నీడతో క్రీడ: - - యామిజాల జగదీశ్


 సాయంత్రాలలో తోటలో లేదా ప్రవేశద్వారం వచ్చ ఆడుకోవడం అంటే కృష్ణుడికి చాలా చాలా ఇష్టం.
ఆ రోజు అతను వాకిట్లో పరుగెత్తుతూ ఆడుకుంటున్నాడు.
సూర్యుడు అస్తమిస్తున్నాడు.
అతను పరుగెడుతుండగా, అతని వెనుక మరో కృష్ణుడు పరుగెడుతు న్నాడు.
మొదట అతను దానిని గమనించలేదు.
అకస్మాత్తుగా నేల మీద ఏదో నల్లనిది కదలడం చూశాడు. అంతే ఆ క్షణమే అతను ఆగాడు. అది కూడా ఆగింది.
అతను తన చెయ్యి పైకి ఎత్తాడు.
అది కూడా తన చెయ్యి పైకి ఎత్తింది.
కృష్ణుడు నవ్వాడు.
అతను తన మరో చెయ్యి ఊపాడు.
అది కూడా ఊపింది.
ఇప్పుడు కృష్ణుడికి ఆశ్చర్యం కలిగింది.
దాన్ని పట్టుకోవాలని అనుకుని, దాని మీదకు దూకాడు. కానీ అది దొరికితేగా.
కృష్ణుడు పరుగెడుతుండగా, అది కూడా పరుగెత్తింది.
కృష్ణుడు ఆగినప్పుడు, అది కూడా ఆగింది.
కొన్నిసార్లు అతను తన నీడతో మాట్లాడటం మొదలుపెట్టాడు.
కొన్నిసార్లు దాని మీద చెయ్యి పెట్టి పట్టుకోవడానికి ప్రయత్నించాడు.
అతను కిందకు వంగి నేలను తాకాడు.
తర్వాత నేలను తట్టాడు.
అదంతా చూసి బలరాముడు చప్పట్లు కొట్టి నవ్వాడు.
కృష్ణుడు మరింత వేగంగా పరిగెత్తడం మొదలుపెట్టాడు. ఒకానొక సమయంలో, తన నీడ అంతకంతకూ పెద్దదవుతుండటం చూసి భయపడి, పరిగెత్తి యశోద వెనుక దాక్కున్నాడు.
ఆమె నవ్వి అతన్ని పైకి ఎత్తుకుంది.
“అది నీ నీడా, కన్నా…” అని నందుడు అంటూనే ఉన్నాడు.
కానీ కృష్ణుడికి అర్థం కాలేదు.
అతను మళ్ళీ కిందకు దిగి దానితో ఆడుకోవడానికి పరిగెత్తాడు.
దూరం నుండి యశోద, నందుడు ఆ పిల్లవాడి ఆటను చూసి నవ్వుతూ ఆనందించారు.
ఆ రోజు అక్కడ ఇద్దరు కన్నయ్యలు ఆడుకుంటున్నారు.
ఒకడు నీలంగా ఉన్నాడు. మరొకడు నీడ.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
పద్య లక్షణాలు-ఉత్పలమాల,రుద్రవరం శివకుమార్,10వ తరగతి,జి.ప.ఉ.పా.వావిలాల, కరీంనగర్
చిత్రం