భారతదేశంలో జనాభా పరివర్తన జరుగుతున్నందున, వృద్ధుల జనాభా 2025 నాటికి మొత్తం జనాభాలో 12%కి పెరుగుతుందని అంచనాలు వెలువడుతున్నాయి. ఈ శతాబ్దంలో ఎప్పటికప్పుడు పెరుగుతున్న వృద్ధ జనాభా సామాజిక మరియు ఆర్థిక సవాళ్లను మరియు మరియు పలు సామాజిక కారణాల వలన ఆరోగ్య వ్యవస్థపై అపారమైన ఒత్తిడిని కలిగిస్తుంది.ప్రతి కుటుంబంలో తక్కువ మంది పిల్లలు, సాంప్రదాయకంగా భారతదేశంలో వృద్ధులను చూసుకుంటున్న మహిళలకు ఉపాధి అవకాశాలు పెరగడం, వేగవంతమైన పట్టణీకరణ మరియు అణు కుటుంబాల పెరుగుదల వంటి సామాజిక అంశాలు వైద్య మరియు సామాజిక-ఆర్థిక వృద్ధాప్య సమస్యలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సామాజిక శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.దేశం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలలో వృద్ధులకు మెరుగైన సంరక్షణ ఒకటిగా గుర్తించబడింది. ఇందుకు కారణాలు అనేకం. ముళ్యంగా వైద్య రంగంలో వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ లోపిస్తోంది. వైద్య విద్య పాఠ్యాంశాల్లో వృద్ధుల సంరక్షణ ప్రస్ఫుటంగా లేదు. అదేవిధంగా నర్సింగ్ మరియు ఇతర పారామెడికల్ సిబ్బందికి వృద్ధ రోగులకు సంరక్షణ అందించడంలో అధికారికంగా శిక్షణ లేదు. భారతదేశంలోని చాలా వైద్య పాఠశాలల్లో జెరియాట్రిక్స్లో ప్రత్యేక శిక్షణ లేదు. జెరియాట్రిక్స్ అనేది తక్కువ ప్రొఫైల్లో ఉన్న ప్రత్యేకత, ఇది అకాడెమియాలో కనిపించదు, చాలా తక్కువ మంది దీని పట్ల ఆసక్తి చూపిస్తున్నారు.దానితో వృద్ధులకు మెరుగైన ఆరోగ్య సేవలు అనేది ఒక మిధ్యగా మారింది.
సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. నేటి వృద్ధులు తమ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసినవారే. అయినప్పటికీ కుటుంబంలో వారికి సముచిత స్థానం లభించకపోడం బాధాకరం. ఊతకర్రల సాయంతో నడిచే వృద్ధులు వీధుల్లోకి నెట్టివేయబడి అనాథలుగా మిగిలిపోతున్నారు.2004లో వృద్ధుల సమస్యలపై స్పెయిన్లో 86 దేశాల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధుల సంక్షేమం, సంరక్షణ కోసం 46 తీర్మానాలు ఆమోదించారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉదాసీనత వల్ల వృద్ధుల సమస్యను సామాజిక సంక్షేమ కోణంలో ఆలోచించకపోవడం శోచనీయం.
దేశంలో ఇటీవల వృద్ధాశ్రమాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వృద్ధాశ్రమాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం మారుతున్న ప్రజల జీవనశైలి అని చెప్పవచ్చు. పూర్వం కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. అక్కడ పెద్దలను గౌరవించేవారు, వారి పిల్లలు, మనుమలను చూసుకునేవారు. పిల్లలు మంచి ఉద్యోగావకాశాల కోసం దూరమవుతారు. వృద్ధులు ఒంటరిగా, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. దీనికి తోడు చాలా మంది యువకులు ఉద్యోగాల కోసం, తల్లిదండ్రులను వదిలి విదేశాలకు వలసవెళ్తున్నారు. దీని ఫలితంగా వృద్ధులకు సాంగత్యం, సంరక్షణ లభించే వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. అయితే వీటిలో కమర్షియల్ విధానాలే తప్ప వృద్ధాప్యంలో వృద్ధులకు కావలసిన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు లభించడం లేదు.
సమకాలీన సామాజిక, ఆర్థిక పరిస్థితులు వృద్ధులకు శాపంగా మారాయి. నేటి వృద్ధులు తమ కుటుంబ సభ్యుల అభివృద్ధి కోసం ఎన్నో త్యాగాలు చేసినవారే. అయినప్పటికీ కుటుంబంలో వారికి సముచిత స్థానం లభించకపోడం బాధాకరం. ఊతకర్రల సాయంతో నడిచే వృద్ధులు వీధుల్లోకి నెట్టివేయబడి అనాథలుగా మిగిలిపోతున్నారు.2004లో వృద్ధుల సమస్యలపై స్పెయిన్లో 86 దేశాల సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వృద్ధుల సంక్షేమం, సంరక్షణ కోసం 46 తీర్మానాలు ఆమోదించారు. కానీ అవేవీ కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఉదాసీనత వల్ల వృద్ధుల సమస్యను సామాజిక సంక్షేమ కోణంలో ఆలోచించకపోవడం శోచనీయం.
దేశంలో ఇటీవల వృద్ధాశ్రమాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. వృద్ధాశ్రమాల సంఖ్య పెరగడానికి ప్రధాన కారణం మారుతున్న ప్రజల జీవనశైలి అని చెప్పవచ్చు. పూర్వం కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా ఉండేవి. అక్కడ పెద్దలను గౌరవించేవారు, వారి పిల్లలు, మనుమలను చూసుకునేవారు. పిల్లలు మంచి ఉద్యోగావకాశాల కోసం దూరమవుతారు. వృద్ధులు ఒంటరిగా, నిర్లక్ష్యానికి గురవుతున్నారు. దీనికి తోడు చాలా మంది యువకులు ఉద్యోగాల కోసం, తల్లిదండ్రులను వదిలి విదేశాలకు వలసవెళ్తున్నారు. దీని ఫలితంగా వృద్ధులకు సాంగత్యం, సంరక్షణ లభించే వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి. అయితే వీటిలో కమర్షియల్ విధానాలే తప్ప వృద్ధాప్యంలో వృద్ధులకు కావలసిన ప్రేమ, అనురాగం, ఆప్యాయతలు లభించడం లేదు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి