పాఠశాలలో క్రమం తప్పకుండా ఆటల పోటీలు జరుగుతుండేవి. రాజేంద్ర అనే విద్యార్థి ఎప్పుడూ క్లాస్ ఫస్ట్ రావడమే కాదు. కబడ్డీ, ఖో, వాలీబాల్ వంటి అనేక ఆటల్లో బాగా రాణిస్తూ ఫస్ట్ ప్రైజులు గెలుచుకునేవాడు. దాంతో రాజేంద్రకు పొగరు ఎక్కువ. చదువులో వెనుకబడే వారిని, ఆటల్లో రాణించలేని వారిని చులకనగా చూసేవాడు. వారిని ఎప్పుడూ హేళన చేసేవాడు.
మహేంద్ర అన్ని ఆటల్లో పాల్గొనేవాడు. కానీ రాణించలేక ఒడిపొయేవాడు. అయినా నిరుత్సాహ పడక అన్ని ఆటల్లో పాల్గొనేవాడు. ఈసారి కూడా వరసగా అన్ని ఆటల్లో రాజేంద్ర గెలుస్తున్నాడు. మహేంద్ర మళ్ళీ వరుసగా ఓడిపోతున్నాడు. ఈసారి రాజేంద్ర హేళనలు శ్రుతి మించినాయి. మహేంద్ర మౌనంగా ఉండిపోయాడు.
ఈసారి ఆటల పోటీలలో కొత్తగా క్యారమ్స్ ప్రవేశ పెట్టారు. మహేంద్ర చాలా చురుకుగా రాణిస్తున్నాడు. ప్రతి పోటీలో అందరినీ చిత్తుగా ఓడిస్తూ ఫైనల్ చేరాడు. ఫైనల్లో ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి చిత్తుగా ఓడించాడు. అయితే టీచర్ రాజేంద్రను ఒక కోరిక కోరింది. "ఆ మహేంద్ర ఫస్ట్ రావడం నాకు ఇష్టం లేదురా! వాడిని ఓడిస్తే నీకు పదివేల రూపాయల బహుమతి ఇస్తాను." అని ప్రకటించింది. రాజేంద్ర 6 నెలల గడువు అడిగాడు. ఆ 6 నెలలూ పట్టుదలతో క్యారమ్స్ నేర్చుకున్నాడు రాజేంద్ర. 6 నెలల తర్వాత పోటీకి రెడీ అన్నాడు.
టీచర్ ఇద్దరికీ పోటీ నిర్వహించింది. చుట్టూ కొంతమంది విద్యార్థులు చేరి గమనిస్తున్నారు. ముందు ప్రాక్టీస్ టెస్ట్. రాజేంద్ర గెలిచాడు. రాజేంద్ర వికటాట్టహాసం చేస్తూ మహేంద్రను హేళన చేసాడు. తనకు 10 వేల రూపాయలు ఖాయం అనుకున్నాడు. ఇప్పుడు అసలు ఆట మొదలైంది. పోటీ పూర్తిగా వన్ సైడ్ అయింది. మహేంద్ర 29 పాయింట్లు సాధించాడు. రాజేంద్ర ఒక్క ఆట కూడా గెలవకుండా సున్నా పాయింట్లు సాధించాడు. రాజేంద్ర తల దించుకుని వెళ్ళిపోయాడు. జీవితంలో ఎవరినీ హేళన చేయలేదు రాజేంద్ర. ఎవరినీ చులకనగా చూడలేదు.
పొగరు : - సరికొండ శ్రీనివాసరాజు
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి