రథాశ్వగజ బలములతో సమృద్ధముగాయున్న
విశాలమైన ఈ కోసల రాజ్యమును
ఆ కైక ద్వారా నీకు లభ్యమైనది
కఠినాది కఠినమైన పెక్కు మాటలను
కౌసల్యా దేవి భరతునితో పలికెను
ఏ పాపము ఎరుగని ఆ మహాత్ముడైన
భరతుని హృదాయానికి సూదులవలె గ్రుచ్చెను
వెంటనే భరతుడు కౌసల్య పాదాలపై బడెను
అతడు పెక్కు విధములుగా విలపించి
అచ్చటనే స్పృహను కోల్పోయెను
కొంతసేపటికి స్పృహలోకి వచ్చెను
కౌసల్యకు అతడు అంజలి ఘటించెను
కుమిలిపోవుచున్న కౌసల్యాదేవితో
భరతుడు ఇట్లు విన్నవించెను
ఓపూజ్యురాల! ఈ పట్టాభిషేకముగూర్చి
నాకు ఏ విషయము తెలియదు తల్లి
శ్రీరామునిపై నాకున్న భక్తిని నీవెరుగుదువు
తల్లీ! ఏ పాపము ఎరుగని నన్ను
నీవు ఇలా! నిందించుచుంటివమ్మా.

addComments
కామెంట్ను పోస్ట్ చేయండి