న్యాయములు-855
"అల మున్మత్త వచసి కావ్య దూషణో ద్భావనేన" న్యాయము
****
అల అనగా కెరటము,తరంగము,అల మున్మత్త అనగా గందరగోళంగా మత్తు లేదా పిచ్చిగా, అదుపుతప్పి ప్రవర్తించడం.అలమున్మత్త అనగా సముద్రములోని కెరటాలవలె నిలకడ లేని విధంగా.వచసి అనగా వాక్కులో,మాటలో. కావ్యం అనగా ఒక రకమైన కవితా రూపం లేదా పద్య రూపం.దూషణ అనగా అగౌరవంగా మాట్లాడటం, అగౌరవంగా ప్రవర్తించడం.ఉద్భావనేన అనగా కొత్తగా కనుగొనడం, సృష్టించడం,ప్రారంభించడం అనే అర్థాలు ఉన్నాయి.
వెఱ్ఱి వాడు కావ్య దూషణము చేస్తే దాని గొప్పతనము పోదు అని అర్థముతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
కావ్యము అనగా ఏమిటో చూద్దాం.కావ్యం అంటే అందంగా, ఆసక్తికరంగా,వర్ణనలతో, అలంకారాలతో ,ఊహలతో,అర్థం గాంభీర్యంతో కూడిన కవిత్వం.ఇది అలంకారాలతో,అర్థ గాంభీర్యంతో నిండి, మనసులో భావోద్వేగాలను రేకెత్తించే విధంగా చదువుతుంటే మనసులో రసాలు ఊరేలా ఉంటుంది.
కావ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కవి రాసే కావ్యంలో తనయొక్క ఊహలు,గొప్ప సౌందర్యం,నవ రసాల జోడింపు ఉంటాయి. అందమైన వర్ణనలు:- ఇందులో, వస్తువులు, వ్యక్తులు, సంఘటనలు అందంగా ఆకర్షణీయంగా వర్ణింపబడతాయి.
అర్థ గాంభీర్యం: కవి యొక్క భాషా శాస్త్ర పటిమ ఇందులో కనిపిస్తుంది.అర్థం లోతుగా, ఆలోచనాత్మకంగా ఉంటుంది. వీటితో పాటు ఔచిత్యం అనగా కావ్యం యొక్క అంశం, శైలి,భాష మొదలైనవి కావ్యానికి ప్రత్యేకత సంతరించేలా చేస్తాయి.
కావ్యాల వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.చారిత్రక అంశాలు తెలుసుకోవచ్చు.వీటి అధ్యయనం ద్వారా నైతిక విలువలు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి.
కావ్యం చదవడం వల్ల మనసులో ఆనందంతో పాటు మనసులో మంచి ఆలోచనలు,రకరకాల భావోద్వేగాలు, అనుభూతులు కలగడమే కాకుండా మనకు ప్రేరణ కలిగిస్తాయి.
సాహిత్యంలో కావ్యం రసాత్మకం అంటారు.ఈ కావ్యములలో శ్రవ్య కావ్యము మరియు దృశ్య కావ్యము అని రెండు రకాలు ఉంటాయి.శ్రవ్య కావ్యము శ్రవణానందం కలిగిస్తూ చదువుతుంటే అందులో లీనమై పోయే విధంగా చేస్తుంది.ఇక దృశ్య కావ్యం నాటక రూపంలో కళ్ళముందు ప్రదర్శించబడుతూ ప్రేక్షకులలో వివిధ రకాల అనుభూతి కలిగేలా చేస్తుంది.
" వాక్యం రసాత్మకం కావ్యం.కావ్యేషు నాటకం రమ్యం" అన్నాడు కాళిదాసు.మరి అలాంటి గొప్ప కావ్యాలను, అందులోని మంచి నాటకాలను దూషించే వాడు నిజంగా ఉన్మత్తుడే.
అయినా ఓ ఉన్మత్తుడు వెఱ్ఱి వాడు కావ్య దూషణలు చేయడమనే విషయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సముద్రంలో ఎక్కడో కొన్ని నీళ్ళు కలుషితం అయినంత మాత్రాన సముద్రానికి వచ్చే నష్టమేమీ లేదు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూ వుంటాయి.వాటి వలన ఏనుగుకు ఎలాంటి యిబ్బంది కలుగదు.
ఇది కేవలం కావ్యాన్ని ఉద్దేశించి చెప్పింది మాత్రమే కాదు. దీనిని మన పెద్దవాళ్ళు వ్యక్తులకు అన్వయించి చెప్పారు. కొంతమందికి గొప్ప వాళ్ళంటే, వారు చేసే మంచి పనులను చూస్తుంటే అస్సలు నచ్చదు. వారిపై పనిగట్టుకుని మరీ దూషణలు, అసత్య ప్రచారాలు చేస్తుంటారు. అలా చేయడం వల్ల తమకు తాత్కాలిక సంతోషం కలగవచ్చునేమో కానీ సదరు గొప్ప వ్యక్తులకు, వారు చేసే మంచి పనులకు ఎలాంటి నష్టం, కష్టం కలుగదు.
కాబట్టి ఈ "అలమున్మత్త వచసి కావ్య దూషణోద్భావనేన" న్యాయము ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే ఏ విషయంలోనూ ఉన్మత్తులుగా మారరాదు.అలాంటి వారిని పట్టించుకోకూడదు.
"అల మున్మత్త వచసి కావ్య దూషణో ద్భావనేన" న్యాయము
****
అల అనగా కెరటము,తరంగము,అల మున్మత్త అనగా గందరగోళంగా మత్తు లేదా పిచ్చిగా, అదుపుతప్పి ప్రవర్తించడం.అలమున్మత్త అనగా సముద్రములోని కెరటాలవలె నిలకడ లేని విధంగా.వచసి అనగా వాక్కులో,మాటలో. కావ్యం అనగా ఒక రకమైన కవితా రూపం లేదా పద్య రూపం.దూషణ అనగా అగౌరవంగా మాట్లాడటం, అగౌరవంగా ప్రవర్తించడం.ఉద్భావనేన అనగా కొత్తగా కనుగొనడం, సృష్టించడం,ప్రారంభించడం అనే అర్థాలు ఉన్నాయి.
వెఱ్ఱి వాడు కావ్య దూషణము చేస్తే దాని గొప్పతనము పోదు అని అర్థముతో ఈ న్యాయమును ఉదాహరణగా చెబుతుంటారు.
కావ్యము అనగా ఏమిటో చూద్దాం.కావ్యం అంటే అందంగా, ఆసక్తికరంగా,వర్ణనలతో, అలంకారాలతో ,ఊహలతో,అర్థం గాంభీర్యంతో కూడిన కవిత్వం.ఇది అలంకారాలతో,అర్థ గాంభీర్యంతో నిండి, మనసులో భావోద్వేగాలను రేకెత్తించే విధంగా చదువుతుంటే మనసులో రసాలు ఊరేలా ఉంటుంది.
కావ్యానికి కొన్ని లక్షణాలు ఉంటాయి. కవి రాసే కావ్యంలో తనయొక్క ఊహలు,గొప్ప సౌందర్యం,నవ రసాల జోడింపు ఉంటాయి. అందమైన వర్ణనలు:- ఇందులో, వస్తువులు, వ్యక్తులు, సంఘటనలు అందంగా ఆకర్షణీయంగా వర్ణింపబడతాయి.
అర్థ గాంభీర్యం: కవి యొక్క భాషా శాస్త్ర పటిమ ఇందులో కనిపిస్తుంది.అర్థం లోతుగా, ఆలోచనాత్మకంగా ఉంటుంది. వీటితో పాటు ఔచిత్యం అనగా కావ్యం యొక్క అంశం, శైలి,భాష మొదలైనవి కావ్యానికి ప్రత్యేకత సంతరించేలా చేస్తాయి.
కావ్యాల వల్ల మనకు అనేక ప్రయోజనాలు ఉన్నాయి.చారిత్రక అంశాలు తెలుసుకోవచ్చు.వీటి అధ్యయనం ద్వారా నైతిక విలువలు పెంచుకునే అవకాశాలు ఉన్నాయి.
కావ్యం చదవడం వల్ల మనసులో ఆనందంతో పాటు మనసులో మంచి ఆలోచనలు,రకరకాల భావోద్వేగాలు, అనుభూతులు కలగడమే కాకుండా మనకు ప్రేరణ కలిగిస్తాయి.
సాహిత్యంలో కావ్యం రసాత్మకం అంటారు.ఈ కావ్యములలో శ్రవ్య కావ్యము మరియు దృశ్య కావ్యము అని రెండు రకాలు ఉంటాయి.శ్రవ్య కావ్యము శ్రవణానందం కలిగిస్తూ చదువుతుంటే అందులో లీనమై పోయే విధంగా చేస్తుంది.ఇక దృశ్య కావ్యం నాటక రూపంలో కళ్ళముందు ప్రదర్శించబడుతూ ప్రేక్షకులలో వివిధ రకాల అనుభూతి కలిగేలా చేస్తుంది.
" వాక్యం రసాత్మకం కావ్యం.కావ్యేషు నాటకం రమ్యం" అన్నాడు కాళిదాసు.మరి అలాంటి గొప్ప కావ్యాలను, అందులోని మంచి నాటకాలను దూషించే వాడు నిజంగా ఉన్మత్తుడే.
అయినా ఓ ఉన్మత్తుడు వెఱ్ఱి వాడు కావ్య దూషణలు చేయడమనే విషయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే సముద్రంలో ఎక్కడో కొన్ని నీళ్ళు కలుషితం అయినంత మాత్రాన సముద్రానికి వచ్చే నష్టమేమీ లేదు. ఏనుగు వెళ్తుంటే కుక్కలు మొరుగుతూ వుంటాయి.వాటి వలన ఏనుగుకు ఎలాంటి యిబ్బంది కలుగదు.
ఇది కేవలం కావ్యాన్ని ఉద్దేశించి చెప్పింది మాత్రమే కాదు. దీనిని మన పెద్దవాళ్ళు వ్యక్తులకు అన్వయించి చెప్పారు. కొంతమందికి గొప్ప వాళ్ళంటే, వారు చేసే మంచి పనులను చూస్తుంటే అస్సలు నచ్చదు. వారిపై పనిగట్టుకుని మరీ దూషణలు, అసత్య ప్రచారాలు చేస్తుంటారు. అలా చేయడం వల్ల తమకు తాత్కాలిక సంతోషం కలగవచ్చునేమో కానీ సదరు గొప్ప వ్యక్తులకు, వారు చేసే మంచి పనులకు ఎలాంటి నష్టం, కష్టం కలుగదు.
కాబట్టి ఈ "అలమున్మత్త వచసి కావ్య దూషణోద్భావనేన" న్యాయము ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏమిటంటే ఏ విషయంలోనూ ఉన్మత్తులుగా మారరాదు.అలాంటి వారిని పట్టించుకోకూడదు.
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి