రవీంద్రభారతిలో గద్వాల సోమన్న "సప్తతి" పుస్తకావిష్కరణ

 పెద్దకడబూర్ మండల పరిధిలోని,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంబదహాళ్ లో గణితోపాధ్యాయుడుగా పని చేస్తున్న ప్రముఖ బాలసాహిత్యవేత్త ,బాలబంధు  డా.గద్వాల సోమన్న 70వ పుస్తకం  "సప్తతి"  పుస్తకావిష్కరణ కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ ఆచార్య డా.దార్ల వెంకటేశ్వరరావు,శతాధిక పుస్తకాల ప్రచురణ కర్త డా.వైరాగ్యం ప్రభాకర్,తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా.నామోజు బాలాచారి,విజిటింగ్ ప్రాపెసర్ డా కాంచనపల్లి గోవర్ధన్ రాజు మొదలగు గారల చేతుల మీద రవీంద్రభారతి,హైదరాబాద్లో  ఘనంగా జరిగింది.తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ,భవానీ సాహిత్య వేదిక సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన,శతాధిక కవుల సమ్మేళనంలో  కవి గద్వాల సోమన్న పుస్తకావిష్కరణ జరగడం గమనార్హం.అనంతరం ఈ పుస్తకాన్ని శ్రీ కె.వి.నాగేశ్వరయ్య గారికి అంకితమిచ్చారు.ఈ కార్యక్రమంలో మరియు పాత్రికేయ మిత్రులు పాల్గొన్నారు. పుస్తక కృతికర్త గద్వాల సోమన్నను సాహితీమిత్రులు,ఉపాధ్యాయులు,శ్రేయోభిలాషులు.అభినందించారు.
కామెంట్‌లు