ప్రతి క్షణం సంతోషం: - - యామిజాల జగదీశ్


 ఒక మనిషి హఠాత్తుగా చనిపోయాడు...!
అతను ఆ విషయాన్ని గ్రహించే సమయానికి, దేవుడు చేతిలో ఒక పెట్టె పట్టుకుని అతని వద్దకు వచ్చాడు...!
దేవుడు : రా కుమారా...! మనం బయలుదేరవలసిన సమయం వచ్చేసింది...!"
మనిషి : ఇప్పుడేనా? ఇంత తొందరగానా? నా ప్రణాళికలన్నీ (Plans) ఏమైపోతాయి?"
దేవుడు : నన్ను క్షమించు కుమారా...!
నిన్ను తీసుకుని వెళ్ళవలసిన సమయం ఇది...!
మనిషి : సరేకానీ నువ్వు తీసుకొచ్చిన ఆ పెట్టెలో ఏముంది?"
దేవుడు :  నీ ఆస్తులు /సామగ్రి...!
మనిషి : ఏంటీ నా వస్తువులా...! నా సామాన్లు, బట్టలు, డబ్బు...అన్నీ ఇందులోనే ఉన్నాయా? అదెలా సధ్యం?
దేవుడు : నేను చెప్పేది శ్రద్ధగా విను. 
నువ్వు చెప్పినవేవీ నీవి కావు...అవి భూమిపై నువ్వు జీవించడానికి అవసరమైనవి... అంత వరకే వాటితో నీ అవసరం...!
మనిషి :  అలాగైతే నా జ్ఞాపకాలా?"
దేవుడు : అవి కాల గమనం...!
మనిషి : నా నైపుణ్యాలా (Talents)?"
దేవుడు : అవి నీ పరిస్థితులకు సంబంధించినవి...!"
మనిషి : అలాంటప్పుడు నా కుటుంబమూ, చుట్టాలూ, స్నేహితులా? వీళ్ళందరి సంగతేమిటి?
దేవుడు : క్షమించు! కుటుంబం, చుట్టాలూ, స్నేహితులు నువ్వు జీవించడానికి మార్గాలు...!"
మనిషి : అలాగైతే నా భార్య, పిల్లలా?"
దేవుడు : నీ భార్య, పిల్లలు నీకు సొంతమైనవారు కారు...! వారు నీ హృదయానికి సంబంధించినవారు.!
మనిషి : అంటే నా శరీరమా?"
దేవుడు : అది కూడా నీకు సొంతమైనది కాదు...! శరీరమూ, చెత్తా ఒకటే...!"
మనిషి : నా ఆత్మ?"
దేవుడు :  అది కూడా నీది కాదు...! అది నాది...!
ఈ మాటతో మనిషి మిగిలిన భయంతో దేవుని నుండి ఆ పెట్టెను తీసుకుని తెరిచిన అతను ఖాళీ పెట్టెను చూసి షాక్‌కు గురయ్యాడు. ఆశ్చర్యపోయాడు...! విస్తుపోయాడు...!
కళ్లలో నీళ్లు కారుతుండగా దేవుడితో
"అంటే నాది అని చెప్పుకోవడానికి ఏమీ లేదా?" అని అడిగాడు కన్నీటిపర్యంతమై...!
దేవుడు, "అదే నిజం !
నువ్వు జీవించే ప్రతి క్షణం మాత్రమే నీది...! జీవితం అంటే నువ్వు దాటే ఒక క్షణమే...! ప్రతి క్షణాన్ని సంతోషం గా జీవించు...! అన్నీ నీవే అని అనుకోకు...! ప్రతి క్షణాన్ని జీవించు...! నీ జీవితాన్ని నువ్వు జీవించు...!
సంతోషంగా జీవించు...! అది మాత్రమే శాశ్వతం...! నీ చివరి రోజుల్లో నువ్వు దేనినీ నీతో తీసుకెళ్లలేవు...!" అన్నాడు.
అందుకే జీవిస్తున్న ప్రతి క్షణాన్ని సంతోషంగా జీవిద్దాం...! కక్షలూ కార్పణ్యాలూ వ్యర్థం.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం