సుప్రభాత కవిత : - బృంద
అసూయ అంధకారంలో ఉంచి 
అధర్మం అలవాటు చేసి
అబద్ధాల కోటలో పెంచి
అధఃపాతాళానికి  తొక్కేస్తుంది

అసహనం అవినీతిని 
ఆసరాగా తీసుకుని 
అందలం ఎక్కాలని 
అహరహం ఆలోచిస్తుంది.

అన్యాయపు చేతల ద్వారా 
అరాచకాలు సృష్టించి 
అమాయకుల జీవితాలను
అతలాకుతలం చేస్తుంది

సహనం శాంతి రెండూ 
చెలియలికట్టలు దాటితే 
అధర్మానికి ప్రతిఫలం
సర్వ నాశనమేనని తెలుసుకుంటుంది

వేల హృదయాలు వేదన చెంది
ఘోషించే వాదనల వేగంలో
వేరు కూడా మిగలని స్థితికి చేరుకొని

 తేరుకునే లోపలే మట్టిలో కలిసిపోతుంది

అందరి క్షేమం కోరే ధర్మమైనా
అస్తిత్వం కోసం యుద్ధం చేయాలి
కొత్త వెలుగులతో జాతికి
నిత్య మంగళ మివ్వాలి!

🌸🌸సుప్రభాతం🌸🌸

కామెంట్‌లు