టొప్పాయి గింజల పూబోణి: - డా. కందేపి రాణీప్రసాద్


 హలో పిల్లలూ! జుట్టు పైకి కట్టుకొని పరుగులు తీస్తున్న ఈ చిన్నారిని గమనించారా! నల్లగా తారు డబ్బాలో ముంచినట్లున్న ఈ అల్లరి ఓడుగును వేటితో తయారు చేశాననుకుంటున్నారు. బొప్పాయి విత్తనాలతో తయారు చేశాను. మిసిమి రంగు బొప్పాయికి ఈ నల్ల రంగు పిల్లలేమిటో! నేను ఈ బొప్పాయి పండుకు పొడుపు కథను రాశాను. మినీ కవితలు రాశాను. ఇప్పుడు ఈ గింజలతో అమ్మాయిని చేసేశాను. ఇవి నల్లగా ఉంటాయని ఆడపిల్లను చేయవద్దనుకున్నాను. కానీ ఇప్పుడు చేసేశాను. బొప్పాయి మధ్య అమెరికా, మెక్సికోలకు చెందిన పండు. ఇవి భారతదేశంలోకి ప్రవేశించి 400 ఏళ్ళు అయింది. దీని శాస్త్రీయ నామం "కారికా పపయా" ఇది'కారికేసి' కుటుంబానికి, ‘‘బ్రాసి కేలిస్’’ క్రమానికి చెందిన మొక్క. ఈ లబొప్పాయి పండులో ఉన్న విటమిన్లు మరెందులోనూ ఉండవు అని చెబుతారు. కడుపులోని ప్రేగుల్ని శుభ్రం చేస్తుంది. ప్రేగులు శుభ్రమైతే శరీరం మొత్తం శుభ్రంగా ఉన్నట్లే అంటారు. చాలా రకాలున్నా బొప్పాయిలో ముఖ్యమైనవి రెండే రకాలు. 1.డయోషియస్, 2.గైనో డయీషియస్. గైనో డయీషియస్ రకంలో గుజ్జు నారింజ రంగులో ఉంటుంది. డయీషియన్ రకంలో గుజ్జు పసుపు రంగులో ఉంటుంది. పూసా జెయింట్ అనే రకాన్ని కూర తయారిలో వాడుతారు. బొప్పాయి కాయల పాలు సేకరించి "పపైన్' తయారు చేస్తారు. బొప్పాయి పండు తినడం వలన గర్భస్రావం అవుతుందనీ, పాలిచ్చే తల్లి తింటే బిడ్డకు అజీర్తి చేస్తుందని! ఆపోహలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాలలో బొప్పాయి గింజల్ని ఎండబెట్టి మిరియాలకు బదులుగా వాడుతారు. బొప్పాయి గుజ్జ శరీరానికి నిగారింపును ఇస్తుంది. సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు.
నల్లగం నిగనిగలాడే గుండ్రని బొప్పాయి గింజలతో నిగ్రో అమ్మాయి తయారయింది. బుట్ట చేతుల గౌను తొడుక్కుంది. కాళ్ళకు ఏమి వేసుకోలేదు. ఉత్తి కాళ్ళతో తిరుగుతోంది. నల్లగా ఉన్నానని అటు తిరిగి నిలబడి ముఖం చూపించనన్నది. చెవులకు పోగులు పెట్టుకున్నది.
కామెంట్‌లు
Popular posts
ఎఱ్ఱాప్రగడ . .; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై
చిత్రం
రక్తసంబంధం కన్నా గుణ సంబంధం గొప్పది!!: - కె ఎస్ అనంతాచార్య కరీంనగర్ -9441195765
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం