పెరుగుతున్న జువైనల్ నేరాలు: - సి.హెచ్.ప్రతాప్
 దేశంలో జువెనైల్‌ నేరాలు పెరిగిపోతున్నాయనన పలు నివేదికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ధనిక, పేదా అనే వ్యత్యాసం లేకుండా అనేక మంది యువత పలు నేరాల్లో నిందితులుగా మారటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో, అమ్మాయిలపై అఘాయిత్యాలు చేయడంలో, సైబర్‌ నేరాలు చేయడంలో వీరు ముండుంటున్నారు.- చిన్నారులు పదమూడు సంవత్సరాల వయస్సు నుంచే వివిధ చెడు వ్యసనాలకు బానిసలవుతూ, పలు నేరాలు చేస్తూ పట్టుబడుతూ జైళ్లలో మగ్గుతున్నారు. జువెనైల్‌ నేరాలు పెరిగిపోతున్నాయి. తల్లిదండ్రులను బెదిరించి మరీ ఖరీదైన సెల్‌ ఫోన్లు, మోటార్‌ సైకిళ్ళు కొనడం. మరికొందరు పిల్లలు తమ తెలివితేటలను సైబర్‌ నేరాలు చేయడానికి వినియోగిస్తున్నారు. ధనిక కుటుంబాల నుంచి పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన అనేక మంది యువత పలు నేరాల్లో నిందితులుగా మారటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాల్లో, అమ్మాయిలపై అఘాయిత్యాలు చేయడంలో, సైబర్‌ నేరాలు చేయడంలో రోజు రోజుకు బాలల సంఖ్య పెరగటంతో భావి భారత్‌కు పెను ప్రమాదం పొంచి ఉంది.
భారతదేశంలోని కొంఅరు మైనర్లు యువకులు హత్యలు, సామూహిక అత్యాచారం, దోపిడీలు, స్నాచింగ్‌లు మొదలైన క్రూరమైన నేరాలకు పాల్పడుతున్నారని ప్రస్తుత రికార్డులు రుజువు చేస్తున్నాయి. చిన్నారులు చేస్తున్న ఇలాంటి నేరపూరిత చర్యలు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
పలు  ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తల్లిదండ్రులు, పెరుగుతున్న విద్యా వ్యయం కారణంగా తమ పిల్లల అదనపు ఖర్చులను భరించలేకపోతున్నారు. ఇది చిన్నపిల్లలు తప్పుడు మార్గాన్ని ఎంచుకోవడానికి కొన్నిసార్లు నేరపూరిత కార్యకలాపాలకు దారి తీస్తుంది.
తల్లిదండ్రులు తమ పిల్లల పెంపకంలో తగు శ్రద్ధ తీసుకోవాలి. పిల్లల అలవాట్లు, వారి స్నేహాలపై దృష్టి సారించాలి. మితిమీరిన గారాబం మంచిది కాదు.తల్లిదండ్రులు, సంరక్షకులు మరియు మొత్తం సమాజం వాటిని జాగ్రత్తగా నిర్వహించాల్సిన బాధ్యత ఉంది. టీనేజ్‌లలో నేరాలను నిర్మూలించడానికి పిల్లలలో నైతిక విద్య ఖచ్చితంగా అవసరం.

కామెంట్‌లు