మానవుడు గుణ పూర్ణుడు
మదమాత్సర్యాది
గుణాభరణాలకు తోడు "నేను"అన్న స్వర్ణ కవచాన్ని ధరించిన అపర కర్ణుడు, మానవుడు.
కర్ణ కవచమంత గట్టి
భావం నేను,నన్ను,నాది. అనే భావ పరంపర.
.
ఏది నీదికాదని మనకు స్మశానంచెప్టుంది.
అయినా అది స్మశానవైరాగ్యమే.
"
ఆ "నేను" శరీరం కాదు, దానిలోపల ఉండే ఆత్మజ్యోతి"
టీఅదే "నేను" అని
తెలుసుకో, అనిచెప్పే
గొప్ప ప్రబోధాత్మక గ్రంథమే
భగవద్గీత.
పూజా సమయాన మనం చదివే మంత్రాలు అర్ధం తెలుసుకొని చేస్తే అవే మనకు గురువులుగా ఆత్మజ్ఞానాన్ని కలుగజేస్తాయి అంటారు పెద్దలు. పూజానంతరం " సర్వం భగవతార్ణమస్తు అంటూ
ఆత్మ ప్రదక్షణం చేస్తాము.అంతవరకే ఆ చిలక పలుకులు.ఆగది వదిలితే " అంతానేనే"
ఇదే వదలమంటుంది గీత.
నీతో చేరిన ఆత్మకు కూడా అజ్ఞానం అంటుకుంటుంది. కృష్ణుని దగ్గరనే ఉన్న కిరీటికి ఆవరించినట్లు
అందుకే అరవిందులు దేహం ఆలయస్థలం
ఆత్మ దేవాలయం,జ్ఞానం దైవమన్నారు
మన ఆత్మ కూడా వెలుగు చూడాలంటే మనం తగినజ్ఞాన సముపార్జన చేసినపుడే ఆత్మ కూడా చైతన్య మవుతుంది. అట్టి జ్ఞానబోధ చేసేదే భగవద్గీత. అర్జునునికి మాత్రమే కాదు సర్వ మానవాళికి
గీత తలరాతలు మార్చే దివ్య సందేశం.
విష్ణుమూర్తి గరుత్. మంతునికి చెప్పినట్లు మానవుడు రెండు రూపాలవాడు. 1)నేను అనే భవభందాల వాడు.
2వాడే జ్ఞానియై ఆత్మజ్ఞానాన్ని పొందితే అట్టివారికి యముడు పాదాభివందనం చేసి దేవలోకానికి సవినయంగా పంపుతాడు.
ఆ
ఆత్మజ్ఞానమనే అమృతం అందిస్తున్నది భగవద్గీత.
అందుకోగలిగినంత అందుకొందాం.
ఆ గీతా
బోధ మన బాధలను తీర్చే,భగవంతునిచేర్చే
దివ్య శకటమని
భావిస్తాం.తరిస్తాం.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి