సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 ద్రోణ పర్వము ప్రథమాశ్వాసము-290 వ రోజు
అర్జునుని ఎదుర్కొన్న శకుని భంగపాటు
భగదత్తుని మరణం చూసిన నీ కుమారుడు శకుని అతడి తమ్ములు వృషకుడు అచలుడు కలిసి అర్జునుడి మీదకు దూకారు. అప్పుడు అర్జునుడు వృషకుని హయములు, రథమును, కేతనమును ఖండించాడు. వృషకుడు తన సోదరుని రథం ఎక్కాడు. అర్జునుడు తనకు అడ్డుపడిన గాంధార రథికులు అయిదు వందల మందిని చంపాడు. ఒకే రథం మీద ఉన్న వృషకుని, అచలుని అర్జునుడు ఒకే ఒక్క బాణంతో చంపాడు. వారి మరణం కళ్ళార చూసిన నీ కుమారుడు సంతాపం చెందాడు. శకుని కోపంతో రగిలి పోయి అర్జునుడిని ఎదుర్కొన్నాడు. శకుని తన మాయా శక్తితో అనేక మాయలు కల్పించాడు. రాళ్ళ వర్షం పడుతున్నట్లు, సరీసృపాలు, పెద్ద పులులు మీద పడుతున్నట్లు భ్రమ కల్పించాడు. అర్జునుడు దివ్యాస్త్ర ప్రయోగం చేసి ఆ మాయను పటాపంచలు చేసాడు. అర్జునుడు " శకుని చూసి మామా ! నీ మాయలన్నీ మాయా ద్యూతముతోనే అంత మొందాయి. ఇది యుద్ధ రంగము ఇక్కడ నీ పాచిక పారదు . ఇక్కడ తీవ్రమైన శరములు మాట్లాడతాయి వెళ్ళు " అంటూ శకుని మీద అతి క్రూరమైన శరములు వేసాడు. ఆ బాణ ధాటికి తట్టుకోలేని శకుని తన సైన్యంతో పారిపోయాడు. అప్పుడు సాత్యకి భీమసేనుడు అర్జునుడికి చెరి ఒక వైపు నిలిచారు. వారు ముగ్గురు అమిత పరాక్రమంతో సుయోధనుడి వైపు రథమును మళ్ళించాడు. వారి బాణధాటికి తట్టుకోలేని కురుసేన రెండు పాయలుగా విడిపోయి సుయోధనుని వెనుక ద్రోణుని వెనుక దాక్కున్నారు. పాండవ సేనలు ఉత్సాహంతో " ద్రోణుని నరకండి చంపండి " అంటూ కౌరవ సేన మీదికి లంఘించారు. కౌరవ సేన ద్రోణుని చుట్టూ చేరి అతడికి రక్షణ కవచంగా నిలిచారు. ఇరు పక్షములకు పోరు గోరంగా సాగుతుంది. ధృష్టద్యుమ్నుడు ద్రోణుడికి ఎటు పోతే అటు ఎదురు నిలిచి అతడితో యుద్ధానికి తలపడుతున్నాడు. ఒక పక్క ధర్మరాజు మరోపక్క సుయోధనుడు తమ సేనలను ప్రోత్సహిస్తున్నారు. ఇంతలో నీలుడు అనే రాజు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అశ్వత్థామ ఒకే బాణంతో అతడి తల ఖండించాడు. అతడి సేనలు పారి పోయాయి. ఇది చూసిన పాండవ సేన కలత పడింది. ధృష్టద్యుమ్నుడు వారిని ప్రోత్సహిస్తూ యుద్ధోన్ముఖులను చేసాడు. ఇంతలో అర్జునుడు చంపగా మిగిలిన సంశక్తులు తమ సైన్యాలను కూడగట్టు కుని " అర్జునా ! మేమేమన్నా ! ఓడిపోయామా పారిపోయామా మమ్మలిని వదిలేసి వచ్చావు. ఏడీ అర్జునుడు మాతో సమరం మానితే విజయం చేకూరుతుందా ? మాకు భయపడి దాక్కున్నావా రా బయటికి రా " అని కవ్వించారు. ఆ మాటలకు రోషం తెచ్చుకున్న అర్జునుడు తమ రథాన్ని దక్షిణం వైపు మళ్ళించాడు. కౌరవసేన శరవర్షానికి పాండవ సేన చెదిరిపోయింది. భీముడు పాండవ సేనను ప్రోత్సహిస్తూ బాక్లికునిపై క్రూర బాణాలు ప్రయీగించాడు. అది చూసిన సుయోధనుడు, కర్ణుడు, ద్రోణుడు, అశ్వత్థామ భీమునిపై శరవర్షం కురిపించారు. అది చూసిన ధర్మరాజు సాత్యకిని, అభిమన్యుని, నకుల సహదేవులను భీమునకు సాయంగా పంపాడు.
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం