ఓ కవితా!(కవనగాలులు):- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
సుగంధమువై
ప్రసరించవే
పరవశపరచవే

మలయమారుతమై
మదులనుముట్టవే
మురిపాలుచెయ్యవే

మల్లెలసువాసనవై
మత్తునుచల్లవే
మైకములోదింపవే

హిమతుషారమువై
సమశీతలమివ్వవే
సంతసాలకూర్చవే

సుడిగాలివై
దుమ్ములేపవే
జోరుసాగించవే

తేమగాలినై
తనువునుతట్టవే
తృప్తినికలిగించవే

ప్రభంజనమువై
ప్రజలనుమేలుకొలుపవే
సాహితీప్రియులనుసంతసపరచవే

అనుకూలపవనమై
ఆటలాడించవే
పాటలుపాడించవే

పిల్లతెమ్మెరవై
ప్రేమలోనికిదించవే
భ్రమలలోనికినెట్టవే

పైరగాలివై
చల్లగావీచవే
మెల్లగాతాకవే

చిరుగాలివై
ఎదగిల్లిచెప్పవే
తీపికబుర్లనందించవే 

కవితాగాలులకు స్వాగతం
కవితలకు ఆహ్వానం
కవులకు ఆమంత్రణం


కామెంట్‌లు