శ్రీ లక్ష్మీదేవి తపస్సు వల్ల బిల్వవృక్షం పుట్టింది. దీనిని మారేడు అని, త్రీ పత్ర అని కూడా అంటారు. మైత్రాయిణి సంహితంలో సూర్య రష్మి లో నుంచి ఈ చెట్టు ఉద్భవించిందని చెప్పబడింది. మారేడు ఫలాలు, ఆకులు సాత్విక గుణాన్ని కలిగిస్తాయి. 3, ఐదు, 7, 9 ఆకులున్న మారేడు వృక్షాలు మనకి కనిపిస్తాయి. ఈ చెట్టు భారతదేశమంతటా పెరుగుతుంది. ఇది హిందువులకు ఎంతో పూజనీయమైనది. ఈ పత్రాలు లేనిదే శివ పూజ జరగదన్న విషయం జగ మెరిగిన సత్యం. దీని పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు పువ్వులు అన్నీ ఔషధాలకు పనికొస్తాయి. అతిసార వ్యాధికి, విరేచనాలు దీని పండు మంచి మందుగా పని చేస్తాయి. మొలలకు ఇది మంచి ఔషధం. దీని పళ్ళతో తయారు చేసే బిల్వ పత్ర పంచకం"వాడితే విరోచనాలు వెంటనే తగ్గుతాయి. దీని ఆకుల రసం తీసిన వెంటనే తాగితే మధుమేహ వ్యాధి తగ్గుతుంది.
బిల్వ వృక్షం. :- తాటి కోల పద్మావతి.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి