దివ్య చరణాలు: - - యామిజాల జగదీశ్

 దూడలను మేపడానికి ఎప్పటిలాగే ఉదయాన్నే బృందావనానికి వెళ్లాడు కృష్ణుడు. ఆ రోజు మధ్యాహ్నం కొంచెం వర్షం పడింది. అందువల్ల దారంతా తడితడిగా ఉంది. కృష్ణుడు పరిగెడుతూ, గెంతుతూ వస్తున్నాడు.
అప్పుడు హఠాత్తుగా నేలను చూశాడు. మట్టిలో ఒక చిన్న అడుగుజాడ కనిపించింది. అది అతని అడుగుజాడే.
కానీ అది కృష్ణుడికి తెలియలేదు. అతను ఒక అడుగు ముందుకు వేశాడు. ఆ అడుగుజాడ కూడా ఒక అడుగు పెరిగింది. కృష్ణుడు నిలబడ్డాడు. అడుగుజాడ కూడా నిలిచింది. కృష్ణుడు కళ్ళు పెద్దవి చేసి చూశాడు.
“అన్నయ్యా...” అంటూ బలరాముడిని పిలిచాడు.
“ఏంటి కృష్ణా?”
“ఇక్కడ ఎవరో నా వెనుకాలే వస్తున్నారు...” అన్నాడు కృష్ణుడు.
బలరాముడు కిందకు చూశాడు. వెంటనే నవ్వు వచ్చేసింది.
“అది నువ్వే కృష్ణా...” అన్నాడు బలరాముడు.
కృష్ణుడు నమ్మలేదు. కింద కూర్చుని తన కాళ్లను పైకెత్తి చూశాడు.
తర్వాత మట్టిలో ఉన్న అడుగుజాడలను చూశాడు. మళ్లీ తన కాళ్లను చూసుకున్నాడు.
“లేదు అన్నయ్యా... అది నా అడుగుజాడ కాదు...” అన్నాడు.
“ఎందుకలా అంటున్నావు కృష్ణా?” అని బలరాముడు అడిగాడు.
కృష్ణుడు మట్టిలో నమోదైన అడుగుజాడలను చూపించాడు.
"అదిగో చూడు... అందులో తామరపువ్వు ఉంది... తీగ ఉంది... ఇంకా ఏవేవో రేఖలు ఉన్నాయి...”
“నా కాళ్ళల్లో అవన్నీ లేవు కదా. అందుకే అది నా అడుగుజాడ కాదు...” అన్నాడు కృష్ణుడు.
బలరాముడు నవ్వాడు.
“కృష్ణా.. ఆ రేఖలన్నీ నీ కాళ్లలోనే ఉన్నాయి. నీకే తెలియడం లేదు.” అన్నాడు బలరాముడు.
“మరి అవన్నీ మట్టిలో ఎలా కనిపిస్తున్నాయా అన్నయ్యా?” అని కృష్ణుడు అడిగాడు.
“ఇది తడి మట్టి కదా... నువ్వు నడిచినప్పుడు నీ కాల్లో ఉన్న ధ్వజం, వజ్రం, అంకుశం అన్నీ అందులో ముద్రితమయ్యాయి...” అన్నాడు బలరాముడు.
కృష్ణుడు వెంటనే కిందకు వంగి ఆ అడుగుజాడలను ఇంకా జాగ్రత్తగా చూశాడు. తర్వాత తన పాదాలను చూశాడు. మళ్లీ మట్టిని చూశాడు. మళ్ళీ మళ్ళీ చూశాడు.
“ఓహో...” అన్నాడు.
కానీ మరుక్షణమే మళ్లీ ముఖం ముడుచుకుంది.
మళ్లీ ఒక అడుగు నడిచాడు. అడుగుజాడ కూడా కదిలింది.
అతను వేగంగా నడిచాడు. అడుగుజాడ కూడా వేగంగా వచ్చింది.
అతను పరిగెత్తాడు. అడుగుజాడ కూడా పరిగెత్తింది.
ఇప్పుడు కృష్ణుడికి కొంచెం భయం వేసింది.
“అన్నయ్యా! వీడు నన్ను అస్సలు వదలడం లేదు!” అన్నాడు.
ఆ మాటలతో గొల్లపిల్లలందరూ నవ్వడం మొదలుపెట్టారు. కృష్ణుడు మాత్రం చాలా సీరియస్‌గా ఉన్నాడు.
హఠాత్తుగా ఒక చెట్టు వెనుకకు పరిగెత్తి దాక్కున్నాడు. కాసేపు ఆగిన తర్వాత మెల్లగా తొంగి చూశాడు. అడుగుజాడ లేదు.
“ఆహా!” అని సంతోషపడ్డాడు.
 
“నాతో ఇప్పటి వరకూ వచ్చిన ఆ మనిషి వెళ్ళిపోయాడు!” అన్నాడు కృష్ణుడు.
చెట్టు వెనుక నుండి బయటకు వచ్చాడు. రెండు అడుగులు నడిచాడు. మళ్లీ అడుగుజాడ వచ్చేసింది.
“అన్నయ్యా!” అని అరిచాడు. “మళ్లీ వాడెవడో వచ్చేశాడు!”అన్నాడు కృష్ణుడు.
బలరాముడు నవ్వుతూనే ఉన్నాడు.
“కృష్ణా... అది నీ అడుగుజాడే...” అన్నాడు.
“లేదు. నేను ఇక్కడ ఉన్నాను. అది అక్కడ ఉంది.” అని వాదించాడు కృష్ణుడు.
బలరాముడికి అతనికి ఎలా అర్థమయ్యేలా చెప్పాలో తెలియలేదు.
దగ్గరలో ఒక చిన్న దూడ నిలబడి ఉంది. బలరాముడు దానిని చూపించాడు.
“అదిగో చూడు.... దూడ నడిచింది. దాని వెనుక అడుగుజాడ పడింది. దూడ నిలబడింది. అడుగుజాడ కూడా నిలిచింది.
కృష్ణుడు ఆశ్చర్యంగా చూశాడు. తర్వాత తన కాళ్లను చూశాడు. ఆపై నేలను చూశాడు. మళ్లీ ఒక అడుగు వేశాడు. మళ్లీ అడుగుజాడ పడింది.
అప్పుడు అతనికి అర్థమైంది.
“ఓహో.... అంటే వీడు నేనేనా?”
“అవును.”
“ఎప్పుడూ నాతోనే ఉంటాడా?”
“అవును.”
“నేను పరిగెడితే?”

“పరిగెడతాడు.”

“నేను నిలబడితే?”

“నిలబడతాడు.”
కృష్ణుడు కొన్ని క్షణాలు ఆలోచించాడు. తర్వాత అతని ముఖం వికసించింది.
“అలాగైతే నాకు ఒక స్నేహితుడు దొరికాడు!” అన్నాడు.
ఆ తర్వాత రోజంతా తన అడుగుజాడలతోనే మాట్లాడుకుంటూ నడిచాడు.
"నేను వెళ్లే ప్రతి చోటికీ నువ్వు కూడా వస్తావా? ఎక్కడికి వెళ్లినా రావాలి, సరేనా? ఎవరైనా నీతో ఏదైనా చెబితే, అది వచ్చి నాతో చెప్పాలి. సరేనా” అని చెప్పుకుంటూ నడిచాడు.
కాసేపటి తర్వాత అతనికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. 
ప్రతి చోటా చూసి చూసి అడుగులు వేయడం ప్రారంభించాడు.
“ఇదిగో... ఇక్కడ ఒక అడుగు... రాధా...” అని చెప్తూ అడుగు వేశాడు.
“ఇంకా అక్కడ ఒక అడుగు... రాధే...” అని చెప్తూ పరిగెత్తాడు.
“అయ్యో... ఆ చెట్టు కింద ఇంకా పెట్టలేదు కదా... రాధ...” అనుకుంటూ అక్కడ కూడా ఒక అడుగు వేశాడు. ముద్రించాడు.
ఆ తర్వాత అతనికి అది ఒక ఆటగా మారిపోయింది. ప్రతి అడుగు వేసేటప్పుడు, “రాధా...” అని అంటూనే వేశాడు. దూడలు మేసే పచ్చికబయళ్లలో ఒక అడుగు.
యమునా నది ఒడ్డున ఒక అడుగు. పెద్ద మర్రిచెట్టు నీడలో ఒక అడుగు.
పువ్వులు వికసించిన దారిలో ఒక అడుగు. తనకు నచ్చిన ప్రతి చోటా తన చిన్నారి అడుగులను ముద్రించాడు. ఉంచాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే సమయం వచ్చినప్పుడు, బృందావనంలో తన అడుగు పడని స్థలమే లేదని కృష్ణుడు నిశ్చయించుకున్నాడు.
"ఇది కూడా నా స్థలమే... అది కూడా నా స్థలమే...” అని ఆ అల్లరివాడు తన చరణాల ముద్రలను బృందావనమంతటా 'రాధా రాధా' అని అంటూ ముద్రించాడు. ఇలా బృందావనమంతటా కృష్ణుడి అడుగుజాడలే కాకుండా, "రాధ" అనే నామం కూడా వాటితో పాటు వ్యాపించింది. 
మీకొక మాట చెప్పనా?
ఆరోజు కృష్ణుడు కేవలం తన అడుగుజాడలను చూడలేదు. ప్రపంచమంతా అనుసరించబోయే తన దివ్య చరణాలను మొదటిసారిగా చూశాడు.


కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం
గంగిగోవు పాలు గరిటెడైనను చాలు: --ఎం బిందుమాధవి
చిత్రం