యమునా తీరంలో...: - - యామిజాల జగదీశ్


 బృందావనానికి వచ్చిన తొలిరోజుల్లోనే కృష్ణుడికి ఒకే ఒక విషయం అంటే చాలా ఇష్టం.
అది యమున.
ప్రతి రోజూ, తన దూడలను మేపిన తర్వాత, కృష్ణుడు తన మిత్రులతో కలిసి యమునా నది ఒడ్డుకు వచ్చేవాడు.
అతను ఒడ్డు వెంబడి ఇసుక మీద పరుగెత్తేవాడు.
నీటిలోకి రాళ్లు విసిరేవాడు.
అలలు వచ్చి తన పాదాలను తడిపినప్పుడు నవ్వేవాడు.
అదే సమయంలో, కృష్ణుడు యమునను ఆస్వాదిస్తుంటే, యమున కూడా అతన్ని చూసి ఆస్వాదించేది
ఎన్నో యుగాలుగా ఎదురుచూస్తున్న ఆమె....ఇప్పుడు అతని కళ్లెదుట ప్రత్యక్షమైంది....
ఒకరోజు, ఎప్పటిలాగే, కృష్ణుడు  కోపంగా ఉన్న తన మిత్రులతో యమునా నది ఒడ్డుకు వచ్చాడు.
దూరం నుండి అతన్ని చూసిన యమున, ఒక్కసారిగా పైకి ఎగిరింది.
ఆమె అలలు అకస్మాత్తుగా వేగంగా ప్రవహించడం ప్రారంభించాయి.
నెమ్మదిగా ఒడ్డును తాకుతున్న నీరు, ఇప్పుడు మున్ముందుకు సాగడం ప్రారంభించింది.
దాంతో మిత్రులందరూ భయభ్రాంతులకు గురయ్యారు.
“కన్నయ్యా... నీళ్ళు పెరుగుతు న్నాయి...రా వెనక్కు వెళ్ళిపోదాం" అన్నారు మిత్రులు.
కానీ కృష్ణుడు నవ్వాడు.
అతను నిశ్శబ్దంగా యమున వైపు చూశాడు....అలలు దగ్గరకు వచ్చాయి.
అవి ఒడ్డును తాకాయి....అవి మళ్ళీ వెనక్కి వెళ్ళాయి....అవి తిరిగి వచ్చాయి....అవి మళ్ళీ వెనక్కి వెళ్ళాయి.....
మిత్రులకు ఏమీ అర్థం కాలేదు.
“ఈరోజు యమునకు ఏమైంది?” అని అవి ఒకరికొకరు అనుకున్నారు
కృష్ణుడు ఒక్కడే ఒడ్డు వెంబడి నెమ్మదిగా నడుస్తున్నాడు.
యమున కొంచెం ముందుకు వచ్చింది.
ఒక చిన్న అల మాత్రమే అతని పాదాల వైపు పరుగెత్తుకొచ్చింది... అది అతన్ని మెల్లగా తాకింది.
అంతే....ఎన్నో యుగాలుగా యమున ఎదురుచూస్తున్న కోరిక ఆ ఒక్క క్షణంలో నెరవేరింది....ఆ అల నెమ్మదిగా వెనక్కి వెళ్ళింది.
అప్పుడు, ఎక్కడినుంచో యమున అలలతో కొన్ని తామర పువ్వులను తోసుకుంటూ వచ్చి అతని పాదాల వద్ద ఉంచింది.
అప్పటి వరకు ఆందోళనగా ఉన్న మిత్రులు ఆశ్చర్యంగా చూసారు.
“కృష్ణా... యమున నీకు పువ్వులు ఇస్తోంది!” అని చప్పట్లు కొట్టారు.
నవ్వుతున్నది ఒక్క కృష్ణుడు మాత్రమే.....కానీ యమున కోరిక అంతటితో ఆగలేదు..... ఆమె కృష్ణుడి పాదాలను తాకింది....ఇప్పుడు ఆమెకు కృష్ణుడు ముద్దు కూడా కావాలి.
ఆమె కోరిక కృష్ణుడికి తెలియదా?
ఆ క్షణంలో, దగ్గరలో ఉన్న కొన్ని దూడలు దాహంతో యమున నీటిని తాగడం మొదలుపెట్టాయి.
అవి నేరుగా నీటిలో నోరు పెట్టి తాగడాన్ని కృష్ణుడు చూశాడు.
అకస్మాత్తుగా, అతని కళ్ళలో కొంటెతనం మెరిసింది.
“అన్నయ్యా... నేను కూడా దూడల్లాగే నీరు తాగి దాహం తీర్చుకుంటాను ...” అని అన్నాడు కృష్ణుడు బలరాముడితో.
బలరాముడు ఏదో చెప్పేలోపే, కృష్ణుడు మోకాళ్ళపై కూర్చున్నాడు. అతను తన రెండు చేతులను వెనుకకు జోడించాడు.
తరువాత అతను దూడలా వంగి యమునా నది నీటిని తాగడం ప్రారంభించాడు. అది చూసి అందరూ  నవ్వడం మొదలుపెట్టారు.
"కృష్ణుడు కూడా దూడ అయిపోయాడు!" అని చప్పట్లు కొట్టారు.
కృష్ణుడు మాత్రం చాలా ఉత్సాహంగా నీటిని తాగుతున్నాడు.
యమున కూడా ఆనందంలో మునిగిపోయింది.
దేవతల పాదాలు ఆమెను తాకాయి.
ఇప్పుడు దేవతల నోరు కూడా కనిపించింది.
ఆమె అలలు మెల్లగా ఒడ్డును తాకి నాట్యం చేశాయి.
కృష్ణుడు నీటిలో నుండి పైకి లేచినప్పుడు, అతని పెదవులకు అంటుకున్న నీటి చుక్కలను చూసి యమున మరింత ఆనందపడింది.
బలరాముడు చిరునవ్వుతో అడిగాడు  "కృష్ణా... నువ్వు దూడవా? లేక అల్లరి పిల్లాడివా?"
కృష్ణుడు ఒక్క క్షణం ఆలోచించి నవ్వుతూ, “ దాహం వేస్తే, అందరం ఒక్కటే...” అన్నాడు.
ఆ రోజు బృందావనంలో కృష్ణుడి దూడలు మాత్రమే నీళ్లు తాగలేదు.
యమున కూడా తన యుగాల దాహాన్ని తీర్చుకుంది కృష్ణుడి తీర్చుకున్న దాహంతో.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం