గొప్ప మనసున్న వ్యక్తి ఎంజీఆర్: - - యామిజాల జగదీశ్


 ఆయన ఎదిగి పెద్ద నటుడైన తర్వాత, ఒకప్పుడు తను పని చేసిన 'నెప్ట్యూన్' స్టూడియోను కొనుగోలు చేసి, దానికి తన తల్లి పేరు మీద 'సత్య స్టూడియో' అని పేరు పెట్టారు. ఆయన మరెవరో కాదు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. జి. రామచంద్రన్. ఎం.జీ. ఆర్ అనే పేరుతో కోట్లాది మంది హృదయాల్లో ఎప్పటికీ చెరగిపోని స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప మనసున్న వ్యక్తి.
అదే స్టూడియో ఫ్లోర్‌లో పూర్వం పనిచేసిన 'అప్పన్' అనే ఉద్యోగి ఇంకా అక్కడే పని చేస్తుండటం చూసి, ఆయనను తన దగ్గరకు పిలిచారు.. "ఏంటి అప్పన్ గారు, ఎలా ఉన్నారు?" అని అడిగారు.
"బాగున్నాను అయ్యా.." అన్నాడు అప్పన్. 
"పాత నెప్ట్యూన్ స్టూడియోలో ఇదే ఫ్లోర్‌లో మీకు ఎంత జీతం ఇచ్చేవారు?" అని అడిగారు ఎంజీఆర్.
అప్పన్ తను తీసుకునే జీతం ఎంతో చెప్పగా.. "సరే, వచ్చే నెల నుండి మీకు రెట్టింపు జీతం ఇస్తాను. కానీ ఒక చిన్న విషయం..." అన్నారు.
"ఒకప్పుడు నేను ఇదే ఫ్లోర్‌లో ఒక చిన్న సైడ్ క్యారెక్టర్ (సహ నటుడిగా) వేషం వేస్తూ, ఆ అవకాశం ఎక్కడ చేజారిపోతుందో అన్న భయంతో కింద నేలపై కూర్చున్నాను...
అప్పుడు మీరు ఒక జగ్గుతో ఏదో తీసుకువెళ్తుంటే, అది తాగునీరు అనుకుని నేను మిమ్మల్ని కొంచెం నీళ్లు అడిగాను.
కానీ మీరు మాత్రం.. 'ఇది నీళ్లు కాదు జ్యూస్, ఇది నీలాంటి వాళ్ల కోసం కాదు' అని చెప్పి నన్ను దాటి వెళ్ళిపోయారు..." అని గుర్తుచేశారు.
దాంతో అప్పన్ కంగారుపడి, భయంతో.. "అయ్యా, అప్పట్లో నాకు మీ గురించి తెలీదు, ఇప్పుడు ఆ విషయం అస్సలు గుర్తులేదు అయ్యా.." అన్నాడు.
దానికి ఆ మహానుభావుడు నవ్వుతూ.. "పరవాలేదు... ఇకపై ఈ స్టూడియో ఫ్లోర్‌లో ఎవరు ఏది అడిగినా లేదు అనకుండా ఇవ్వాలి... అందుకోసమే ఈ జీతం పెంపు!" అన్నారు ఎంజీఆర్ అనే మహానుభావుడు...
ఆయనే అన్నా డీఎంకే (AIADMK) పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు!
ఎం.జీ.ఆర్ గారి ఉదారతను, అపకారికి కూడా ఉపకారం చేయాలనే ఆయన గుణాన్ని ఈ కథనం ఓ ఉదాహరణ.
కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
మొల్ల విరులు;- .బి. అరుణ- పి జి టి - తెలుగు
ఉరుదూ తెలుగు సాహిత్య వారధి డా. సామల సదాశివ; రామ్మోహన్ రావు తుమ్మూరి
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం