ఉల్లిగడ్డ కథ: - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212


 ఒకూర్లో ఒక ఐస్ క్రీమూ, మిరపకాయా, టమోటా, ఉల్లిగడ్డా వుండేవి. అవి నాలుగూ మంచి స్నేహితులు. ఎక్కడికెళ్ళినా కలిసే వెళ్ళేవి. కలిసే తిరిగేవి. హాయిగా ఆడతా, పాడతా, ఎగురుతా, దుంకుతా ఆనందంగా వుండేవి. ఒక రోజు నాలుగూ కలిసి స్నానం చేసొద్దామని మధ్యాన్నం తుంగభద్రా నదికి వెళ్ళినాయి. నాలుగూ నీళ్ళలో దూకి సరదాగా ఈత కొట్టసాగినాయి. కానీ పాపం నీళ్ళు తగిలీ తగిలీ ఐస్ క్రీము నీళ్ళలోనే కరిగిపోయింది, మిగతా మూడూ బైటకొచ్చి చూస్తే ఇంకేముంది. ఐస్ క్రీము లేదు. తమ మిత్రుడు చచ్చిపోయినందుకు బాధతో మిరపకాయా, టమోటా, ఉల్లిగడ్డ వెక్కి వెక్కి ఏడ్చినాయి.
ఒకరోజు మిగతా మూడు కొండారెడ్డి బురుజు చూసొద్దామని సరదాగా సాయంకాలం చల్లగాలిలో హుషారుగా షికారుకు బైలుదేరినాయి. అట్లా పోతావుంటే దారిలో బజ్జీలు వేసేటోడు మిరపకాయను చూసి ఠక్కున చేతిలోకి తీసుకోని, సెనగపిండిలో ముంచి సలసల కాగే వేడివేడి నూనెలో వేసేసినాడు. పాపం ఆ మిరపకాయ ఆ వేడికి తట్టుకోలేక అక్కడికక్కడే చచ్చిపోయింది. తమ మిత్రుడు చచ్చిపోయినందుకు బాధతో టమోటా, ఉల్లిగడ్డా వెక్కి వెక్కి ఏడ్చినాయి.
ఒకరోజు టమోటా, ఉల్లిగడ్డా సినిమా చూసొద్దామని ఆనంద్ టాకీసుకు వెళ్ళినాయి. రెండు టికెట్లు కొనుక్కోని కుర్చీలలో కూర్చోని సంబరంగా సినిమా చూడసాగినాయి. అంతలో ఒకడు చీకట్లో చూసుకోక సరిగ్గా టమోటా మీద కూర్చున్నాడు. అంతే పాపం టమోటా కడుపు పగిలి అక్కడికక్కడే చచ్చిపోయింది. తనకు మిగిలిన ఒక్క మిత్రుడూ చచ్చిపోయినందుకు బాధతో ఉల్లిగడ్డ వెక్కివెక్కి ఏడ్చింది.
అలా ఉల్లిగడ్డ ఏడ్చుకుంటా, ఏడ్చుకుంటా పోతా ఐస్ క్రీము చచ్చిపోతే నేనూ, టమోటా, మిరపకాయా ఏడ్చినాం. మిరపకాయ చచ్చిపోతే నేనూ, టమోటా ఏడ్చినాం. టమోటా చచ్చిపోతే నేనొక్కదాన్నే ఏడ్చినా. మరి రేప్పొద్దున నేను చచ్చిపోతే నాకోసం ఎవరు ఏడుస్తారు" అని ఒకచోట కూచోని దిగులుగా బాధ పడసాగింది. 
ఆకాశంలో పోతావున్న పార్వతీ పరమేశ్వరులు అది చూసి "ఏమబ్బా! పాపం ఉల్లిగడ్డ ఒక్కతే కూచోని అంత బాధ పడతావుంది. దానికేం కష్టమొచ్చిందో, ఏమో" అని రివ్వున కిందకు దిగినారు. “ఉల్లిగడ్డా! ఉల్లిగడ్డా! ఎందుకే అట్లా ఏడుస్తా వున్నావ్. ఏంది నీ బాధ" అన్నారు. దానికి ఉల్లిగడ్డ కళ్ళెమ్మట నీళ్ళు కారిపోతావుంటే వెక్కి వెక్కి ఏడుస్తా “ఏముంది సామీ! ఐస్ క్రీము చచ్చిపోతే నేనూ, టమోటా, మిరపకాయ ఏడ్చినాం. మిరపకాయ చచ్చిపోతే నేనూ, టమోటా ఏడ్చినాం. టమోటా చచ్చిపోతే నేనొక్కన్నే ఏడ్చినా. మరి రేప్పొద్దున నేను చచ్చిపోతే నాకోసం ఎవరు ఏడుస్తారు. నాకెవరూ లేరే" అనింది బాధగా. అది విన్న పరమేశ్వరుడు "అయ్యో పాపం!" అని జాలిపడి “నువ్వేమీ బాధపడకు. ఇప్పటి నుంచీ ఎవరైతే నిన్ను చంపుతారో వాళ్ళే నీ కోసం ఏడ్చేలా వరం ఇస్తున్నా పో" అన్నాడు. అంతే... ఆరోజు నుండీ ఉల్లిగడ్డను ఎవరు కోసినా వాళ్ళ కళ్ళ నుండే బాధతో నీళ్ళు కారడం మొదలైంది. 
ఎలావుంది మిత్రులారా పిల్లలు చెప్పుకునే ఈ సరదా కథ.
**********
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం