పూజ్యశ్రీ మలయాళ స్వాముల వారు పుట్టింది కేరళలోనే అయినా చిన్నప్పుడే తెలుగు ప్రాంతానికొచ్చి ఎంతో ఇష్టంతో తెలుగుని కావాలని నేర్చుకున్నారు. కేవలం ఏదో అలా వ్యక్తులతో మాట్లాడడానికి సరి పోయినంత తెలుగుభాషని నేర్చుకోవడం కాదు- ఆ తెలుగుభాషలో తెలుగువారు కూడా చదివి ఆనందపడే విధంగా ఉండే శైలిలో గ్రంథాలని రాయగలిగినంత స్థాయిలో తెలుగుభాషమీద అధికారాన్ని సంపాదించారు. శ్రీ మలయాళస్వామివారు.
అంతేకాదు, సామాన్య వ్యావహారిక భాషలో ఉండే తెలుగు కాకుండా గ్రాంథికభాషలో తెలుగుని కేరళ జన్మస్థలంగా కలిగివుండి కూడా మొత్తం తన జీవి తం ఉన్నంతకాలం డెబ్బె రెండు గ్రంథాలని తెలుగులో లోకానికి అందించారు. ఇక తెలుగు ప్రసంగాలకీ, సంస్కృత వేదాంత గ్రంథాల అనువాదానికీ సంఖ్యని చెప్పనే అక్కరలేదు.
అలాటి మలయాళస్వాములవారు తన ఆరాధ్యదైవ మైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికివున్న గోగర్భంలో తపస్సుని ప్రారంభించారు.
రోజూ నిత్యతపస్సు సాగుతూ వుండేది.భక్తులకి,ఆ మార్గంలో ఉన్నవారికి మాత్రమే, ఒకపక్క దర్శనం ఇస్తూనే తపస్సు కొనసాగించడం ఎంత కష్టం!
అయినా నియమ సమయపాలనని చేయడంలో దిట్ట అయిన మలయాళస్వాములవారు ఏనాడూ తన నియ మాన్ని తప్పనే లేదు. ఓ రోజున తపస్సు ముగించి వారు వస్తూంటే ఓ పెద్దపులి దాదాపు
పది అడుగుల బారు వున్నది ఆయనవద్దకే వచ్చి గాండ్రించింది. ఆయన ఆ సందర్భంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి నమస్కరిస్తూ ఓ!వ్యాఘ్రమా!
ఈ లోకానికి నా ద్వారా ఏదైనా ప్రయోజనముందని నీకనిపిస్తే నన్ను విడిచివెళ్ళిపో! నా జీవితం వ్యర్థమే అని నీకనిపిస్తే నిస్సందేహంగా నన్ను తిని నీ ఆకలిలో కొంతని తీర్చుకో! నిర్ణయం నీదే! అంటూ కనులు మూసుకుని అలాగే దానిముందు నిలబడిపోయారు.
తెగించాక భయమెందుకు? కాసేపు అలాగే నిల బడిన పులి మరోమారు గాండ్రించి వెళ్ళిపోయింది! అదీ తపశ్శక్తి మహిమంటే!
అంతేకాదు, సామాన్య వ్యావహారిక భాషలో ఉండే తెలుగు కాకుండా గ్రాంథికభాషలో తెలుగుని కేరళ జన్మస్థలంగా కలిగివుండి కూడా మొత్తం తన జీవి తం ఉన్నంతకాలం డెబ్బె రెండు గ్రంథాలని తెలుగులో లోకానికి అందించారు. ఇక తెలుగు ప్రసంగాలకీ, సంస్కృత వేదాంత గ్రంథాల అనువాదానికీ సంఖ్యని చెప్పనే అక్కరలేదు.
అలాటి మలయాళస్వాములవారు తన ఆరాధ్యదైవ మైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికివున్న గోగర్భంలో తపస్సుని ప్రారంభించారు.
రోజూ నిత్యతపస్సు సాగుతూ వుండేది.భక్తులకి,ఆ మార్గంలో ఉన్నవారికి మాత్రమే, ఒకపక్క దర్శనం ఇస్తూనే తపస్సు కొనసాగించడం ఎంత కష్టం!
అయినా నియమ సమయపాలనని చేయడంలో దిట్ట అయిన మలయాళస్వాములవారు ఏనాడూ తన నియ మాన్ని తప్పనే లేదు. ఓ రోజున తపస్సు ముగించి వారు వస్తూంటే ఓ పెద్దపులి దాదాపు
పది అడుగుల బారు వున్నది ఆయనవద్దకే వచ్చి గాండ్రించింది. ఆయన ఆ సందర్భంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామికి నమస్కరిస్తూ ఓ!వ్యాఘ్రమా!
ఈ లోకానికి నా ద్వారా ఏదైనా ప్రయోజనముందని నీకనిపిస్తే నన్ను విడిచివెళ్ళిపో! నా జీవితం వ్యర్థమే అని నీకనిపిస్తే నిస్సందేహంగా నన్ను తిని నీ ఆకలిలో కొంతని తీర్చుకో! నిర్ణయం నీదే! అంటూ కనులు మూసుకుని అలాగే దానిముందు నిలబడిపోయారు.
తెగించాక భయమెందుకు? కాసేపు అలాగే నిల బడిన పులి మరోమారు గాండ్రించి వెళ్ళిపోయింది! అదీ తపశ్శక్తి మహిమంటే!
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి