'పిల్లల్ని ఊషన్నపల్లి పాఠశాలలోనే చదివించాలి' :- శ్రీరాంపూర్ స్కూల్ కాంప్లెక్స్ హెచ్.ఎం నరెడ్ల సునీత

 ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో సకల సౌకర్యాలతో పాటు ఉచిత నాణ్యమైన విద్యానందిస్తున్నారని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే చదివించాలని శ్రీరాంపూర్ స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు నరెడ్ల సునీత అన్నారు. గురువారం ఆమె ఊషన్నపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వేసవి బడి శిబిరాన్ని ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ ఈర్ల సమ్మయ్య పాఠశాల అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని, తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆయన సేవలను వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా ఆమె వాలంటీర్ సంధ్యకు పలు సలహాలు, సూచనలిచ్చారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ తాను ఇంకా 12 సంవత్సరాల పాటు ఊషన్నపల్లి గ్రామంలోని పాఠశాలలోనే ఉంటానని, పాఠశాలను, పిల్లల్ని అత్యద్భుతంగా తయారు చేయడమే లక్ష్యంగా పని చేస్తానన్నారు. అందుకు గ్రామంలోని పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ సహకరించినప్పుడే అనుకున్నది సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. ఊషన్నపల్లి గ్రామంలోని పిల్లల తల్లిదండ్రుల వద్దకు వచ్చి మాయమాటలు చెప్పి పుస్తకాల కోసం, ఫీజుల కోసమని డబ్బులు అడ్వాన్స్ గా తీసుకున్నట్లు తనకు సమాచారం ఉందని, తల్లిదండ్రులు ఎవరూ కూడా అలాంటి వారిని నమ్మవద్దని, డబ్బులు వృధా చేసుకోవద్దని ఆయన పిల్లల తల్లిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో వాలంటీర్ సంధ్య, పాఠశాల పిల్లలు, తల్లిదండ్రులు, గ్రామస్తులు, పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు