పఠనీయం పాఠశాలలోని పిల్లలకు
పుస్తకమే కదా
మన పురోగతికి పూర్తిగా
పుస్తకమే అవసరం కదా
దేనికి లేని ప్రాముఖ్యత
పుస్తకంకు ఉంది కదా
మనిషిని మానవత్వంతో ఉండేటట్లు
పుస్తక పఠనం చేస్తుంది
నీలో అజ్ఞానము తొలగించి
విజ్ఞానంను పెంచును
నీ మేధస్సును బయటకు తీయును
మూర్తిమత్వవికాసం పెంపొందేటట్లు
పుస్తక పఠనం చేయును
మాతృపితృల
గురువువుల అతిథుల స్థానం
మనకు నేర్పించును
నిన్ను నీవుగా మల్చుకొని
నీ స్థానమేమిటో ప్రపంచానికి
పరిచయం చేయును
ఉన్న స్థానం నుండి
ఉన్నత స్థానంలో
మనల్ని నిలబెట్టును
పొత్తంబె కదా
==========================
( ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్బంగా రాసిన కవిత )
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి