ఏపీపీఎస్సీ పరీక్షల్లో జక్కదొన పుస్తకంపై ప్రశ్న
 
 ఏపీపీఎస్సీ నిర్వహించిన జిల్లా ఉప విద్యాధికారి పరీక్షలో  తిరుప‌తి జిల్లాకు చెందిన  ర‌చ‌యిత ఆర్.సి. కృష్ణ స్వామిరాజుపై ఒక ప్రశ్న  రావ‌డం విశేషం. పేప‌ర్ 1 జ‌న‌ర‌ల్ స్టడీస్  అండ్ మెంట‌ల్ ఎబిలిటీ ప్రశ్నాపత్రంలో 31 ప్రశ్నలో ఆయ‌న ర‌చించిన ‘జక్క దొన పుస్తక  ర‌చ‌యిత ఎవ‌రు?’ అని బ‌హులైచ్ఛిక ప్రశ్నగా  అడిగారు.
ఈ పుస్తకంలోని జక్క దొన క‌థ పాత చిత్తూరు జిల్లాలోని వెదురుకుప్పం మండ‌లం జ‌క్కదొన గ్రామం ప్రధానంగా సాగుతుంది.  ఈ ఊరు రాయ‌ల‌సీమ చిన్నోడిగా పేరుపొందిన పులికంటి కృష్ణారెడ్డి సొంత ఊరు కావ‌డం గ‌మ‌నార్హం. ఆయ‌న‌కు ఈ పుస్తకాన్ని  అంకిత‌మిచ్చారు ర‌చ‌యిత రాజు.
గత ఏడాది అక్టోబర్ లో ఈ పుస్తకాన్ని ఎస్వీ యూనివ‌ర్శిటీ సెనేట్ మందిరంలో   తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే.ఎస్.శ్రీనివాసరాజు  ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో రిజిస్ట్రా ర్ ఎం.భూపతి నాయుడు, వైస్ చాన్సిలర్  సి.హెచ్.అప్పారావు,  ఓ.ఆర్.ఐ., డైరెక్టర్ పి.సి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
 మొత్తం 21 క‌థ‌ల సంక‌ల‌న‌మైన ఈ పుస్తకంలో  అన్ని వ‌ర్గాల‌కు చెందిన వారిని ప‌రిచ‌యం చేస్తారు రచయిత. ఈ పాత్రలన్నీ  నిత్యం మ‌న జీవితంలో క‌నిపించేవే.  ఈ సంపుటిలోని అనేక క‌థ‌లు ప‌లు పోటీల్లో అనేక పుర‌స్కారాలు అందుకోవ‌డం మ‌రో విశేషం.

కామెంట్‌లు