వాసు తన పుట్టిన రోజు సందర్భంగా స్నేహితులను ఆహ్వానించాడు. కేకులు, కూల్ డ్రింకులూ వంటివి పక్కన పెట్టి, ఆరోగ్యవంతమైన పార్టీని జరుపుకోవాలని వాసు ఆలోచన. అందుకే రకరకాల పండ్లను తెప్పించాడు. అవన్నింటినీ ఒకచోట ఉంచాడు. మామిడికాయ నిమ్మకాయలతో ఇలా అన్నది. "మీ వల్ల మనిషికి ఏం లాభమని మిమ్మల్ని తెచ్చారు. పుల్లగా ఉంటారు. బాబోయ్!" అని. "ఈ ఎండాకాలంలో ప్రతిరోజూ నిమ్మరసం తాగుతారు. మామిడి ఎండాకాలంలో మాత్రమే. మిగతా కాలాల్లో మిమ్మల్ని మరచిపోతారు. ఎండదెబ్బన పడకుండా కాపాడేది మేమే. మేము సంవత్సరం మొత్తం వస్తూ మనిషి ఆరోగ్యానికి రకరకాలుగా ఉపయోగపడతాము." అన్నవి నిమ్మకాయలు. "మీరు వేస్ట్. మేము చాలా తీయగా ఉంటూ మనిషికి మంచి బలాన్ని ఇస్తాము. మమ్మల్ని పోటీపడి తింటారు మనుషులు." అన్నవి సపోటాలు. "మీ ఆకారం చూడటానికే అసహ్యంగా ఉంటారు." అని పనస పళ్ళను హేళన చేశాయి. బత్తాయి పళ్ళు తమ గొప్పలు తాము చెప్పుకుంటూ నల్లగా ఉన్నాయని ద్రాక్షను హేళన చేసాయి. ద్రాక్ష చిన్నబుచ్చుకుంది. ఆపిల్ ద్రాక్ష పళ్ళ గొప్పతనం చెప్పింది. ఇలా రకరకాల పండ్లు ఎవరి గొప్పలు వారే చెప్పుకుంటూ మిగతా పండ్లను కించపరచుకుంటున్నాయి. ఇదంతా మౌనంగా చూస్తూ నవ్వుకుంటున్నాయి అరటి పళ్ళు.
ఇంతలో నలుగురు మిత్రులు పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, కూల్ డ్రింక్స్ తెచ్చి అక్కడ పెట్టారు. అవి పండ్లు తమలో తాము పోట్లాడుకోవడం గమనించాయి. "మీరంతా వేస్ట్. మీలో మీకు ఐకమత్యం కూడా లేదు. కానీ మనుషులు ఏ వేడుకలకు అయినా మాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పిల్లలూ పెద్దలూ ఈ రోజుల్లో మమ్మల్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు. మీరు శుద్ధ వేస్ట్." అన్నాయి అవన్నీ. ఆపకుండా హేళన చేస్తున్నాయి. వాటిలో ఉన్న సమైక్యత తమలో లేనందుకు పళ్ళు సిగ్గు పడ్డాయి.
ఇంతలో వాసు అక్కడికి వచ్చాడు. "నా పుట్టినరోజుకు రకరకాల పళ్ళ రసాలతో స్నేహితులకు ఆరోగ్యకరమైన పార్టీ ఇద్దాం అనుకున్నా. కానీ ఈ కూల్ డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు ఎవరు తెమ్మన్నారు? రుచి అనే మత్తులో పడేసి మనకు రకరకాల రోగాలను గిఫ్ట్ గా ఇస్తాయి. వీటికి అలవాటు పడితే తొందరగా చస్తాము. ఈ చెత్త ఎవరు తెమ్మన్నారు. అర్జంటుగా వీటిని చెత్త కుప్పలో పడెయ్యండి." అని వాసు ఆదేశించాడు. విర్రవీగినందుకు వాటికి తగిన శాస్తి జరిగింది. పండ్లు గర్వంతో తల ఎత్తుకున్నాయి.
ఇంతలో నలుగురు మిత్రులు పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, కూల్ డ్రింక్స్ తెచ్చి అక్కడ పెట్టారు. అవి పండ్లు తమలో తాము పోట్లాడుకోవడం గమనించాయి. "మీరంతా వేస్ట్. మీలో మీకు ఐకమత్యం కూడా లేదు. కానీ మనుషులు ఏ వేడుకలకు అయినా మాకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. పిల్లలూ పెద్దలూ ఈ రోజుల్లో మమ్మల్నే ఎక్కువ ఇష్టపడుతున్నారు. మీరు శుద్ధ వేస్ట్." అన్నాయి అవన్నీ. ఆపకుండా హేళన చేస్తున్నాయి. వాటిలో ఉన్న సమైక్యత తమలో లేనందుకు పళ్ళు సిగ్గు పడ్డాయి.
ఇంతలో వాసు అక్కడికి వచ్చాడు. "నా పుట్టినరోజుకు రకరకాల పళ్ళ రసాలతో స్నేహితులకు ఆరోగ్యకరమైన పార్టీ ఇద్దాం అనుకున్నా. కానీ ఈ కూల్ డ్రింకులు, పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు ఎవరు తెమ్మన్నారు? రుచి అనే మత్తులో పడేసి మనకు రకరకాల రోగాలను గిఫ్ట్ గా ఇస్తాయి. వీటికి అలవాటు పడితే తొందరగా చస్తాము. ఈ చెత్త ఎవరు తెమ్మన్నారు. అర్జంటుగా వీటిని చెత్త కుప్పలో పడెయ్యండి." అని వాసు ఆదేశించాడు. విర్రవీగినందుకు వాటికి తగిన శాస్తి జరిగింది. పండ్లు గర్వంతో తల ఎత్తుకున్నాయి.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి