మానేరు ముచ్చట్లు--నిన్న మన ముచ్చట్లలో వేములవాడ చాళుక్యులలో అగ్రగణ్యుడైన రెండవ అరికేసరి గురించి ప్రస్తావించుకున్నాం. కొంత మందికి సందేహం కలుగ వచ్చు.ఎలగందుల చరిత్రలో వేముల వాడ ఎందుకు వచ్చింది అని.ఎలగందులకు వేములవాడ రెండు ఆమడలు లేదా ఎనిమిది క్రోసులు అంటే పదహారు మైళ్లు ఇప్పటి లెక్కన ఇరవై అయిదు కిలో మీటర్లు(ఇది ఈ తరం వారి కోసం) దూరం లో ఉంది. హైదరా బాదులో ఇంటి నుంచి ఆఫీసుకు పోయినంత దూరం.అంత దగ్గరలో ఉన్న రాజ్యవ్యవస్థకు ఈ గ్రామానికి సంబంధం ఉండక పోవడం అంటూ ఉండదు.కనుక మనకు ఏ విధమైన శాసనాధారాలు లేకపోయినా కాకతీయుల అధీనంలోని వచ్చేదాకా తప్పక ఎలగందుల /బహుధాన్యపురం వేములవాడ చాళుక్యుల అధీనం లో ఉన్నట్టు భావించ వచ్చు.అదీ కాకుండా దక్షిణ కాశిగా అభివర్ణించబడిన వేములవాడ ప్రశస్తి నాటి ఎలగందుల జిల్లాది కూడా అవుతుంది. ఇక అరికేసరి ఆస్థానంలోని పంపకవి, అతని తమ్ముడు జినవల్లభుడు ఈ ప్రాంతానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టిన వారు.పంపకవి తండ్రి భీమప్పయ్యది వేంగినాడులోని వంగిపర్రు గ్రామం.శ్రీవత్స గోత్రీకుడు.పుట్టింది వైదిక బ్రాహ్మణ వంశమైనా యజ్ఞయాగాది క్రతువులు నచ్చక జైన మతం స్వీకరించి జైనమతావలంబులైన సబ్బినాటి పాలకులు వేములవాడ చాళుక్యులుం డటంతో 1910 లో అక్కడికి చేరుకున్నా డు. అప్పటికి పంపనికి పదేళ్లు.అప్పటికే ధార్వాడ ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ జైనబ్రాహ్మణుడు సింగన జోస్యులు తన కూతురు వబ్బెణబ్బె ను భీమప్పయ్యకిచ్చి పెళ్లి చేసాడు.ఆమెకు జన్మించిన వాడు జినవల్లభుడు.అన్నదమ్ములిద్దరు నాటి రాజభాష కన్నడం,మతభాష సంస్కృ తం, మాతృభాష తెలుగును బాగా అధ్యయనం చేసి కవిత్వం చెప్పి పేరుతెచ్చుకున్నారు. పంపడు కన్నడంలో విక్రమార్జున విజయ,ఆదిపురాణం రాసి కన్నడకవిత్ర యంలో కన్న,పొన్నలతో పాటు పేరు తెచ్చుకున్నాడు.ఈయన తెలుగులో తన గురువు జినేంద్రునికి సంబంధించిన గాథను జినేంద్ర పురాణంగా రచించాడు కాని అది అలభ్యము.ఉంటే తెలుగులో అదే ఆదికావ్యమయ్యేది. జినవల్లభుడు గంగాధర సమీపంలోని వృషభాద్రి గా పిలువబడే గుట్టపై గండశిలపై కన్నడ, సంస్కృత,తెలుగు భాషలలో శ్లోకాలు పద్యాలు చెక్కించాడు.ఈ శాసనం తొలి తెలుగు పద్యానికి ఆనవాలుగా నిలిచియున్నది.ఇందులో అరికేసరి గురించి,పంపకవి పుట్టు పూర్వోత్తరాల గురించి లిఖించడమే గాక జినభవనములెత్తించుట జినపూజల్సేయుచున్కి జినమునులకు న త్తిన యన్నదానంబీవుట జినప్రభువును బోలగలరె జినధర్మ ప్రభుల్ దినకరు సరి వెల్గుదుమని జినవల్లభు నొట్టనెత్తు జితకవి నననుం మనుజులు గలరే ధాత్రిం వినితిచ్చిదు ననియ వృత్త విబుధ కవీన్ద్రుల్ అని జైనమతాభి వృద్దికి వారు చేసిన సేవలను కొనియాడారు.మూడవ పద్యం నిన్న చెప్పబడింది.ఇలా అరికేసరి కాలంలో వీరిరువురే గాక కవిజనాశ్రయ కర్త మల్లియ రేచన,సోమదేవ సూరి మొదలగు వారి గురించి తరువాత తెలుసుకుందాం.- రామ్మోహన్ రావు తుమ్మూరి
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
• T. VEDANTA SURY
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
• T. VEDANTA SURY
రామాయణం నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
• T. VEDANTA SURY
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
• T. VEDANTA SURY
Publisher Information
Contact
molakanews@gmail.com
9848992841
H.NO. 1-9-319/1/1/G2, VIJAYADURGA RESIDENCY VIDYANAGAR,DIST-HYDERABAD-44
About
This is the children's page
Share this page
Email
Message
Facebook
Whatsapp
Twitter
LinkedIn
addComments
కామెంట్ను పోస్ట్ చేయండి