రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.

 1.ప్ర: శ్రీ మద్రామాయణము రచించిన మహర్షి ఎవరు?
జ:- వాల్మీకి.
2.ప్ర: వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు?
జ:- నారదుడు.
3.ప్ర: రామకథను వినిన తర్వాత వాల్మీకి మహర్షి, మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్లాడు?
జ:- తమసా నది.
4.ప్ర: శ్రీమద్రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు వున్నాయి?
జ:- 24,000.
5.ప్ర: శ్రీమద్రామాయణాన్ని గానము చేస్తూ మొదట ప్రచారం చేసిందెవరు?
జ:- కుశలవులు.
6.ప్ర: అయోధ్యా నగరం ఏ నది ఒడ్డున ఉన్నది?
జ:- సరయూ నది.
7.ప్ర: అయోధ్య ఏ దేశానికి రాజధాని?
జ:- కోసల రాజ్యం.
8.ప్ర: దశరథ మహారాజుకు ఆంతరంగికుడైన మంత్రి ఎవరు?
జ:- సుమంత్రుడు.
9.ప్ర: దశరుథుని భార్యల పేర్లు ఏమిటి?
జ:- కౌసల్య, సుమిత్ర, కైకేయి.
10.ప్ర: సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు?
జ:- పుత్రకామేష్ఠి.
11.ప్ర: యజ్ఞకుండమునుండి వెలువడిన దివ్య పురుషుడు ఇచ్చిన పాయసాన్ని దశరథుడు తన భార్యలకు ఎట్లు పంచెను?
జ:- కౌసల్యకు 50%, సుమిత్రకు 25%, కౌకేయికి 12.5%, మిగిలిన 12.5% మళ్లీ సుమిత్రకు.
12.ప్ర: బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవ్వరు?
జ:- జాంబవంతుడు.
13. ప్ర: వాలి ఎవరి అంశతో జన్మించెను?
జ:-  దేవేంద్రుడు.
14.ప్ర: వాయుదేవుని వలన జన్మించిన వానరుడెవరు?
జ:- హనుమంతుడు.
15.ప్ర: కౌసల్య కుమారుని పేరేమిటి?
జ:- శ్రీరాముడు.
16.ప్ర: భరతుని తల్లి పేరేమిటి?
జ:- కైకేయి.
17.ప్ర: రామలక్ష్మణ భరత శత్రుఘ్నలలో కవలలు ఎవరు వారి తల్లి పేరేమిటి?
జ:- లక్ష్మణ, శత్రుఘ్నులు- తల్లి సుమిత్ర.
18.ప్ర: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకు నామకరణము చేసిన మహర్షి ఎవరు?
జ:- వసిష్ఠుడు.
19.ప్ర: విశ్వామిత్రుడు వచ్చేనాటికి రాముని వయస్సు?
జ:- 12 సంవత్సరములు.
20.ప్ర: విశ్వామిత్రుని యజ్ఞానికి విఘ్నాలను కల్పిస్తున్న రాక్షసులెవరు?
జ:- మారీచ, సుబాహులు.
21.ప్ర: రామునికి అలసట, ఆకలి లేకుండా వుండుటకు విశ్వామిత్రుడు ఉపదేశించిన మంత్రం పేరేమిటి?
జ:- బల-అతిబల.
22.ప్ర: విశ్వామిత్రుని ఆశ్రమం పేరు?
జ:- సిద్ధాశ్రమం.
23.ప్ర: తాటక భర్త పేరేమిటి?
జ:- సుందుడు.
24.ప్ర: తాటకను శపించిన మహర్షి ఎవరు?
జ:- అగస్త్యుడు.
25.ప్ర: గంగను భూమికి తెచ్చుటకు తపస్సు చేసినదెవరు?
జ:- భగీరథుడు.
26.ప్ర: గంగకు జాహ్నవి అనే పేరు ఎందుకు వచ్చెను?
జ:- జహ్ను మహర్షి చేత త్రాగివేయబడుటచే.
27.ప్ర: అహల్య భర్త ఎవరు?
జ:- గౌతమ మహర్షి.
28.ప్ర: జనక మహారాజు ఆస్థాన పురోహితుడెవరు?
జ:- శతానందుడు.
29.ప్ర: సీత ఎవరికి జన్మించెను?
జ:- నాగటి చాలున జనకునికి దొరికెను.
30. ప్ర: శివుడు తన ధనుస్సును ఏ మహారాజు వద్ద వుంచెను?
జ:- దేవరాతుడు.
31.ప్ర: శివధనుస్సును తయారు చేసినదెవరు?
జ:- విశ్వకర్మ.
32.ప్ర: భరత శత్రుఘ్నల భార్యల పేర్లు?
జ:- మాండవి, శృతకీర్తి.
33.ప్ర: లక్ష్మణుని భార్యయైన ఊర్మిళ తండ్రి ఎవరు?
జ:- జనకుడు.
34.ప్ర: జనకుడి తమ్ముడి పేరు ఏమిటి?
జ:- కుశధ్వజుడు.
35.ప్ర: పరశురాముడు శ్రీరామునికి యిచ్చి ఎక్కుపెట్టమన్న ధనుస్సు పేరేమిటి?
జ:- వైష్ణవ ధనుస్సు.
36.ప్ర: భరతుని మేనమామ పేరు ఏమిటి?
జ:- యధాజిత్తు.
37.ప్ర: దశరధుని వరాలు కోరమని కైకను ప్రేరేపించినదెవరు?
జ:- మంధర.
38.ప్ర: కైక దశరథుణ్ణి వరాలు కోరినపుడు భరతుడెచట వుండెను?
జ:- గిరివ్రజపురం, మేనమామ యింట.
39.ప్ర: రాముని మిత్రుడు గుహుడు వుండే ప్రాంతమేది?
జ:- శృంగిబేరపురం.
40.ప్ర: సీతారాములు తమ వనవాసం మొదటిరోజు రాత్రి ఏ వృక్షం క్రింద నిద్రించెను?
జ:- గారచెట్టు.
41. ప్ర: శ్రీరాముని వనవాసమునకు చిత్రకూటము తగినదని సూచించిన ముని ఎవరు?
జ:- భారద్వాజ ముని.
42.ప్ర: పర్ణశాలకు సమీపములోని నది పేరేమిటి?
జ:- మాల్యవతీ.
43.ప్ర: దశరథుని శవమును భరతుడు వచ్చే వరకు ఏడు రోజులపాటు ఎక్కడ భద్రపరిచారు?
జ:- తైలద్రోణములో.
44.ప్ర: శ్రీరామునితో నాస్తికవాదన చేసినదెవరు?
జ:- జాబాలి.
45.ప్ర: భరతుడు రాముని పాదుకలనుంచిన పట్టణమేది?
జ:-నంది గ్రామము.
46. ప్ర: అత్రిమహాముని భార్య ఎవరు?
జ:-.అనసూయ.
47.ప్ర: దండకారణ్యంలో రామలక్ష్మణులను ఎదుర్కొన్న మొదటి రాక్షసుడెవరు?
జ:- విరాధుడు.
48.ప్ర: పంచవటిలో నివసింపుమని రామునికి సలహా ఇచ్చినదెవరు?
జ:- అగస్త్యుడు.
49. ప్ర: పంచవటి ఏ నదీతీరమున ఉన్నది?
జ:- గోదావరి.
50. ప్ర: లక్ష్మణుడు ఎవరి చెవులు ముక్కు కోసెను?
జ:- శూర్ఫణఖ.
51.ప్ర:  ఖరదూషణాది పదునాలుగు వేల మంది రాక్షసులు ఎక్కడినుండి పంచవటికి వచ్చెను?
జ:- జనస్థానము.
52.ప్ర: సీతను అపహరించుటకు రావణుడు ఎవరి సహాయము కోరెను?
జ:- మారీచుడు.
53.ప్ర: సీత రాముడిని కోరిన మాయా మృగం ఏది?
జ:- బంగారులేడి.
54.ప్ర: సీతను తీసుకుపోతున్న రావణునితో యుధ్ధము చేసిన పక్షి ఎవరు?
జ:- జటాయువు.
55.ప్ర: సీతను అన్వేషించుచున్న రామలక్ష్మణులకు అరణ్యములోని మృగములు ఏ దిక్కుకు సంకేతము చూపెను?
జ:- దక్షిణపు దిక్కు.
56.ప్ర: సీతాన్వేషణలో వున్న రామలక్ష్మణులు ఏ రాక్షసుని హస్తములలో చిక్కుకొనెను?
జ:- కబంధుని.
57.ప్ర: సీతాన్వేషణలో రామలక్ష్మణులు చేరుకున్న శబరి ఆశ్రమం ఏ నదీ తీరాన, ఏ వనంలో వున్నది?
జ:- మతంగ వనం, పంపానదీ.
58.ప్ర: సుగ్రీవాదులు ఏ పర్వత ప్రాంతంలో నివసించు చుండెను?
జ:- ఋష్యమూక పర్వతం.
59.ప్ర: రామలక్ష్మణులను గురించి తెలుసుకొనుటకై వారివద్దకు సుగ్రీవుడు ఎవరిని పంపెను?
జ:- హనుమంతుడు.
60.ప్ర: రామసుగ్రీవుల మైత్రి ఎవరి సాక్షిగా జరిగెను?
జ:- అగ్ని సాక్షిగా.
61.ప్ర: రాముడు తన బాణములు దేనితో తయారు చేయబడినవని సుగ్రీవునికి చెప్పెను?
జ:- కుమారస్వామి జనించిన వనములోని బంగారు కాండములు.
62.ప్ర: సుగ్రీవుని భార్య పేరు?
జ:- రుమ.
63.ప్ర: వాలి భార్యపేరు?
జ:- తార.
64.ప్ర: వాలి సుగ్రీవుల రాజ్యము పేరేమిటి?
జ:- కిష్కింధ.
65.ప్ర: వాలిని కవ్వించి పారిపోయి బిలంలో దాక్కున్న రాక్షసుడు పేరేమిటి?
జ:- మాయావి.
66.ప్ర: హిమవంతుని సలహాతో వాలితో యుద్ధానికి వచ్చిన రాక్షసుడు ఎవరు?
జ:- దుందుభి.
67.ప్ర: వాలి విసిరిన దుందుభి కళేబరం ఎవరి ఆశ్రమంలో పడెను?
జ:- మతంగముని.
68.ప్ర: వాలి కుమారుని పేరేమిటి?
జ:- అంగదుడు.
69.ప్ర:  రాముడు ఒకే బాణంతో ఎన్ని సాలవృక్షములను భేదించెను?
జ:- ఏడు.
70.ప్ర:  సుగ్రీవుని రాజ్యాభిషేకము తర్వాత రామలక్ష్మణులు ఎక్కడ నివసించెను?
జ:- ప్రసవణగిరి.
71.ప్ర:  సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *తూర్పు* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
జ:- వినతుడు.
72.ప్ర: సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *దక్షిణ* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
జ :- అంగదుడు.
73.ప్ర:  సుగ్రీవునికి,  సీతాన్వేషణ కోసం *పశ్చిమ* దిక్కుకు పంపబడిన సుషేణునికి బంధుత్వమేమిటి?
జ:- మామగారు, తార తండ్రి.
74.ప్ర: సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు *ఉత్తర* దిక్కుకు పంపిన వానర సేనకు నాయకుడెవరు?
జ- శతబలుడు.
75.ప్ర:  సీతాన్వేషణ కోసం సుగ్రీవుడు వానరులకు ఎంత సమయం గడువిచ్చెను? 
జ:- మాసం (ఒక నెల).
76.ప్ర: హనుమంతుడు ఏ దిక్కుకు వెళ్లిన వానరసేనలో వుండెను?
జ:- దక్షిణ దిక్కు.
77.ప్ర:  సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతునికి ఏమిచ్చెను?
జ:- తన (రామ) పేరు చెక్కబడిన ఉంగరము.
78.ప్ర: హనుమంతుడు మొదలైన వానరులు చిక్కుకున్న బిలం (లోయ)లో వున్న తాపసి పేరేమిటి?
జ:- స్వయంప్రభ.
79. ప్ర: సముద్రమవతల వున్న రావణునిని, సీతను చూడగల్గుతున్నానని వానరులకు చెప్పిన పక్షి పేరేమిటి?
జ:- సంపాతి.
80.ప్ర:  హనుమంతుని తల్లి యైన అంజన అసలు పేరు?
జ:- పుంజికస్థల.
81. ప్ర: హనుమంతుడు సముద్రమును లంఘించుటకు ఎక్కిన పర్వతం పేరేమిటి?
జ:- మహేంద్రపర్వతము.
82.ప్ర: హనుమంతుడు సముద్రం దాటుతున్నపుడు విశ్రమించమంటూ ఆతిధ్యమిచ్చిన పర్వతం ఎవరు?
జ:- మైనాకుడు.
83.ప్ర: హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరేమిటి?
జ:- సురస.
84.ప్ర:  హనుమంతుని నీడను ఆకర్షించి హనుమంతుని తనవైపు లాగిన సముద్ర జంతువు పేరేమిటి?
జ- సింహిక.
85.ప్ర:  హనుమంతుడు లంఘించిన సముద్రం పొడవెంత?
జ:- నూరు యోజనములు.
86.ప్ర:  లంకలో హనుమంతుడు దిగిన పర్వతం పేరేమిటి?
జ: లంబ పర్వతం.
87.ప్ర: హనుమంతుడు సీతను కనుగొన్న వనం పేరేమిటి?
జ;- అశోక వనం.
88. ప్ర: రావణుడు సీతకు ఎన్ని మాసములు గడువిచ్చెను?
జ:- రెండు.
89.ప్ర: రామునకు విజయము, రాక్షసులకు వినాశము వచ్చునని కలగన్న రాక్షస స్త్రీ ఎవరు?
జ:- త్రిజట.
90. ప్ర:  హనుమంతుడు చెట్టుపై దాగివుండి సీతకు వినబడునట్లు ఎవరి కథ వినిపించెను?
జ- రామ కథ.
91.ప్ర: రామునికి నమ్మిక కలుగుటకై సీత హనుమంతునికి యిచ్చిన ఆభరణం పేరేమిటి?
జ:- చూడామణి.
92.ప్ర:  హనుమంతుడు లంకలో ఎంతమంది రావణుని కింకరులను వధించెను?
జ:- ఎనభై వేలమంది.
93. ప్ర: హనుమంతుడు ఎవరి అస్త్రముచే బంధింపబడి రావణుని వద్దకు పోయెను?
జ:- ఇంద్రజిత్తు సంధించిన బ్రహ్మాస్త్రం.
94.ప్ర: దూతను వధించుట తగదని రావణునికి బోధించినదెవరు?
జ:- విభీషణుడు.
95. ప్ర: తిరిగి వచ్చిన హనుమంతునితో కలసి వానరులు ఆనందంతో ధ్వంసం చేసిన సుగ్రీవునికి యిష్టమైన వనం పేరేమిటి?
జ- మధువనం.
96. ప్ర: వానరులు వనం ధ్వంసం చేస్తున్న విషయం సుగ్రీవునికి చేరవేసిన దెవరు?
జ:- మధువన రక్షకుడూ, సుగ్రీవుని మేనమామ ఐన దధిముఖుడు.
97.  ప్ర: సీత జాడ తెలుసుకుని వచ్చిన హనుమంతునికి రాముడిచ్చిన బహుమతి?
జ:- ఆలింగన సౌభాగ్యం.
98. ప్ర: సముద్రం దాటుటకు నూరు యోజనములు సేతువు నిర్మించిన వానర ప్రముఖుడి పేరేమిటి?
జ:- నీలుడు.
99. ప్ర: ఇంద్రజిత్తు ఏ ప్రదేశంలో హోమం చేయుచుండగా లక్ష్మణుడు వధించెను?
జ:- నికుంభిల.
100. ప్ర:- మునికి ఆదిత్యహృదయం స్తోత్రమును ఉపదేశించిన ముని ఎవరు?
జ:- అగస్త్యుడు.
101.ప్ర:  రావణుని వధించుటకు రామునికి రథం పంపినదెవరు?
జ:- ఇంద్రుడు.
102.ప్ర:  రామ రావణ యుద్ధంలో రాముని రథసారధి ఎవరు?
జ:- మాతలి.
103.ప్ర:  రావణ వధానంతరం లంకనుండి సీతారామ లక్ష్మణ వానరులతో బయలుదేరిన పుష్పకవిమానం అయోధ్య చేరేలోపు ఎక్కడ, ఎవరికోసం ఆగుతుంది?
జ:- కిష్కింధలో, వానరుల భార్యలు కూడా పుష్పకవిమానంలో ఎక్కడం కోసం!
104.ప్ర: గుహునికి, భరతునికి తన రాకను తెలియచేయుటకు శ్రీరాముడు ఎవరిని ముందుగా పంపెను?
జ:- హనుమంతుడు.
105.ప్ర: అయోధ్యలో సీతారాముల ఊరేగింపు సమయంలో సుగ్రీవుడు ఎక్కిన ఏనుగు పేరేమిటి?
జ:- శత్రుంజయం.
106. ప్ర: శ్రీరాముడు అయోధ్యలో సుగ్రీవునికి అతిధి గృహంగా ఎవరి భవనము నిచ్చెను?
జ:- స్వయంగా తన భవనమునే యిచ్చెను.
107.ప్ర:  పట్టాభిషేక సమయంలో శ్రీరామునికి అలంకరించిన కిరీటం పూర్వం ఎవరిచే తయారు చేయబడినది?
జ:- బ్రహ్మ.
108.ప్ర: శ్రీరామ పట్టాభిషేకం తర్వాత సీతాదేవి హనుమంతునికిచ్చిన బహుమతి ఏమిటి?
జ:- తన మెడలోని ముత్యాలహారం.
కామెంట్‌లు