పర్యావరణం పరిరక్షణకు అందరం కృషి చేద్దాం :-బాలల మాసపత్రిక మొలక స్పెషల్ కరస్పాండెంట్ కేవీఎం వెంకట్!

 పరిగి పట్టణంలో మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల (బాలుర) పాఠశాలలో విద్యార్థులకు బాల్యం అందమైన జీవితం అనే అంశంపై బాలల మాసపత్రిక స్పెషల్ కరస్పాండెంట్ కేవీఎం వెంకట్ అవగాహన కల్పించారు. పర్యావరణం పరిరక్షణ అనే అంశంపై బాలలకు మొలక దశ నుండే అలవర్చుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించి స్వామి వివేకానందుని యొక్క జీవిత సందేశాన్ని ప్రతి ఒక్కరు అలవర్చుకోవాలని నేటి యువకులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
బలమే జీవనం బలహీనతే మరణం 
 కావున జీవితంలో కష్ట సుఖాలలో స్థితప్రజ్ఞ కలిగి ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కోటి మొక్కలు నాటిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ఖమ్మం జిల్లాకు చెందిన కీర్తిశేషులు డాక్టర్ వనజీవి రామయ్య ను స్ఫూర్తిగా తీసుకొని ప్రతి విద్యార్థి మొక్కలు నాటి పరిరక్షించాలన్నారు. నో బొకే ఓన్లీ ఓన్లీ మొక్క లేదా బుక్కు ఇచ్చే సంప్రదాయాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యుల జన్మదిన సందర్భంగా మొక్కలను నాటించి వారికి ప్రజెంటేషన్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక వికారాబాద్ జిల్లా అధ్యక్షులు ఎరన్ పల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ మొక్కలు మానవ మనుగడకు జీవనాధారం అని ప్రతి వ్యక్తి సంవత్సరానికి 5 చెట్టు నాటాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపల్ శాలిని, ఏటీపీ ప్రభ, ఉపాధ్యాయులు రాజీవ్, శ్రీనివాస్, శంకర్ మరియు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం