58వ సర్గ : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
సీతారామ లక్ష్మణుల గూర్చి దశరథుడు సుమంత్రుని అడుగుట 




మూర్చ నుండి తేరుకున్న దశరథుడు 
ఓ సుమంత్రా! ధర్మాత్ముడైన శ్రీరాముడు 
లాలనతో, ముద్దు మురిపాలతో 
సుఖములలో పెరిగిన వాడు అతడు 

దుఃఖమునే తెలియని రఘువరుడు 
ఏ చెట్టును ఆశ్రయించి యున్నాడు?
కష్టములను ఎట్లా ఓర్చుకొనుచున్నాడు?
నా రాముడు! ఏమి తిని జీవిస్తున్నాడు?

ఓ సుమంత్రా! నా పుత్రుడు శ్రీరాముడు 
దేనిపై ఆసీనుడై ఉన్నాడు? 
ఎట్లు శయనించుచున్నాడు ? 
అతడు భుజించు ఆహారమేమిటి? 

ఈ విషయములను వివరింపుము!
స్వర్గము నుండి బ్రష్టుడైన  యయాతి 
ఇంద్రుని అనుగ్రహముతో దుఃఖవిముక్తి పొందెను 
శ్రీరామునికథాశ్రవణముతో శోకవిముక్తుడనయ్యెద

సుమంత్రుడు మహారాజుకు ప్రణమిల్లి 
రాముడు చేతులుజోడించి ఇలా అన్నాడు
ఓ సుమంత్రా! మా తండ్రి ధర్మాత్ముడు 
అతనికి నా సాష్టాంగ నమస్కారములు 

తల్లి కౌసల్యాదేవికి ప్రణామములు 
మేమందరము క్షేమము అని తెలుపుము 
అమ్మా! మహారాజును  దైవముగా భావింపుము 
కైకేయిని కూడా గౌరవింపుము. 

కామెంట్‌లు