తుమ్మెద మామిడి చెట్టు.:- తాటి కోల పద్మావతి

 ఇది ఒక ప్రత్యేకత కలిగిన మహా విశిష్ట వృక్షము. ఈ వృక్షం గురించి నిత్యనాధకృత రసరత్నాకరము అనుగ్రంధములో పేర్కొనబడినది. ఈ అద్భుత వృక్షం మహబూబ్నగర్ జిల్లాలోని అచ్చంపేట సమీపమున ఉమామహేశ్వర ఆలయ శిఖరానికి సమీపాన కలదు. అయితే ఈ వృక్షం యొక్క విశిష్టత ఏమిటంటే ఇది మామూలు మామిడి చెట్టు కన్నా భిన్నమైనది. దీనిని నల్ల మామిడి చెట్టు అని కూడా వ్యవహరిస్తారు. ఈ చెట్టు ప్రతి 12 సంవత్సరములకు ఒకసారి మాత్రమే ఒక కాయ కాసి, అది పండుగ మారుతుంది. అయితే సరిగ్గా అది పండిన సమయానికి ఆ వృక్షం పైన గండు చీమలు, కోతులు, కోనంగులు అనేక రకాలైన కీటకాలు మరియు ఆపండి చుట్టూ జూమ్ అంటూ నాదం చేస్తూ అనేక తుమ్మెదలు ఆ పండుకు కాపలాగా ఉంటాయి. ఈ పండును భుజించిన వారికి పరిపూర్ణమైన ఆయుష్ కలిగి, ఎంతో శక్తి శాలురుగా, వజ్ర దేహులుగా అవుతారని ప్రతీతి. ఈ ఫలము కోసమే ఆ ఉమామహేశ్వర కొండ చర్యలలో మునులు తపస్సు చేస్తుంటారని పెద్దలు చెబుతుంటారు. 
అయితే ఇవే వృక్షం గురించి శ్రీశైల క్షేత్ర స్థల పురాణంలో మరో విధమైన కథనం రాయబడి ఉంది. ఉమామహేశ్వరరావు మందిరం దగ్గర ఉన్న ప్రత్యేక మామిడి వృక్షానికి గల పండును బద్దలు కొడితే అందులో బ్రతికిన తుమ్మెదలుంటాయి. అవన్నీ పోయిన పిడపా ఆ పండును పాలలో వండి ఆ ద్రవాన్ని భక్షించిన ముడతలు సమిసిపోతాయి. అంతేకాక సమస్త భావాలపై పట్టు సాధిస్తారని పేర్కొనబడినది. 

కామెంట్‌లు