శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 131
 

వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
109. మహాసక్తిః (చతురక్షరీ)
110. కుణ్డలినీ (చతురక్షరీ)
నూట పదవ నామ మంత్రము:
ఓం కుణ్డలిన్యై నమః
కుణ్డలినీ = చెవులకు ధరించు ఆభరణము.
శ్రీమాత, తన రెండు చెవులకు మొసలి ఆకారములో గుండ్రముగా చుట్టబడి, మొసలి యొక్క తోక ముఖము వైపు వచ్చి, ఆ తోక ఆధారముగా చెవులకు అలంకరించబడిన కుణ్డలములతో దర్శనం అనుగ్రహించింది. అలా కర్ణాభరణాలైన కుణ్డలములతో కనిపించిన అమ్మను చూసి వశిన్యాది వాగ్దేవతలు జగన్మాతను "కుణ్డలినీ" అని కీర్తించారు. ఆ విధంగా "కుణ్డలినీ" గా కీర్తించబడిన పరాభట్టారికకు నమస్కారము.
అమ్మ వాగ్బీజస్వరూపం కదా! వాగ్బీజాక్షరం అయిన "ఐం" కూడా "కుణ్డలము" గానే చెప్పబడుతుంది. మూలాధార చక్రము నుండి సుషుమ్న నాడి అనబడే తామరతూడు వంటి సన్నని దారమును ఆధారముగా చే‌సుకుని, స్వాధిష్ఠాన చక్రము గుమ్మంలో, పొడవైన పాము మూడు చుట్టలుగా చుట్టుకుని, తోక భాగముతో తన ముఖాన్ని కప్పుకుని ఉన్న పరమేశ్వరి యొక్క శక్తి "కుణ్డలినీ" గా పిలువబడింది. ఈ స్థితిలో అమ్మ, అగ్ని తేజస్సుతో సమస్తశక్తులకూ, సకలజీవులకూ జ్ఞాన సంపద పంచుతూ, "కుణ్డలినీ" శక్తిగా ఉంది.
ఇంతకు ముందు అనుకున్నట్టు, "కుణ్డలినీ శక్తి" అగ్ని తత్వము తో కూడి, సర్ప రూపంలో ఉంటుంది. అందువల్ల, కుమారస్వామిని తన అధిదేవత గా కలిగి ఉంటుంది. మూలాధారంలో కుణ్డలినీ శక్తి నిద్రాణంగా ఉంటుంది. అందువల్ల మానవులు, నేను, నాది, నా వలననే పనులు అన్నీ జరుగుతున్నాయి అనే అజ్ఞాన భావనలో, పాంచభౌతిక కోరికలతో కొట్టుకుపోతూ ఉంటారు. ఈ స్థితిలో, అమ్మ దయవలన, పరమేశ్వరి నామం పలకాలి అనే స్పృహ కలిగితే, మనలో జ్ఞాన శక్తి ద్వరాలు తెరుచుకోడానికి మార్గం ఏర్పడుతోంది అని భావించాలి.
ఆ విధంగా మొదలైన పరమేశ్వరి నామ జపము స్థిరమైతే, ముందు జన్మలలోని పుణ్యవాసన తోడైతే ,పరబ్రహ్మమును తెలుసుకోవాలి అనే కోరిక స్థిరపడుతుంది. అప్పుడు, సద్గురువు అనుగ్రహం దొరికి, పరమేశ్వరి యొక్క సాధనా మార్గాన్ని మనం పట్టుకుని ముందుకు ప్రయాణం మొదలు పెడతాము.
మూలాధారము లో పృథివీ తత్వము అంటే అమ్మ ఉంటుంది. ఈ మూలాధార చక్రమునకు అధిపతి, గణపతి. స్వాధిష్ఠాన చక్రము అగ్ని తత్వము. కుమారస్వామి అధిపతి. అంటే, పరమేశ్వరి, ఆమె కుమారులు అయిన గణపతి, కుమారస్వామి ఒక దగ్గరే దర్శనం ఇస్తున్నారు కదా! తల్లీ, "బిడ్డలు ఒక చోటే ఉండాలి. వారిని వేరు చేయడం పకృతి విరుద్ధం" అని పరాత్పరి చెప్పకనే చెబుతోంది. అందుకనే అమ్మ "కుణ్డలినీ" అయ్యింది.
సాధకుడు, తన సాధనా శక్తి వలన ఈ తల్లీ బిడ్డలను సహస్రార పద్మము లో, మణిపూర పట్టణంలో త్రికోణం మధ్యలో వున్న అయ్య, సదాశివ పరబ్రహ్మ స్వరూపం అయిన శివయ్య దగ్గరకు చేర్చుతాడు. తాను, పరమానందాన్ని అందించే పరమాత్మ లోకానికి చేరి, పరబ్రహ్మ తత్త్వాన్ని తెలుసుకుని, జన్మరాహిత్యాన్ని పొందుతాడు.
తన వల్లనే ప్రేరణ, ప్రోత్సాహం పొంది, సాధనా మార్గాన్ని పట్టుకుని, తనను చేరుకోవాలి అని "కుణ్డలినీ" రూపంలో ఉన్న తనను నిద్రాస్థితి నుండి మేల్కొలుపుతున్న తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం కుణ్డలిన్యై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం