనపడకుండా దాచుతుంది అలా మనం కూడా ఈ సంసారంలో మునిగి పైపై భ్రమలు చూసి అసలు సిసలు భగవంతుని కాళ్లు పట్టుకోవాలని మొసలి ముసలి లాగా ప్రయత్నం చేయాలి మృత్యు కాలం ఈ మొసలి కేవలం ఆ ఏనుగు కాలు మాత్రమే కాక శరీరం మొత్తాన్ని కొరుకుతుంది దాని కడుపుని చీల్చే ప్రయత్నం చేస్తుంది అలాగే మనిషి కూడా బాల్య యవ్వనాల్లో విర్రవీగితే వృద్ధాప్యంలో మంచాన పడి ఆసుపత్రిలో దేవుడిని తలుచుకుంటే ముక్తి రాదు అని స్పష్టంగా కరి మకరి పోరాటంలో పోతన వివరించాడు ఇంకో విశేషం ఏమంటే మనిషిలో శివం వెళ్ళిపోగానే ఆ శవం మిగులుతుంది శవానికి ఉన్నటువంటి రెండు కాళ్ల బొటనవేలను తాడుతో కట్టేస్తారు అంటే ఈ సంసారం అనే కాలం లోంచి నీవు విముక్తుడివి అయ్యావు అని అన్తోష్టి సంస్కారం ఇది ఇలా గజేంద్రమోక్షం కథ ద్వారా పోతన మనిషి యొక్క జీవితాన్ని ఏనుగు తోటి కష్టనష్టాలని మొసలి తోటి పోల్చి మనకు తేట తెలుగులో గజేంద్రమోక్షం కథని అందించారు🌷
కామెంట్‌లు