శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 120
 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
99. మూలాధారైకనిలయా (అష్టాక్షరీ)
100. బ్రహ్మగ్రంధి విభేదినీ (అష్టాక్షరీ)
🪷🙏🌹🎻🎺🎸🪷🙏🌹
నూరవ నామ మంత్రము - 
  ఓం బ్రహ్మగ్రంధి విభేదిన్యై నమః
"గ్రంధి = ముడి".  ప్రతీ మానవుని శరీరంలో, మేరువు లో, మూలాధార చక్రము తోపాటు ఆరు చక్రములు ఉంటాయి. ఈ ఆరు చక్రములలో, మూడు చక్రాలను కలుపుతూ, ఆరు గ్రంధులు లేదా ముడులు ఉంటాయి. ఈ మడులను ఛేదించుకుంటూ ముందుకు ప్రయాణిస్తున్న జగన్మాత అయిన పరమేశ్వరిని చూసిన వశిన్యాది వాగ్దేవతలు శ్రీలలితా పరాభట్టారికను "బ్రహ్మగ్రంధి విభేదినీ" అని కొలిచారు. ఆ విధంగా గ్రంధిని ఛేదించి మనకు జ్ఞానాన్ని పంచడానికి వస్తున్న అమ్మకు నమస్కారము.
అమ్మ ఛేదించే బ్రహ్మగ్రంధులు స్వాధిష్ఠాన చక్రములో ఉంటాయి. మూలాధార చక్రము, స్వాధిష్ఠాన చక్రముల మధ్య, స్వాధిష్ఠాన చక్రము క్రింద ఒక బ్రహ్మగ్రంధి, స్వాధిష్ఠాన చక్రము పైన ఒక బ్రహ్మగ్రంధి ఉంటాయి. మూలాధార చక్రము నుండి పైకి ప్రయాణము మొదలుపెట్టిన కుండలినీ శక్తి, ఈ బ్రహ్మగ్రంధుల యొక్క ముడులు విప్పి/ఛేదించి తన ప్రయాణం ఊర్ధ్వ ముఖంగా సాగిస్తుంది.
ఈ సృష్టిలో ఉన్న ప్రతీ మానవుడు కూడా, మూలాధార చక్రంలో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి ప్రభావంతో, నేను, నాది, నా వారు, పరాయి వారు అని అమ్మ ఏర్పరచిన చక్రబంధంలో చిక్కుకుని, ముందు వెనుకలకు ఊగిసలాడుతుంటాడు. భౌతిక సుఖములు, విషయముల మీద మాత్రమే దృష్టి పెడుతూ ఉంటాడు. కానీ, ఈ నేను, నా, ప్రపంచ సుఖాలకు పైన, సాధారణ జీవి గుర్తించలేనిదీ, నిత్య సత్యమైనదీ ఇంకొకటి ఉన్నది అనే ఆలోచన కూడా చేయలేడు, అమ్మ మాయలో కూరుకుపోయి ఉన్న సామాన్య జీవి.
ఎప్పుడైతే ఈ సామాన్య జీవుడు, అమ్మ తత్వాన్ని నమ్మి, ఈ జగత్తుకు ఆమే తల్లి అని ఒప్పుకుని, ఏ స్థితిలో అయినా నన్ను ఉద్ధరించగలిగేది శ్రీమాత ఒక్కరే అని మనసా వాచా కర్మణా, త్రికరణ శుద్ధిగా ఆరాధిస్తారో, అదిగో, అప్పుడు మొదలవుతుంది, ఆ మానవుని జీవితంలో మార్పు. సాధకుని సాధన లోని తీవ్రతను బట్టి, మూలాధార చక్రములో మహేశ్వరుని యొక్క లింగ రూపాన్ని మూడున్నర చుట్టలుగా చుట్టుకుని ఉన్న కుండలినీ శక్తి, మూలాధార చక్రమునూ, స్వాధిష్ఠాన చక్రమునూ దాటి తన ఊర్ధ్వ ముఖ ప్రయాణం సాగిస్తుంది. స్వాధిష్ఠాన చక్రములో ప్రవేశించడానికి, దాటడానికి అక్కడ ఉన్న బ్రహ్మగ్రంధుల యొక్క ముడులను విప్పి, ఛేదించి పైకి ప్రయాణిస్తుంది, జగన్మాత. ఈ గ్రంధులను ఛేదించడం వల్లనే అమ్మ "బ్రహ్మగ్రంధి విభేదినీ" అయ్యయింది.
అమ్మ "బ్రహ్మగ్రంధి విభేదినీ" అయినందు వలన, సాధకులు తమను చుట్టివున్న అజ్నాన అంధకారాన్ని వదిలించుకుని తమలోనే ప్రాణ రూపంలో ఉన్న పరమాత్మను గుర్తించ గలుగుతారు. తమ సాధన యొక్క లక్ష్యాన్ని చేరుకో గలుగుతారు.
తనను చేరుకోవడానికి కుండలినీ శక్తిని ప్రేరితం చేసే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం బ్రహ్మగ్రంధి విభేదిన్యై నమః అని జపించాలి.

ఇది శ్రీ బ్రహ్మాండ పురాణాన్తర్గతము - హయగ్రీవ అగస్త్య సంవాదము - శ్రీలలితా సహస్రనామ స్తోత్రము లో నూరవ నామమునకు భాస్కరరాయలవారి భాష్యానికి తెలుగు వివరణ - అమ్మ కరుణా కటాక్ష వీక్షణాల భాగ్యంతో.
🪷🙏🌹🎻🎺🎸🪷🙏🌹
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం