శ్రీ లలితా సహస్రనామ స్తోత్రమ్ - భాగం - 134


 వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
112. భవానీ (త్ర్యక్షరీ)
113. భావనాగమ్యా (పన్చాక్షరీ)
నూట పదమూడవ నామ మంత్రము:
ఓం భావనాగమ్యాయై నమః
భావనా = భావనచేత / సాధనచేత / ఉపసనచేత, ఆగమ్య = పొందదగినది; అగమ్య = పొందలేనిది.
ఇక్కడ వశిన్యాది వాగ్దేవతలు అమ్మను పొందడానికి తగిన సాధనామార్గాలను చెపుతున్నారు. కేవలం మంత్రం చెప్పేసి, ఏవేవో క్రియలు ఆ మంత్రానికి తగినట్లుగా చేసేస్తే, అమ్మ సాక్షాత్కారము పొందలేము. మంత్రం చెప్పడమూ, క్రియ చేయడము మాత్రమే సరిపోదు. సద్గురువు ముఖతః నేర్చుకున్న మంత్రాన్ని, మనసా, వాచా నమ్మి త్రికరణశుద్ధిగా సాధన చేసే సాధకుల మదిలో కనిపించిన శ్రీమహారాజ్నిని చూసి వశిన్యాది వాగ్దేవతలు "భావనాగమ్యా" అని కీర్తించారు. అలా మంత్ర భావనను మననం చేయడం వలన కనిపించి, అనుగ్రహించే లోకమాతకు నమస్కారము.
"భావానా" పద్ధతులు మూడు విధాలు. బ్రాహ్మీభావన, మాహేశ్వరభావన, అక్షరభావన. అలాగే, అవ్యక్తరూప భావనా, వ్యక్తరూప భావనా, సగుణస్వరూప భావనా అని కూడా మూడు రూపాలుగా చెప్తారు. ఈ మూడు భావనా మార్గాలలో సాధన చేసిన సాధకులు అమ్మ యొక్క ఆత్మ తత్వమును పొంది, తాదాత్మ్యతాభావాన్ని అనుభవిచ కలుగుతారు.
అమ్మ యొక్క ఏ నామమైనా సద్గురువు నేర్పిన పద్ధతిలో చెప్పేస్తే మన గమ్యం మనం చేరలేము. "భావన" అంటే, మన మనసులో స్థిరత్వాన్ని ఏర్పరచుకుని, శ్రీమాత యందే మనసును నిశ్చలంగా లగ్నం చేసి, ఆ మంత్రం లో శ్రీమహారాజ్ఞి యొక్క సగుణ రూపాన్ని సాక్షాత్కరింప చెసుకోవాలి. "శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజా" అనే పదహారు అక్షరముల అమ్మ నామాన్ని పలికినప్పుడు, ఈ నామంలోని అర్ధాన్ని తెలుసుకుని, అమ్మ సూక్ష్మ రూపాన్ని ఊహలలో తెచ్చుకుని, మనసులో నిలుపుకోవాలి. ఈ విధంగా, భావానా మాత్రంగా దర్శనం ఇస్తుంది కనుక, శ్రీమాత "భావనా గమ్య" అయ్యింది.
ఈ విధంగా, ఏ‌ సాధకులైతే తన యొక్క నామ మంత్రాలను అర్థం చేసుకుని, ఊహలలో ఆమంత్రంలో తన రూపాన్ని నిర్మించుకుని సాధన చేసి, తనను చేరాలి అనుకునే తన సాధకులను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న  శ్రీమాతను పూజించేటప్పుడు   ఓం భావనాగమ్యాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం